logo

రేవంత్‌ పాలనను కుప్ప కూల్చాలి : ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌

రాష్ట్రంలో రేవంత్‌ పాలనను కుప్పకూల్చి, కేసీఆర్‌ పాలనను తిరిగి తెచ్చుకోవాలని నాగర్‌కర్నూల్‌ భారాస పార్లమెంట్‌ అభ్యర్థి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. మండల కేంద్రంలో ఆదివారం రాత్రి అంబేడ్కర్‌ కూడలిలో  నిర్వహించిన రోడ్‌షోలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజుతో కలిసి మాట్లాడారు.

Published : 06 May 2024 05:12 IST

ఉప్పునుంతల రోడ్‌షోలో అభివాదం చేస్తున్న ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

ఉప్పునుంతల, న్యూస్‌టుడే : రాష్ట్రంలో రేవంత్‌ పాలనను కుప్పకూల్చి, కేసీఆర్‌ పాలనను తిరిగి తెచ్చుకోవాలని నాగర్‌కర్నూల్‌ భారాస పార్లమెంట్‌ అభ్యర్థి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. మండల కేంద్రంలో ఆదివారం రాత్రి అంబేడ్కర్‌ కూడలిలో  నిర్వహించిన రోడ్‌షోలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజుతో కలిసి మాట్లాడారు. భారాసలో పదవులు అనుభవించిన స్వార్థ నాయకులు ఇతర పార్టీలకు వెళ్లినా నిజమైన కార్యకర్తలు పార్టీనే నమ్ముకొని ఉన్నారన్నారు. ఎవరెన్ని మోసాలు చేసినా భారాస విజయాన్ని ఎవరూ ఆపలేరన్నారు. కాంగ్రెస్‌ పడవ మునిగిపోతుందనే భయంతో గద్వాల ఎర్రవెళ్లికి రాహుల్‌గాంధీని తీసుకొచ్చారన్నారు. ఎంపీగా రాములు పార్లమెంట్‌లో కేవలం ఆరు నిమిషాలు మాత్రమే మాట్లాడారని విమర్శించారు. 8 ఏళ్లు ఎంపీగా పనిచేసిన డా.మల్లురవి ఎన్నో ఆస్తులు సంపాదించుకున్నారే తప్పా ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. తాను అధికారిగా ఉన్న సమయంలో ఎంతో మంది పేద విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దానని చెప్పారు. అనంతరం గువ్వల బాలరాజు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే డా.వంశీకృష్ణ ఇసుక మాఫియాకు అండగా ఉంటూ దుందుభిని కొల్లగొడుతున్నారని ఆరోపించారు. భారాస నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులకు భయపడబోమన్నారు. ఇన్‌ఛార్జి నవీన్‌కుమార్‌, భూపాల్‌రావు, కట్టా గోపాల్‌రెడ్డి, రవీందర్‌రావు, సంబు భాస్కర్‌, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని