అద్దె మాటలు.. వైద్యవిద్యకు అవస్థలు
‘‘మా వల్లే నంద్యాలకు ప్రభుత్వ వైద్య కళాశాల వచ్చింది. ఇందుకు సంబంధించిన పనులూ శరవేగంగా జరుగుతున్నాయంటూ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్రెడ్డి గొప్పలు చెబుతున్నారు.. విద్యార్థులకు సౌకర్యాలు కల్పించకుండా తిప్పలు పెడుతున్నారు.
అందుబాటులోకి రాని శాశ్వత భవనాలు
మూడు నెలల్లో కొత్త విద్యార్థులకు ప్రవేశాలు
అద్దె భవనాల్లో ఉన్న నంద్యాల మెడికల్ కళాశాల వసతిగృహం
‘‘మా వల్లే నంద్యాలకు ప్రభుత్వ వైద్య కళాశాల వచ్చింది. ఇందుకు సంబంధించిన పనులూ శరవేగంగా జరుగుతున్నాయంటూ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్రెడ్డి గొప్పలు చెబుతున్నారు.. విద్యార్థులకు సౌకర్యాలు కల్పించకుండా తిప్పలు పెడుతున్నారు. సొంత భవనం లేక ప్రథమ ఏడాది విద్యార్థులు ప్రైవేటు భవనాల్లో ‘వసతి’ ఉంటున్నారు. సెప్టెంబరులో కొత్త విద్యార్థులు రానున్నారు. ప్రస్తుతం భవన నిర్మాణ పనులు చూస్తే అప్పటి వరకు పూర్తయ్యేలా లేవు.. మరి ఆ విద్యార్థులను ఎక్కడ ఉంచాలో తెలియడం లేదు.
న్యూస్టుడే, నంద్యాల పాతపట్టణం
రూ.475 కోట్లు కేటాయింపు
నంద్యాల ప్రభుత్వ మెడికల్ కళాశాల భవనాలు, ల్యాబ్స్, వసతిగృహాలతో పాటు 330 పడకల ఆసుపత్రి నిర్మాణానికి రూ.475 కోట్లు కేటాయించారు. 2022 సెప్టెంబరులో ఆర్ఏఆర్ఎస్ స్థలంలో నిర్మాణాలు చేపట్టారు. విద్యార్థులకు తరగతుల నిర్వహణ కోసం తాత్కాలికంగా గదులు నిర్మించారు. ప్రస్తుతం వాటిలో మొదటి ఏడాది విద్యార్థులకు తరగతులు బోధిస్తున్నారు. మొదటి విద్యా సంవత్సరం పూర్తయ్యేలోపు శాశ్వత భవనాలను అందుబాటులోకి తెస్తామని ప్రజాప్రతినిధులు చెప్పారు. ఇప్పటి వరకు రూ.100 కోట్ల విలువైన పనులు మాత్రమే చేయగలిగారు.
రూ.లక్షల్లో అద్దెభారం
ప్రస్తుతం 150 మంది విద్యార్థులు ప్రథమ సంవత్సరం ఎంబీబీఎస్ చదువుతున్నారు. వీరిలో 80 విద్యార్థినులకు వ్యవసాయ శాఖకు సంబంధించిన పాత భవనాలను ఆధునికీకరించి వసతిగృహం నిర్వహిస్తున్నారు. 70 మంది విద్యార్థులకు ప్రైవేటు భవనంలో వసతి కల్పించారు. ఇందుకు గాను నెలకు రూ.1.30 లక్షలు అద్దె చెల్లిస్తున్నారు. దీంతో ఏడాదికి రూ.15.60 లక్షల మేరకు భారం పడుతోంది. ఏడాది పూర్తవుతున్నా శాశ్వత భవనాలు అసంపూర్తిగానే ఉన్నాయి.
కొత్త వారొస్తే పరిస్థితేంటి
ప్రస్తుతం ఉన్న 150 మంది విద్యార్థులకే తాత్కాలిక భవనాల్లో వసతిగృహాలు, తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబరులో మరో ఏడాది ఎంబీబీఎస్ విద్యార్థులు 150 మంది ప్రవేశాలు పొందనున్నారు. వారికి అవసరమైన తరగతి గదులు, వసతిగృహాల నిర్మాణాలు పూర్తి కాకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
నూతన ప్రవేశాలపై ప్రభావం!
మెడికల్ కళాశాలకు సంబంధించిన భవనాలు, వసతిగృహాల నిర్మాణాలు నత్తనడక జరుగుతుండటంతో నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) బృందం పరిశీలనకు వస్తే పరిస్థిటేంటని కళాశాల ఉన్నతాధికారులు ఆందోళన చెందుతున్నారు. ఈ పాటికే ఎన్ఎంసీ బృందం పరిశీలనకు రావాల్సి ఉన్నా ఆలస్యమైంది. వారి పరిశీలనలో ఇక్కడ వైద్య కళాశాల నిర్వహణకు మౌలిక వసతులు లేవని నిర్ధారణ జరిగితే వచ్చే ఏడాది ప్రవేశాలపై ప్రభావం చూపే ప్రమాదముంది. మరోవైపు పనులు సకాలంలో పూర్తి కాకపోతే కొత్త విద్యార్థులకు కూడా భవనాలను అద్దెకు తీసుకుని వసతిగృహాలు నిర్వహించాల్సి వస్తుంది. దీనివల్ల అద్దె భారం తడిసి మోపెడవుతుంది.
రూ.47 కోట్ల బిల్లుల బకాయితో నత్తనడకన పనులు
మెడికల్ కళాశాలకు ప్రస్తుతం సుమారు రూ.100 కోట్ల మేరకు పనులు చేశారు. అందులో రూ.47 కోట్ల బిల్లులు బకాయిలో ఉన్నట్లు సమాచారం. అందులో కొంత మేరకు నింధులు మంజూరు కావడంతో కొద్దిపాటి పనులు చేస్తున్నారు. దీంతో సకాలంలో పూర్తి కావాల్సిన కళాశాల తరగతులు, వసతిగృహాలు నిర్మాణ దశలోనే ఉన్నాయి. ఆ నిధులు విడుదల చేస్తే తప్ప పనులు వేగవంతమయ్యే విధంగా కనిపించడం లేదు. దీంతో పనులు మందగించడంతో ఇంజినీర్లు సైతం ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి దాపరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అహోబిలంలో ఘనంగా నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు
[ 18-05-2024]
ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన అహోబిలంలో వైశాఖమాస నరసింహ స్వామి జయంతి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. -
నిలిచిన విద్యుత్తు సరఫరా
[ 18-05-2024]
వ్యవసాయం: పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రెండు రోజులుగా విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. -
వైభవంగా వాసవి దేవి జయంతి పూజలు
[ 18-05-2024]
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని నగరేశ్వర స్వామి ఆలయంలో వాసవి దేవి జయంతి పూజలు శనివారం వైభవంగా జరిగాయి. -
బ్యాంకు ఖాతా నుంచి రూ.5 లక్షలు చోరి
[ 18-05-2024]
మండలంలోని కొటేకల్కు చెందిన ఇబ్రహీం బ్యాంకు ఖాతా నుంచి సైబర్ నేరగాళ్లు రూ.5లక్షలు దొంగలించారు. -
శుకనంపై చిరుత దాడి
[ 18-05-2024]
సున్నిపెంటలోని వెస్ట్రన్ కాలనీలో ఓ ఇంటి ఆవరణలో పెంపుడు శునకంపై చిరుత పులి దాడి చేసి హతమార్చింది. -
ఎన్నికల పారితోషికం.. ఎందుకింత వ్యత్యాసం
[ 18-05-2024]
సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహించిన ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు (పీవో, ఏపీవో), ఇతర పోలింగ్ సిబ్బందికి ఇవ్వాల్సిన పారితోషికాల్లో అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరించారని ఉద్యోగులు మండిపడుతున్నారు. -
పత్తి విత్తనం.. నకిలీ పెత్తనం
[ 18-05-2024]
ఖరీఫ్ సీజన్ ముంచుకొస్తోంది.. ఇటీవల వరుసగా వర్షాలు కురుస్తున్నాయి.. నేల బాగా నానడంతో రైతులు దుక్కులు దున్నుతున్నారు.. విత్తన సేకరణలో నిమగ్నమయ్యారు. -
కాల్వల్లో మన్ను.. వీధుల్లో మడుగు
[ 18-05-2024]
పురపాలకాల్లో ఏటా ఇంటి పన్ను 15 శాతం పెంచుతున్నారు.. కుళాయి పన్ను చెల్లించకుంటే కనెక్షన్ తొలగిస్తున్నారు.. వీధుల్లోకి వరద వస్తే మాత్రం పట్టించుకోవడం లేదు. -
అవసరం 46,98,726 వచ్చింది 5,40,752
[ 18-05-2024]
నెల రోజుల్లో పాఠశాలలు పునఃప్రారంభంకానున్నాయి.. మొదటి రోజే విద్యార్థులందరికీ పుస్తకాలిస్తామని ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. -
అందని బియ్యం..పేదల ఆగ్రహం
[ 18-05-2024]
హొళగుంద మండల పరిధిలోని గజ్జహళ్లిలో 17 రోజులైనా రేషన్ బియ్యం ఇవ్వలేదని గ్రామ సచివాలయం ఎదుట శుక్రవారం ఆందోళన చేపట్టారు. రామలింగ, శేఖర్, మంజు, మల్లమ్మ మాట్లాడుతూ 50 కుటుంబాలకు బియ్యం అందలేదన్నారు. -
ఇసుకను తోడేస్తున్నారా? ఫోన్ చేయండి
[ 18-05-2024]
తుంగభద్ర నదిలో జరుగుతున్న ఇసుక తవ్వకాలపై ‘‘మా రీచ్లపై కన్నేయండి’’ శీర్షికన ‘ఈనాడు’లో శుక్రవారం కథనం ప్రచురితమైంది.. గనులు, భూగర్భశాఖ అధికారులు స్పందించారు. -
రాబోయే ఐదు రోజులు తేలికపాటి వర్షాలు
[ 18-05-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో రాబోయే ఐదు రోజుల్లో చిరు జల్లుల నుంచి తేలికపాటి వర్ష సూచన ఉందని శుక్రవారం బనవాసి ఫారం కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త అశోక్కుమార్ తెలిపారు. -
మోహినీ రూపంలో జ్వాలా నృసింహుడు
[ 18-05-2024]
అహోబిలం జ్వాలా నృసింహస్వామి మోహినీ అలంకృతులై భక్తులకు దర్శనమిచ్చారు. వైశాఖ మాస నృసింహ జయంతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎగువ అహోబిలంలో స్వామికి మోహినీ అలంకారం చేశారు. -
చంద్రబాబును కలిసిన టీజీ భరత్
[ 18-05-2024]
కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి టీజీ భరత్ శుక్రవారం హైదరాబాద్లో తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడును మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించారు. -
అధునాతన సౌకర్యాలు.. ఆదర్శ ఫలితాలు
[ 18-05-2024]
ఉమ్మడి జిల్లాలోని ఆదర్శ కళాశాలల్లో ఇంటర్మీడియట్లో చేరేందుకు పదోతరగతి ఉత్తీర్ణులైన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. -
శ్రీమఠంలో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి
[ 18-05-2024]
రాఘవేంద్రస్వామి దర్శనార్థం కర్నూలు అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి జి.భూపాల్రెడ్డి కుటుంబ సభ్యులతో శుక్రవారం మంత్రాలయం వచ్చారు. -
పెద్దాస్పత్రిలో పిచ్చికుక్క స్వైరవిహారం
[ 18-05-2024]
కర్నూలు నగరంలోని సర్వజన వైద్యశాలలో పిచ్చికుక్క శుక్రవారం ఉదయం స్వైరవిహారం చేసింది. దీంతో రోగులు పరుగులు తీశారు. -
బాధిత కుటుంబానికి రూ.25 లక్షలు చెల్లించండి
[ 18-05-2024]
రహదారి ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తికి సంబంధించి ఆ కుటుంబానికి బీమా పరిహారం చెల్లించాల్సిందేనని ఆదిత్య బిర్లా సంస్థను జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
పల్నాడులో హింసాత్మక ఘటనలపై భారీగా కేసులు నమోదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
రాహుల్ వద్ద ఉన్నది చైనా రాజ్యాంగం : బిశ్వశర్మ పోస్ట్
-
పుతిన్ పర్యటన వేళ.. చైనాకు జెలెన్స్కీ అభ్యర్థన
-
మోదీ వ్యాఖ్యలపై ఈసీ చర్యలు తీసుకోవాలి: మల్లికార్జున్ ఖర్గే
-
రీడర్స్ డైజెస్ట్.. యూకేలో ముగిసిన 86 ఏళ్ల ప్రయాణం