logo

వాహన తనిఖీల్లో రూ.1.65 లక్షలు పట్టివేత

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రాజోలి శివారులోని సుంకేసుల డ్యామ్‌ వద్ద నిర్వహించిన వాహన తనిఖీల్లో రూ.1.65 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

Published : 04 May 2024 19:52 IST

రాజోలి: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రాజోలి శివారులోని సుంకేసుల డ్యామ్‌ వద్ద నిర్వహించిన వాహన తనిఖీల్లో రూ.1.65 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ప్రత్యేక తనిఖీ బృందం సభ్యులు స్వాధీనం సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఎస్ బృందం, ఐటీబీటీ బృందం సభ్యులు వాహనాలను తనిఖీ చేస్తుండగా, ఎలాంటి పత్రాలు లేకుండా కర్నూలు జిల్లా మునగాలకు చెందిన తిరుమలేశ్ రూ. లక్ష, రాజోలి గ్రామానికి చెందిన ఖలీల్ రూ.65 వేలు తీసుకెళ్తున్నట్లుగా గుర్తించారు. వారి నుంచి నగదును స్వాధీనం చేసుకొని పోలీసులకు అప్పగించినట్లుగా బృందం సభ్యులు తెలిపింది. తనిఖీల్లో లక్ష్మినారాయణ, వీరన్న, నాగేశ్వర్‌రావ్, నాగరాజు తదితర అధికారులు పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని