వారసత్వ రాజకీయాలకు భాజపా దూరం
ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడితే 2023లో తెలంగాణలో భాజపా ప్రభుత్వం వస్తుందని ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మధ్యప్రదేశ్ ఇన్ఛార్జి ఎం.మురళీధర్రావు పేర్కొన్నారు. కందిలోని ఓ
పార్టీ మధ్యప్రదేశ్ రాష్ట్ర ఇన్ఛార్జి మురళీధర్రావు
కార్యకర్తల శిక్షణ శిబిరంలో ప్రసంగిస్తున్న మురళీధర్రావు
కంది, న్యూస్టుడే: ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడితే 2023లో తెలంగాణలో భాజపా ప్రభుత్వం వస్తుందని ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మధ్యప్రదేశ్ ఇన్ఛార్జి ఎం.మురళీధర్రావు పేర్కొన్నారు. కందిలోని ఓ ఫంక్షన్ హాలులో మూడు రోజులుగా కొనసాగుతున్న జిల్లాస్థాయి శిక్షణ తరగతుల చివరి రోజు మంగళవారం ఆయన హాజరై ప్రసంగించారు. జిల్లా కార్యవర్గ సభ్యులకు దిశానిర్దేశం చేశారు. ఇప్పటి వరకు దేశంలో 130 కోట్ల డోసుల వ్యాక్సిన్ అందించిన ఘనత కేంద్ర ప్రభుత్వానికి దక్కిందన్నారు. దేశంలో వారసత్వ రాజకీయాలు లేకుండా ఒక్క భాజపా మాత్రమే పని చేస్తుందన్నారు. వారసత్వ రాజకీయాలను వ్యతిరేకించే ధైర్యం తెరాసకు, అవినీతిపై పోరాటం చేసే సత్తా కాంగ్రెస్కు ఉన్నాయా అని ఆయన ప్రశ్నించారు. తెరాస, కాంగ్రెస్ రెండు ఒక్కటేనన్నారు. ఓటరుకు మనపై నమ్మకం కలిగేలా వ్యవహరించాలని, భాజపా కులం, మతం సంబంధం లేకుండా అందరి సంక్షేమం కోసం పని చేస్తుందని ఆయన వివరించారు. మాజీ ఎమ్మెల్యేలు బాబుమోహన్, నందీశ్వర్గౌడ్, విజయ్పాల్రెడ్డి, భాజపా జిల్లా అధ్యక్షులు నరేందర్రెడ్డి, సంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి బొమ్మ జయశ్రీ, జగన్, విష్ణువర్ధన్రెడ్డి, రాజేశ్వర్రావు దేశ్పాండే తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేసవి శిబిరాలు.. విజ్ఞాన వీచికలు
[ 30-04-2024]
వేసవి సెలవులంటే.. చుట్టాల ఇళ్లు, విహారయాత్రలకు వెళ్లడం పరిపాటే. కొందరు ప్లిలలు మాత్రం విజ్ఞానం, నైపుణ్య అంశాలను పెంచుకోవాలని పరితపిస్తుంటారు. -
గతంలో తండ్రి.. ఇప్పుడు తల్లి
[ 30-04-2024]
కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న కొడుకే తల్లిదండ్రులను పొట్టనబెట్టుకున్నాడు. -
అభ్యర్థులు వీరే..ఇక ప్రచార హోరే!
[ 30-04-2024]
జహీరాబాద్ లోక్సభ స్థానానికి బరిలో నిలిచే అభ్యర్థుల లెక్క తేలింది. నామినేషన్ల ఉప సంహరణ గడువు సోమవారం ముగియగా జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో 19 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. -
పరిశ్రమల్లో ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా?
[ 30-04-2024]
జిల్లాలోని పరిశ్రమల్లో ప్రమాదాల వల్ల పలువురు కార్మికులు మరణిస్తున్నా.. సంబంధిత అధికారులు పట్టింపు లేనట్లు వ్యవహరిస్తున్నారని జడ్పీ ఉపాధ్యక్షుడు, మరికొందరు జడ్పీ అభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
‘మూడు నెలల్లో 5 గ్యారంటీల అమలు’
[ 30-04-2024]
కాంగ్రెస్ మెదక్ ఎంపీ అభ్యర్థి బీసీ బిడ్డ నీలం మధు ముదిరాజ్ను భారీ అధిక్యంతో గెలిపించాలని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!