నల్లమలలో వన్యప్రాణులకు ఆపద
సాంకేతికత అభివృద్ధి.. కొన్నింటికి ప్రమాదకరంగా మారాయి. ప్రధానంగా నల్లమల అడవిలో, కృష్ణాతీరంలో వన్యప్రాణులకు, వివిధ రకాల చెట్ల జాతులకు ఆపద వచ్చింది.
కొల్లాపూర్, న్యూస్టుడే : సాంకేతికత అభివృద్ధి.. కొన్నింటికి ప్రమాదకరంగా మారాయి. ప్రధానంగా నల్లమల అడవిలో, కృష్ణాతీరంలో వన్యప్రాణులకు, వివిధ రకాల చెట్ల జాతులకు ఆపద వచ్చింది. రాష్ట్రాలకు, అంతర్గత జిల్లాలకు అనుసంధానంగా విద్యుత్తు పవర్గ్రిడ్లు, మొబైల్ సెల్ టవర్స్, సౌరవిద్యుత్ లైన్ల నిర్మాణంతో ప్రమాదకర పరిస్థితులు నెలకొంటున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల పరిధిలోని ఆంధ్రప్రదేశ్ నుంచి నల్లమల, కృష్ణాతీర ప్రాంతాల గుండా తెలంగాణ రాష్ట్రంలోని కొల్లాపూర్, అచ్చంపేట, వనపర్తి, గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల పరిధి గుండా పవర్గ్రిడ్, విద్యుత్తు సరఫరా హైటెన్షన్ లైన్ నిర్మాణం చేశారు. సోమశిల తీరంలో కూడా హైటెన్షన్ లైన్తో పాటు సౌర విద్యుత్తు లైన్ నిర్మాణం చేపట్టబోతున్నారు. ఈ నిర్మాణంలో కోల్పోతున్న వివిధ రకాల చెట్ల జాతులను ఈ నెల 4న అచ్చంపేట డీఎఫ్వో రోహిత్గోపిడి, కొల్లాపూర్ రేంజర్ శరత్చంద్రారెడ్డి పరిశీలించారు.
మల్లేశ్వరం, వేంకల్, మంచాలకట్ట తీరంలో హైటెన్షన్ విద్యుత్తు లైన్తో ఆదివారం ఎర్రకాళ్ల కొంగలు మృత్యువాత పడిన సంఘటనలు కొల్లాపూర్ రేంజర్ పరిశీలించారు. ఉష్ణోగ్రత తీవ్రత పెరగడం, కృష్ణానదిలో జలాలు అడుగంటడం, సెల్ టవర్స్, విద్యుత్లైన్లతో వన్యప్రాణులకు, చెట్ల జాతులు దెబ్బతింటున్నాయి. ప్రతి వేసవిలో కృష్ణాతీరానికి ఆఫ్రికన్, ఆప్ఘనిస్తాన్, తదితర ప్రాంతాల నుంచి అతిథి పక్షులు తరలివస్తుంటాయి. ఇందులో వివిధ రకాల కొంగజాతులు, పక్షులు వస్తున్నాయి. చేపలు, పురుగులు ఆహారంగా వీటి జీవనం కొనసాగుతుంది. ఈ ప్రమాదకర పరిస్థితులను చూసిన రేంజర్ శరత్చంద్రారెడ్డి ఉన్నతాధికారులకు సమస్యను నివేదించారు. ఎర్రకాళ్ల కొంగ కళేబరానికి పంచనామ చేయించడం కూడా జరిగింది. ప్రధానంగా హైటెన్షన్ విద్యుత్తు లైన్తోనే నల్లమల, కృష్ణాతీరంలో ఆపద పొంచి ఉన్నదని రేంజర్ పేర్కొంటున్నారు. సమస్య పరిష్కారం, ప్రత్యామ్నాయం కోసం, వన్యప్రాణులు, చెట్ల జాతులు అంతరించకుండా కాపాడుకోవడం కోసమే ఉన్నతాధికారులకు పూర్తిస్థాయిలో నివేదిక పంపుతున్నామని రేంజర్ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మందకొడిగా ధాన్యం సేకరణ
[ 18-05-2024]
పాలమూరులోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ మందకొడిగా సాగుతోంది. యాసంగిలో మహబూబ్నగర్లో 1.11 లక్షలు, నాగర్కర్నూల్-1.09 లక్షలు, నారాయణపేట-1.15 లక్షలు, వనపర్తి-91 వేలు, జోగులాంబ గద్వాల-50వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. -
రుణమాఫీపై ఆశలు
[ 18-05-2024]
శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణ మాఫీ అమలుకు ప్రభుత్వం కటాఫ్ తేదీ ప్రకటించటంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏకకాలంలో రూ.రెండు లక్షలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. -
ఆర్టీసీకి పోటెత్తారు
[ 18-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు సొంతూళ్లకు ఓటేసేందుకు పోటెత్తారు. ఈనెల 13న లోక్సభ ఎన్నికలు జరగడంతో పట్టణాలు, నగరాలు, ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లు స్వగ్రామాలకు తరలొచ్చి ఓటుహక్కు వినియోగించుకున్నారు. -
వేసవిలో ముంచెత్తుతున్న వర్షాలు
[ 18-05-2024]
జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం తెల్లవారు జామున భారీ వర్షం కురిసింది. గట్టు మండలకేంద్రంలో అత్యధికంగా 10.2 సెం.మీ. వర్షపాతం నమోదైంది. -
నిఘా నేత్రాలు అరకొర!
[ 18-05-2024]
రద్దీ ప్రాంతాల్లో జేబు దొంగలు తమ వాటం ప్రదర్శిస్తుంటారు. నిత్యం వేలాది మందితో కిటకిటలాడే మహబూబ్నగర్ బస్టాండు ఇందుకు వేదిక అవుతోంది. నెలలో రెండు నుంచి నాలుగు వరకు దొంగతనాలు జరుగుతున్నాయి. మహాలక్ష్మి టిక్కెట్లు అందుబాటులోకి వచ్చాక ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగిన సంగతి విధితమే. -
వేధింపుల నివారణకు ప్రత్యేక కమిటీలు
[ 18-05-2024]
పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులను పూర్తి స్థాయిలో అరికట్టేందుకు అంతర్గత కమిటీలను ఏర్పాటు చేయాలని పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పురపాలక కమిషనర్లు విధిగా వేధింపులను నియంత్రించేందుకు కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించడంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 19 పురపాలికల్లో కమిటీల ఏర్పాటుపై అధికారులు దృష్టి సారించారు. -
ఈ-శ్రమ్ సద్వినియోగం చేసుకోండి
[ 18-05-2024]
అసంఘటిత కార్మికులు ఈ-శ్రమ్ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎం.ఆర్.సునీత సూచించారు. శుక్రవారం వనపర్తి కోర్టు ఆవరణలో అసంఘటిత కార్మికులకు ఈ-శ్రమ్ పోర్టల్పై ఉచిత న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. -
పంటల ప్రణాళిక ఖరారు
[ 18-05-2024]
జిల్లాలో వానాకాలం పంటల ప్రణాళికను వ్యవసాయశాఖ ఖరారు చేసింది. అన్ని రకాల పంటలు కలిపి 2,45,953 ఎకరాల్లో సాగు చేస్తారని అధికారులు అంచనాలు తయారు చేశారు. కేవలం వర్షాధారంగానే కాకుండా చెరువులు, బావులు, బోర్ల ఆధారంగా వానాకాలం పంటలను రైతులు సాగు చేస్తారు. -
సాంకేతిక విద్య.. భవితకు భరోసా
[ 18-05-2024]
విద్యార్థులు నైపుణ్యాలను పెంపొందించుకొని ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందాలంటే వారికి సాంకేతిక విద్య అవసరం. దీనికోసం ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరానికి ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలలో ప్రవేశాలకు నేటి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. -
ఇంట్లో కుక్కుంది.. పెంపకంలో లెక్కుంది
[ 18-05-2024]
వికారాబాద్ జిల్లా తాండూరులో ఓ పెంపుడు కుక్క ఆ ఇంట్లో చిన్నారిని తీవ్రంగా గాయపరిచి, చంపేసింది. ప్రేమకు ప్రతిరూపాలుగా భావించే పెంపుడు జంతువులతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని ఈ ఘటన తెలియజేస్తోంది. ఇంట్లో పెంచే పప్పీలు, పెద్దజాతి కుక్కల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఉమ్మడి జిల్లాలో పరిస్థితి ఏమిటో తెలుసుకుందాం. -
పిల్లలూ కథలు చదివేద్దామా.!
[ 18-05-2024]
వేసవి సెలవుల్లో విద్యార్థులు ఆన్లైన్ గేమ్స్, సామాజిక మాధ్యమాలకు పరిమితం కాకుండా వారిలో పఠనాశక్తి పెంచే దిశగా విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఎన్సీఈఆర్టీ సహకారంతో రూమ్ టూ రీడ్ సంస్థ ‘లిటరసీ క్లౌడ్’ మాధ్యమం ద్వారా ఇంటి వద్దనే ప్రాథమిక స్థాయి విద్యార్థులు కథలు చదువుకునేలా ఏర్పాటు చేసింది. -
పోలింగ్ సిబ్బందికి చెల్లింపుల్లో వ్యత్యాసం
[ 18-05-2024]
ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బందికి పారితోషికం చెల్లింపుల్లో వ్యత్యాసం ఉండటంతో ఉపాధ్యాయులు, ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. -
సెలవులు పూర్తయ్యేసరికి బడులకు వసతులు:ఏసీ
[ 18-05-2024]
వేసవి సెలవులు పూర్తయ్యేలోపు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు పనులను పూర్తి చేయాలని, విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాలని అదనపు కలెక్టర్ మయాంక్ మిత్తల్ సూచించారు. చిన్నపొర్ల పాఠశాలలో అమ్మ ఆదర్శ కమిటీల పనులను శుక్రవారం పరిశీలించి మాట్లాడారు. -
మరమ్మతులకు ఇదే తరుణం!
[ 18-05-2024]
ఒకప్పుడు కరవు కాటకాలకు, వలసలకు పాలమూరు జిల్లా చిరునామాగా ఉండేది. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి అప్పట్లో మంజూరైనదే భీమా ప్రాజెక్టు. మొదటిదశ కింద మక్తల్ నియోజకవర్గంలో 1998లో రెండు జలాశయాలు నిర్మించతలపెట్టారు. -
ఆరోగ్య కేంద్రాల్లో మరిన్ని ప్రత్యేక సేవలు
[ 18-05-2024]
జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఇప్పటికే అందిస్తున్న ఐదు రకాల వైద్యసేవలతోపాటు మరో ఏడు కొత్త సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు వైద్య,ఆరోగ్యశాఖ చర్యలు చేపడుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
-
టీమ్ఇండియా.. ‘అమెరికా’ విమానం ఎక్కేదప్పుడే!
-
హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో మార్పు లేదు
-
కడప గౌస్నగర్ ఘటనపై ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఆగ్రహం
-
పల్నాడు కలెక్టర్గా శ్రీకేశ్ బాలాజీ .. ఈసీ ఉత్తర్వులు
-
నా మాజీ భర్తతో పోలుస్తారెందుకు? నెటిజన్ కామెంట్పై రేణూ దేశాయ్ అసహనం