మండేకాలం.. వద్దు నిర్లక్ష్యం!
వేసవి కాలంలో వాహనాల్లో పొగలు రావడం.. కార్లలో మంటలు ఎగిసిపడటం.. ద్విచక్ర వాహనాల టైర్లు పేలిపోవడం చూస్తుంటాం.. వాహనం ఇంజిన్లో నిప్పురవ్వలు వచ్చి పెద్దఎత్తున మంటలు వస్తే ఏకధాటిగా ప్రయాణం
వాహనాల నిర్వహణలో జాగ్రత్తలు అవసరం
న్యూస్టుడే, మహబూబ్నగర్ పట్టణం
వేసవి కాలంలో వాహనాల్లో పొగలు రావడం.. కార్లలో మంటలు ఎగిసిపడటం.. ద్విచక్ర వాహనాల టైర్లు పేలిపోవడం చూస్తుంటాం.. వాహనం ఇంజిన్లో నిప్పురవ్వలు వచ్చి పెద్దఎత్తున మంటలు వస్తే ఏకధాటిగా ప్రయాణం చేయడంతోనే ఇలా జరిగిందని చాలా మంది భావిస్తుంటారు. అది తప్పని, వాహనంలో మంటలకు అనేక కారణాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వేసవి నేపథ్యంలో ప్రమాదాల బారిన పడకుండా వాహనదారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తూ ‘న్యూస్టుడే’ కథనం.
కార్లలో జాగ్రత్తలు ఇలా..
కూలెంట్లో నీరు కీలకం
కారు ఇంజిన్లో కూలింగ్ విధానం ఉంటుంది. రేడియేటర్లో నీరు తగ్గకుండా చూసుకోవాలి. కూలెంట్ లెవల్ తక్కువగా ఉంటే డిస్టిల్ వాటర్తో సరిచేసుకోవాలి. లీకేజీ ఉంటే మరమ్మతు చేసుకోవాలి. ఇంజిన్ ఓవర్ హీట్ అయితే కూలెంట్ లీకేజీలు ఏమైనా ఉన్నాయా పరిశీలించి మెకానిక్ను సంప్రదించాలి.
ఇంజిన్ ఆయిల్ పరిశీలన
కూలెంట్ మాదిరిగానే కారులో ఇంజిన్ ఆయిల్ను కూడా తరచూ చూసుకోవాలి. ఆయిల్ లీకేజీలు ఉన్నా వాహనం వేడెక్కుతుంది. ఓవర్ హీట్ వల్ల మంటలు వచ్చే ప్రమాదముంటుంది. ఇంజిన్ ఆయిల్ తక్కువగా ఉన్నా ఇంజిన్ వేడెక్కుతుంది. ఆగకుండా వాహనం నడిపితే ఇంజిన్పై భారం పడుతుంది.
తగినంత గాలి ఉండాలి
కార్ల నాలుగు చక్రాలను గమనిస్తూ ఉండాలి. టైర్ల కండీషన్ బాగా లేకుంటే మార్చేయాలి. నిపుణులు సూచించిన మేర టైర్లలో గాలి నింపాలి.
బ్యాటరీలో వైర్లు
కారుకు అదనంగా లైట్లు, హారన్లు ఇతరాలు అమర్చుకోవద్దు. కంపెనీ నుంచి వచ్చిన లైట్లకే అనుకూలంగా వైర్లు ఉంటాయి. స్థానికంగా దొరికే మన్నిక లేని తీగలు అమరిస్తే బ్యాటరీకి షార్ట్సర్క్యూట్ తలెత్తి మంటలు వస్తాయి.
ద్విచక్ర వాహనదారులకు సూచనలు
పెట్రోలు లీకేజీలతో ప్రమాదం..
వేసవిలో పెట్రోలు, డీజిల్ కార్లతో పాటు ద్విచక్రవాహనాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వాహనాల్లో ఏ చిన్నపాటి లీకేజీలున్నా అగ్గికి ఆజ్యం పోసినట్లే అవుతుంది. ఏ చిన్న మరమ్మతులు అవసరమైనా వెంటనే చేయించాలి.
ట్యాంకు నిండా పెట్రోలు వద్దు
వేసవిలో ద్విచక్ర వాహనాల్లో ఒకటి, రెండు కంటే ఎక్కువ లీటర్లు పెట్రోల్ ఉండొద్దు. నిండా ఇంధనం ఉంటే ఉష్ణోగ్రతతో పీడనం పెరిగి ట్యాంకు పేలిపోయే ప్రమాదముంటుంది.
- బంకులో పెట్రోలు పోయించుకునేందుకు వరుస క్రమంలో వాహన చోదకులు బారులు తీరుతుంటారు. తమ వంతు రాకముందే ట్యాంకు మూత తీసి ఉంచొద్దు.
- ఆయిల్గా తక్కువగా ఉంటే ఇంజిన్ వేడెక్కుతుంది. ద్విచక్ర వాహనం చైన్కు తరచూ లూబ్రికేషన్ చేయించాలి. ఎండకు లూబ్రికేంట్లు ఎండటంతో వాహనం వేడెక్కుతుంది. ప్రీమియం వాహనాల్లో కూలెంట్ క్రమం తప్పకుండా పరిశీలిస్తుండాలి.
- బ్యాటరీ కరెంట్, పెట్రో లీకేజీలను పరిశీలించాలి. చిన్న చిన్న మంటలు రాజుకునే ప్రమాదం ఉంటుంది. పెట్రోలు ట్యాంక్పై కవర్ కప్పి ఉండాలి.
సామర్థ్యం లేని టైర్లతో ముప్పు
వేసవిలో టైర్లు పేలిపోతుంటాయి. గ్రిప్లేని పాత టైర్లు ఉంటే తొలగించి మంచివి వేసుకోవాలి. నైట్రోజన్ గాలి నింపుకోవాలి. వాహనం నీడలో నిలపాలి. అవసరమైతే కవర్ కప్పాలి.
ఆగుతూ ప్రయాణించాలి
- శివకుమార్, సహాయ వర్క్స్ మేనేజర్, మారుతి షోరూం
కార్లు బయటకు తీసే సమయంలోనే ఇంజిన్ ఆయిల్, కూలెంట్ పరిశీలించుకోవాలి. వాహనం కండీషన్ ఉంటే ఆగకుండా 200 నుంచి 300 కి.మీ.ల మేర ఆగకుండా ప్రయాణం చేయొచ్చు. వేసవిలో వాహనాలకు షోరూంలోలో సాధారణ చెకప్లు చేయించుకోవాలి.
అన్నీ సరిచూసుకోవాలి..
- షేఖ్ ఖలీల్, మెకానికల్ మేనేజర్, హీరో షోరూం
వేసవిలో ద్విచక్ర వాహనాల్లోనూ సమస్యలు వస్తుంటాయి. ట్యాంకు నిండా పెట్రోలు కొట్టించినా ప్రమాదం వాటిల్లే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. టైరు సామర్థ్యాన్ని బట్టి గాలి నింపుకోవాలి. తరచూ ఆయిల్ చెక్ చేసుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటు హక్కుపై మహిళలకు అవగాహన
[ 27-04-2024]
మండల కేంద్రమైన రాజోలి గ్రామంలో శనివారం ఓటు హక్కుపై మహిళా సంఘాల సభ్యులకు అవగాహన కల్పించారు. -
పోరుబాటతో గులాబీ శ్రేణుల్లో జోష్
[ 27-04-2024]
భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ‘పోరుబాట’ బస్సుయాత్ర శుక్రవారం మహబూబ్నగర్లో విజయవంతం కావడంతో గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. పాలమూరులో రెండు రోజులపాటు కొనసాగే ఈ కార్యక్రమానికి మొదటి రోజు పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. -
తుది జాబితాపై కసరత్తు పూర్తి
[ 27-04-2024]
పాలమూరులో ఓటర్ల తుది జాబితాపై కసరత్తు పూర్తయ్యింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎస్ఎస్ఆర్-2024కు అదనంగా కొత్త ఓటర్లను జత చేసి తుది జాబితాను ఒకటి, రెండు రోజుల్లో ప్రకటించనున్నారు. -
గంజాయి దందా.. యువతే నిండా
[ 27-04-2024]
పాలమూరు పట్టణంలో గంజాయి వ్యాపారం చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఎక్సైజ్, పోలీసు శాఖలు నిఘా పెట్టినా.. వారి కళ్లు గప్పి గంజాయిని విక్రయిస్తూనే ఉన్నారు. ఈ కేసులో అరెస్టయి జైలుకు వెళ్లిన వాళ్లు కూడా బయటకు వచ్చాక మళ్లీ అదే దందా చేస్తున్నారు. -
పాలమూరు సిబ్బందికి పరీక్ష!
[ 27-04-2024]
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పాలమూరు విశ్వవిద్యాలయం (పీయూ)లో పనిచేస్తున్న బోధనేతర సిబ్బందికి అధికారులు ‘పరీక్ష’ నిర్వహించేందుకు సన్నాహాలు చేయటం దుమారం రేపుతోంది. -
35 నామపత్రాల ఆమోదం.. ఏడు తిరస్కరణ
[ 27-04-2024]
మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గానికి దాఖలైన నామపత్రాలను అధికారులు నిశితంగా పరిశీలించారు. శుక్రవారం కలెక్టరేట్లో ఎన్నికల సాధారణ పరిశీలకుడు షెవాంగ్ గ్యాచో భూటియా, రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ జి.రవి నాయక్ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ చేపట్టారు. -
గుంభనంగా ద్వితీయ శ్రేణి
[ 27-04-2024]
అసెంబ్లీ ఎన్నికలకు, లోక్సభ ఎన్నికలకు ప్రచారంలో తేడా ఉంది. అగ్రనాయకుల హడావుడి తప్పా కింది స్థాయి నాయకుల్లో ఇంకా ఎన్నికల ఉత్సాహం కనిపించడం లేదు. నామినేషన్ల ప్రక్రియ మొదలైనప్పటికీ కార్యకర్తల్లో ఉత్తేజం కనిపించడం లేదు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత వెంటనే ఈ ఎన్నికలు రావడంతో అంతటా స్తబ్ధత నెలకొంది. -
అరచేతిలో సకల సమాచారం
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పక్కాగా ఏర్పాట్లు చేసింది. డిజిటల్ సాంకేతికత వినియోగించుకుంటూ ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు అడుగులు వేస్తోంది. -
పెళ్లిళ్లు, శుభకార్యాలకు విరామం
[ 27-04-2024]
పెళ్లిళ్లు, శుభకార్యాలకు శనివారం నుంచి బ్రేక్ పడనుంది. మూఢం వచ్చేసింది. గ్రహాల స్థితి సరిగా లేని సమయాన్ని మూఢంగా జ్యోతిష్యులు చెబుతారు. గురుగ్రహం సూర్యుడికి దగ్గరగా వచ్చినపుడు గురుమౌఢ్యంగా, శుక్రగ్రహం సూర్యగ్రహనికి దగ్గర వచ్చినప్పుడు శుక్ర మౌఢ్యంగా పిలుస్తారు. -
కాంగ్రెస్ అభ్యర్థి గెలవరనే ఆందోళనలో సీఎం
[ 27-04-2024]
మహబూబ్నగర్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గెలిచే పరిస్థితి లేకపోవటంతో తన పదవి ఊడుతుందని సీఎం రేవంత్రెడ్డి భయపడుతున్నారని, అందుకే మహబూబ్నగర్లో తరచూ పర్యటిస్తూ భాజపా అభ్యర్థి డీకే అరుణపై నోరు పారేసుకుంటున్నారని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ విమర్శించారు. -
బీ ఫాం ఉన్న వారికే పార్టీ గుర్తు
[ 27-04-2024]
గ్రామ పంచాయతీ ఎన్నికలు మినహా మిగతా అన్ని ఎన్నికల్లో అభ్యర్థులు రాజకీయ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తే బీ ఫారం అందజేయాల్సి ఉంటుంది. ఒక రాజకీయ పార్టీ తరపున ఏ అభ్యర్థి అయితే బీ ఫారం అందజేస్తారో ఆ అభ్యర్థికే పార్టీ గుర్తు కేటాయిస్తారు. -
ప్రతి ఓటరుకు స్లిప్పు అందేలా చర్యలు: కలెక్టర్
[ 27-04-2024]
ప్రతి ఓటరుకు ఓటరు స్లిప్పు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ ఉదయ్కుమార్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. -
తెల్లజొన్నలకు పచ్చరంగు
[ 27-04-2024]
పచ్చజొన్నలకు మార్కెట్లో విపరీతంగా డిమాండ్ ఉండటంతో జోరుగా కల్తీ జరుగుతోంది. ఆరోగ్య సమస్యల దృష్ట్యా మధుమేహం, రక్తపోటు తదితర సమస్యలతో బాధపడుతున్న వారు బియ్యంనకు బదులు పచ్చజొన్నలపై ఆసక్తి కనబరుస్తున్నారు. -
తనిఖీలు చేపట్టి చర్యలు తీసుకుంటాం..
[ 27-04-2024]
నిత్యవసర సరకులు, తినుబండారాలను కల్తీ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. సహజ సిద్ధంగా పండిన జొన్నలను కల్తీ చేస్తున్నట్లు సమాచారం ఉంది. -
లక్ష్యం బారెడు... సేకరణ మూరెడు
[ 27-04-2024]
జిల్లాలో యాసంగి ధాన్యం సేకరణ లక్ష్యం సుదూరంగా కనిపిస్తోంది. పౌరసరఫరాలశాఖ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 27 రోజులు కావస్తున్నా ఇంతవరకు అనుకున్న లక్ష్యంలో కనీసం ఒకశాతం కూడా సేకరించలేదు. -
సేవల సౌలభ్యానికి అంగన్వాడీల సర్వే
[ 27-04-2024]
అయిజ పట్టణంలోని భరత్నగర్ కాలనీకి చెందిన శాంతమ్మ టీచర్స్ కాలనీలో ఉన్న అంగన్వాడీ కేంద్రం పరిధిలో ఉంది. సుమారు అర కిలోమీటర్ దూరంలో ఉంటుంది. రోజూ వెళ్లి రావాలంటే ఇబ్బంది. చిన్నారులను కేంద్రానికి పంపాలన్నా ఇబ్బందే.
తాజా వార్తలు (Latest News)
-
ఆర్చరీ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్.. మూడు స్వర్ణాలు కైవసం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఐదు రోజులుగా టీవీ నటుడు మిస్సింగ్.. కిడ్నాప్ అనుమానాలు..!
-
ఓటీటీలోకి ‘మంజుమ్మల్ బాయ్స్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను: సోనమ్ కపూర్
-
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్