ఖర్చు తక్కువ.. మన్నిక ఎక్కువ!
కోట్లాది రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన తారురోడ్డు కొన్ని రోజులకే దెబ్బతింటున్నాయి. వర్షపునీరు రోడ్లపై నీరు నిలువ ఉండటం, ఆ నీటిని లోపలికి పీల్చుకునే అవకాశం లేకపోవడమే ఇందుకు కారణం. ఈ సమస్యను అధిగమించేందుకు పీఎంజీఎస్వై రహదారుల నిర్మాణంలో సరికొత్త టెక్నాలజీ వచ్చింది.
న్యూస్టుడే, హుస్నాబాద్ గ్రామీణం
రోడ్డు నిర్మాణంలో కొబ్బరినార పట్ట ప్రయోగం
కోట్లాది రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన తారురోడ్డు కొన్ని రోజులకే దెబ్బతింటున్నాయి. వర్షపునీరు రోడ్లపై నీరు నిలువ ఉండటం, ఆ నీటిని లోపలికి పీల్చుకునే అవకాశం లేకపోవడమే ఇందుకు కారణం. ఈ సమస్యను అధిగమించేందుకు పీఎంజీఎస్వై రహదారుల నిర్మాణంలో సరికొత్త టెక్నాలజీ వచ్చింది. అదే కొబ్బరినారను ఉపయోగించే పద్ధతి. ఇప్పుడు ఈ విధానాన్ని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పోతారం(ఎస్) నుంచి నాగారం వెళ్లే రోడ్డు నిర్మాణంలో ఉపయోగిస్తున్నారు. రోడ్డు నిర్మాణంలో జిల్లాలో కొత్తగా ప్రయోగాత్మకంగా చేస్తున్నారు. హుస్నాబాద్ మండలం పోతారం(ఎస్) నుంచి నాగారం, అక్కడి నుంచి ఉమ్మాపూర్ వెళ్లే రహదారిని తారు రోడ్డుగా మార్చేందుకు ప్రధానమంత్రి గ్రామసడక్ యోజన కింద రూ.2.31 కోట్లు మంజూరయ్యాయి. 3.6 కి.మీ పొడవైన ఈ రహదారి నిర్మాణ పనులు కొద్ది రోజులుగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 7 చోట్ల కల్వర్టులు నిర్మిస్తున్నారు. 6 చోట్ల సిమెంట్ పైపులతో కల్వర్టులు, ఒక చోట స్లాబ్తో కూడిన కల్వర్టు నిర్మిస్తున్నారు. కుంట మత్తడి సమీపంలో స్లాబ్తో వంతెన నిర్మించాల్సి ఉంది. ఇన్నాళ్లు ఈ రహదారి మొత్తం మట్టిరోడ్డు. ద్విచక్ర వాహనాలు, ఎడ్ల బండ్లు మాత్రమే వెళ్లేవి. దీనిని వెడల్పు చేశారు. మట్టిపోయించి నీళ్లు పడుతూ తొక్కించారు.
జియో టెక్స్టైల్స్ సాంకేతికతతో..
సాధారణంగా తారు రోడ్ల నిర్మించే సమయంలో ముందుగా మట్టి పోయించి తొక్కిస్తారు. తర్వాత కంకరపొడి (జీఎస్బీ)తో కూడిన మిశ్రమం వేసి తొక్కిస్తారు. తర్వాత కంకర వేసి తొక్కించి తారు వేస్తారు. కొత్తగా వచ్చిన కాయర్ జియో టెక్స్టైల్స్ పద్ధతిలో కొబ్బరినారతో తయారు చేసి పట్ట(మెష్)ను ఉపయోగిస్తున్నారు. మొరం పోయించి నీరు పడుతూ తొక్కించిన తర్వాత కొబ్బరినారతో తయారు చేసిన మెష్ను రోడ్డుపై పరుస్తున్నారు. దానిపై జీఎస్బీ మిశ్రమాన్ని వేసి తొక్కిస్తున్నారు. దానిపై కొంచెం పెద్ద కంకర వేసి తొక్కిస్తారు. తర్వాత దానిపై తారు వేస్తారు. పాత పద్ధతి ప్రకారం కింది నుంచి పై వరకు రోడ్డు 14 ఇంచులు ఉండగా కొత్త విధానంలో 11 ఇంచులు మాత్రమే ఉంటుందని డీఈ తెలిపారు.
జిల్లాలో ఇదే ప్రథమం..
జిల్లాలో మొదటిసారిగా ఈ పద్ధతిలో రోడ్డు వేస్తున్నాం. నిర్మాణంలో ఉపయోగించిన కొబ్బరినార మట్టిలో కలిసిపోతుంది. వర్షం పడినపుడు రోడ్డుపై ఉన్న నీటిని ఆ నార లోపలికి పీల్చుకుని వెంటనే బయటకు పంపుతుంది. లేదంటే లోపలికి ఇంకేలా చేస్తుంది.దీంతో ఎక్కువ కాలం మన్నికగా ఉంటుంది.
- సదాశివరెడ్డి, డీఈ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమితానందం.. షా ఆగమనం
[ 26-04-2024]
భాజపా అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా ఆగమనంతో సిద్దిపేట కమలనాథుల్లో నూతనోత్సాహం వెల్లివిరిసింది. లోక్సభ ఎన్నికల వేళ కాషాయ దళంలో నయాజోష్ కనిపించింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
మెతుకుసీమ గులాబీ జెండా అడ్డా...
[ 26-04-2024]
మెతుకుసీమ గులాబీ జెండాకు అడ్డా అని... ఈ ఎన్నికల్లోనూ మరోసారి జెండా ఎగరవేస్తామని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు ధీమా వ్యక్తం చేశారు. -
వెల్లువెత్తిన నామపత్రాలు
[ 26-04-2024]
మెదక్ లోక్సభ స్థానానికి వెల్లువలా నామపత్రాలు దాఖలయ్యాయి. మొత్తం 54 మంది అభ్యర్థులు 90 సెట్ల నామినేషన్లు సమర్పించారు. -
బీసీ బిడ్డను ఆశీర్వదించండి
[ 26-04-2024]
అన్ని వర్గాలను కలుపు కొనిపోయే బీసీ బిడ్డగా తనను ఆశీర్వదించాలని మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు కోరారు. గురువారం కౌడిపల్లి, కంచన్పల్లి, పాంపల్లి, వెల్దుర్తి, మాసాయిపేటలో రోడ్డుషో, సభ నిర్వహించారు. -
ఫలితం లేదు..
[ 26-04-2024]
జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు కొంతమేర ఊరటనిచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో రాలేదు. గత నాలుగేళ్ల నుంచి ఫలితాల్లో జిల్లా చివరి స్థానంలో నిలుస్తుండగా.. -
నిఘా నీడ.. పక్కా పర్యవేక్షణ
[ 26-04-2024]
సార్వత్రిక సమరంలో ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిఘా వ్యవస్థను పటిష్ఠం చేసింది. -
పంచాయతీ నుంచి లోక్సభకు..
[ 26-04-2024]
ఎం.బాగారెడ్డి.. మెతుకుసీమ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. నాలుగున్నర దశాబ్దాల పాటు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో అపజయం ఎరుగని నాయకుడిగా గుర్తింపు పొందారు. -
ఈతకు వెళ్లి బాలుడి మృత్యువాత
[ 26-04-2024]
ఈత కొట్టేందుకు చెరువులోకి దిగిన బాలుడు మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం కోనాయిపల్లిలో జరిగింది. -
జహీరాబాద్కు 69.. మెదక్కు 90
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామపత్రాల స్వీకరణ ఘట్టం గురువారంతో ముగిసింది. జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి 40 మంది అభ్యర్థులు 69 నామినేషన్లు దాఖలు చేశారు. -
రోడ్షోలు.. సభలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు కోలాహలం మధ్య నామినేషన్లు సమర్పించారు. -
నాయకుల ఉత్సాహం.. వలసలకు ప్రోత్సాహం
[ 26-04-2024]
ఎన్నికల్లో పైచేయి సాధించాలని ప్రధాన పార్టీలు చేరికలపై దృష్టి పెట్టాయి. ప్రజల్లో పరపతి ఉన్న నియోజకవర్గం, మండల స్థాయి నేతలపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు. -
ప్రైవేటు రుణాలతో ఆర్థిక ఇబ్బందులు
[ 26-04-2024]
హుస్నాబాద్ ప్రాంతంలో ప్రైవేటుగా సూక్ష్మ రుణాలు (మైక్రో ఫైనాన్స్) మళ్లీ మొదలయ్యాయి. పేదల అవసరాలను ఆసరా చేసుకుని రుణాలు ఇస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
సామాజిక మాధ్యమంలో బయటపడిన వరుడి గుట్టు.. ఒకరోజు ముందు ఆగిన పెళ్లి
[ 26-04-2024]
పెళ్లి నిశ్చయమైన యువకుడికి మరో మహిళతో సంబంధం ఉందని తెలుసుకున్న వధువు బంధువులు పెళ్లికి ఒకరోజు ముందు వరుడిని నిలదీసిన ఘటన శివ్వంపేట మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్