logo

విద్యుదాఘాతంతో గడ్డివాము దగ్ధం

కర్నూల్‌ జిల్లా సీ బెళగల్‌ మండలం కొండాపురం గ్రామంలో  విద్యుదాఘాతంతో  గడ్డివాము దగ్ధమైంది.

Published : 06 May 2024 12:44 IST

సీ బెళగల్‌ :  కర్నూల్‌ జిల్లా సీ బెళగల్‌ మండలం కొండాపురం గ్రామంలో  విద్యుదాఘాతంతో  గడ్డివాము దగ్ధమైంది. సోమవారం తెల్లవారుమున  ఈదురు గాలులు వీచడంతో గ్రామానికి సమీపంలో  పొలంలో  ఉన్న  విద్యుత్‌ తీగల రాపిడి జరిగి గడ్డివాముకు మంటలు అంటుకున్నాయి. స్థానికులు  అందించిన సమాచారంతో  కోడుమూరు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలు అదుపు చేశారు. ప్రమాదంలో  సుమారు రూ.2 లక్షలు ఆస్తినష్టం జరిగినట్లు రైతు సుదర్శనం తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని