ఈ ఏడాది లేనట్లేనా?
విద్యా సంవత్సరం ప్రారంభానికి 9 రోజులే మిగిలింది. అప్పటి లోగా ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం కింద పాఠశాలల వద్ద చేపట్టిన భవన నిర్మాణాలు పూర్తయ్యేలా కనిపించడం లేదు. వారంలో రెండు రోజులు పనులు చేస్తే.. నాలుగు రోజులు నిలిపేస్తున్నారు.
అసంపూర్తిగా పాఠశాల భవన నిర్మాణాలు
అయిజ బాలుర ఉన్నత పాఠశాల వద్ద భవన నిర్మాణ పరిస్థితి
అయిజ, న్యూస్టుడే: విద్యా సంవత్సరం ప్రారంభానికి 9 రోజులే మిగిలింది. అప్పటి లోగా ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం కింద పాఠశాలల వద్ద చేపట్టిన భవన నిర్మాణాలు పూర్తయ్యేలా కనిపించడం లేదు. వారంలో రెండు రోజులు పనులు చేస్తే.. నాలుగు రోజులు నిలిపేస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడింది. ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. కొత్త విద్యా సంవత్సంలో కొత్త భవనాల్లో విద్యనభ్యసించాల్సిన విద్యార్థులు ఈఏడాది కూడా పాత ఇబ్బందులు తప్పేలా లేవు. ఉమ్మడి జిల్లాలో కొన్ని పాఠశాలలను పరిశీలిస్తే వచ్చే విద్యా సంవత్సరానికి కూడా పూర్తికావేమోనన్న అనుమానం తలెత్తుతోంది. మహబూబ్నగర్, జోగులాంబ గద్వాల, వనపర్తి, నాగర్కర్నూల్, నారాయణపేట జిల్లాల్లో కలిపి 3,205 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. ఉమ్మడి జిల్లాలో తొలి విడతగా 1,099 పాఠశాలలను ఎంపిక చేసినప్పుడు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సంతోషించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎంపికైన వాటిలో 30 శాతం భవనాలు కూడా పూర్తికాలేదు.
సమస్యలు ఎక్కడెక్కడ
* గద్వాల ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల వద్ద రూ.46 లక్షలతో పనులు కొనసాగుతున్నాయి. మరుగుదొడ్ల నిర్మాణానికి స్లాబు వేశారు. ఈఏడాది పనులు పూర్తయ్యే అవకాశాలు లేవు. పాత భవనానికి ప్యాచ్ వర్క్ చేశారు. తలుపులు, కిటికీలు, ఫ్యాన్లు, ఫర్నీచర్ ఏర్పాటు చేయాల్సి ఉంది.
* అయిజ బాలుర ఉన్నత పాఠశాలలో 600 మంది విద్యార్థులు ఉన్నారు. రూ.36 లక్షలతో భవన నిర్మాణానికి పనులు మొదలు పెట్టారు. ఎస్సీ కాలనీలోని పీఎస్ పాఠశాలలో 180 మంది విద్యార్థులు ఉన్నారు. రూ.32 లక్షలతో పనులు ప్రారంభించారు. ఇప్పట్లో పూర్తయ్యేలా పరిస్థితి కనిపించడం లేదు.
* నారాయణపేట జిల్లాలోని బలబద్రాయపల్లిలో ప్రాథమిక పాఠశాలలో రూ.12 లక్షలతో పనులు చేస్తున్నారు. మరుగుదొడ్లు ఇంకా పూర్తికాలేదు. సుమారు 300 మంది విద్యార్థులున్నారు. సంజగంపేటలోని పీఎప్ పాఠశాలలో రూ. 18 లక్షలతో పనులు మొదలు పెట్టారు. ఇక్కడ కూడా మరుగుదొడ్లు పూర్తికాలేదు. ప్రహరీ నిర్మాణం కొనసాగుతోంది.
* నాగర్కర్నూల్ మండలం గగ్గలపల్లి ఉన్నత పాఠశాల ఆవరణలో రూ.25 లక్షలతో పనులు మొదలు పెట్టారు. స్లాబు పనులు పూర్తి కాలేదు. ప్రహరీ నిర్మాణం చేపట్టాలి. నాగర్కర్నూల్ పట్టణంలోని పీఎస్ పాఠశాల ఆవరణలో రూ.15 లక్షలతో పనులు ప్రారంభించారు. సుమారు 80 మంది విద్యార్థులున్నారు. ఈఏడాది వీరికి ఇబ్బందులు తప్పేలా లేవు.
* వనపర్తి జిల్లాలోని జూరాలలో పీఎస్ పాఠశాల భవనాన్ని రూ.23 లక్షతో ప్రారంభించారు. గోడలు నిర్మించాల్సి ఉంది. మరుగుదొడ్లు, ప్రహరీని నిర్మించలేదు. పెబ్బేరులోని చెలిమిల్ల గ్రామ పీఎస్ పాఠశాల ఆవరణలో రూ. 24 లక్షలతో చేపట్టిన పనులు ఇంకా పూర్తి కాలేదు.
* మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలం అమిస్తాపూర్లో ఉన్నత పాఠశాలలో రూ.30 లక్షలతో పనులు మొదలు పెట్టారు. పాతభవనంలోని నాలుగు గదులను కూల్చి అదే స్థానంలో కొత్త భవవం నిర్మిస్తున్నారు. సుమారు 400 మంది విద్యార్థులున్నారు. ప్రస్తుతం పనులు కొనసాగుతున్నాయి.
పూర్తయ్యేలా చూస్తాం
పాఠశాలల వద్ద మొదలైన భవన నిర్మాణాలను త్వరగా పూర్తయ్యేలా చూస్తాం. సంబంధిత అధికారులు, గుత్తేదారులతో మరోసారి మాట్లాడతాం. పనులు వేగవంతం చేసి సాధ్యమైనంత వరకు పూర్తిచేసే ప్రయత్నం చేస్తాం. జిల్లాలో భవన నిర్మాణ పరిస్థితిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం.
సిరాజుద్దీన్, జిల్లా విద్యాధికారి, జోగులాంబ గద్వాల
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎం సభ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
[ 04-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎర్రవల్లి మండల కేంద్రంలో జరగనున్న జన జాతర సభ భద్రత ఏర్పాట్లను శనివారం జిల్లా కలెక్టర్ సంతోష్... -
కాంగ్రెస్ నాయకుల ఇంటింటి ప్రచారం
[ 04-05-2024]
మండల కేంద్రమైన రాజోలి గ్రామంలో శనివారం కాంగ్రెస్ నాయకులు ప్రచారం నిర్వహించారు. పార్టీ మండల అధ్యక్షుడు దస్తగిరి ఆధ్వర్యంలో ఓటర్ల ఇళ్లకు వెళ్లి... -
పాలమూరుకు అగ్రనేతలు
[ 04-05-2024]
పాలమూరులో ఎన్నికల ప్రచారానికి ప్రధాన పార్టీలకు చెందిన అగ్రనేతలు రానున్నారు. పోలింగ్ గడువు దగ్గర పడుతుండటంతో ఆయా పార్టీలు ప్రచారాన్ని ఉద్ధృతం చేశాయి. -
పీఎంశ్రీకి మరో 46 పాఠశాలలు
[ 04-05-2024]
సర్కారు బడుల బలోపేతమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పీఎంశ్రీ (ప్రధాన మంత్రి స్కూల్స్ ఫర్ రైసింగ్ ఇండియా) యోజనను గత విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తోంది. -
పులులకు ఆవాసం.. గ్రామస్థులకు పునరావాసం
[ 04-05-2024]
ఆక్రమణలు, అభివృద్ధి పేర నానాటికి కుంచించుకు పోతున్న అటవీ ప్రాంతంతో అడవికి రారాజైన పెద్దపులుల ఉనికికి భంగం కలుగుతోంది. నల్లమలలో -
ఉత్తర భారతంలో భాజపాకు సగం సీట్లే
[ 04-05-2024]
ఉత్తర భారతదేశంలో జరిగిన ఎన్నికల్లో భాజపాకు సగం సీట్లు కూడా రావడం లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. -
పురపాలిక.. మేల్కోవాలిక!
[ 04-05-2024]
మహబూబ్నగర్ పురపాలక సంఘ భవనం పూర్తిగా దెబ్బతింది. భవనం పిల్లర్లు, సజ్జలు, గోడలు, మెట్లు పెచ్చులు ఊడుతున్నాయి. -
విలక్షణ పోరు.. ఇక్కడి తీరు
[ 04-05-2024]
నాగర్కర్నూలు లోక్సభ నియోజకవర్గం 1967లో ఏర్పాటైంది. ఇప్పటి వరకు 14సార్లు ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం 15వ సారి ఎన్నిక జరుగుతోంది. -
మళ్లీ మోసపోవద్దు
[ 04-05-2024]
గత శాసనసభ ఎన్నికల్లో ఆరు గ్యారంటీలు నమ్మి మోసిపోయినట్లుగా ఇపుడు మళ్లీ బుట్టలోపడొద్దని మహబూబ్నగర్ లోక్సభ స్థానం భాజపా అభ్యర్థి డీకే అరుణ అన్నారు. -
భాజపాతోనే భారత్ వికాసం : భరత్ ప్రసాద్
[ 04-05-2024]
దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే మోదీ విజన్తోనే సాధ్యమని నాగర్కర్నూల్ పార్లమెంట్ స్థానం భాజపా అభ్యర్థి భరత్ ప్రసాద్ పేర్కొన్నారు. -
ప్రవీణ్కుమార్ ప్రచారంలో ఉద్రిక్తత
[ 04-05-2024]
నాగర్కర్నూల్ జిల్లా బల్మూర్ మండల కేంద్రంలో చేపట్టిన భారాస ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ లోక్సభ ఎన్నికల ప్రచారం ఉద్రిక్తతకు దారి తీసింది. -
మోదీ హయాంలో దేశం 30 ఏళ్ల వెనుకబాటు
[ 04-05-2024]
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదేళ్ల పాలనలో దేశాన్ని ముప్పై ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. -
ప్రజాపాలన కాంగ్రెస్తోనే సాధ్యం
[ 04-05-2024]
రాష్ట్రంలో ప్రజాపాలనకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వెంటే జిల్లా ప్రజలు ఉన్నారని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి తెలిపారు. -
మంచినీటికి ముప్పుతిప్పలు
[ 04-05-2024]
జిల్లా కేంద్రమైన వనపర్తిలో తాగునీటి సమస్య రోజురోజుకు పెరిగిపోతోంది. పురపాలక సంఘంలోని పలు కాలనీలకు రామన్పాడు తాగునీటిని పూర్తిస్థాయిలో సరఫరా చేయడం లేదు. -
ఓటుకు తప్పని దూరాభారం
[ 04-05-2024]
ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం విస్తృత ప్రచారం చేస్తున్నా, కొన్ని తండాలవాసులు ఓటేయడానికి దూరం వెళ్లాల్సివస్తోంది. -
రేపటి నీట్కు 11 కేంద్రాలు
[ 04-05-2024]
వైద్యవిద్య కోర్సులో ప్రవేశాల కోసం ఈ నెల 5న నిర్వహించే నీట్కు ఉమ్మడి పాలమూరులో 11 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. -
ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఊరట
[ 04-05-2024]
ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించడానికి జిల్లా అధికారులు చర్యలు చేపట్టారు. విద్యార్థులకు ఈనెల 24 నుంచి 30 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు బోర్డు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
లైంగిక దౌర్జన్యం కేసు.. ప్రజ్వల్ రేవణ్ణ ఇంటికి సిట్
-
రింకుకు అందుకే చోటు దక్కలేదు.. బెస్ట్ టీమ్ సెలక్షన్: గంగూలీ
-
విరాట్ స్ట్రైక్రేట్పై విమర్శల్లో వారిది ద్వంద్వ వైఖరి: భారత మాజీ క్రికెటర్లు
-
ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేత.. ఎన్నికల వేళ కేంద్రం నిర్ణయం
-
17మంది రోగులను హత్య చేసిన నర్సు..700 ఏళ్ల జైలు శిక్ష
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM