యువకుడిపై కర్రలతో దాడి... తీవ్ర గాయాలు
పాత కక్షలను దృష్టిలో పెట్టుకుని ఓ యువకుడిపై కర్రలతో దాడి చేయడంతోపాటు కులం పేరుతో దూషించిన ఘటన సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం చీలేమామిడి గ్రామంలో సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఝరాసంగం ఎస్సై రాజేందర్రెడ్డి తెలిపిన
నరేష్ను కొడుతున్న శ్రీనివాస్ కుటుంబ సభ్యులు
ఝరాసంగం: పాత కక్షలను దృష్టిలో పెట్టుకుని ఓ యువకుడిపై కర్రలతో దాడి చేయడంతోపాటు కులం పేరుతో దూషించిన ఘటన సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం చీలేమామిడి గ్రామంలో సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఝరాసంగం ఎస్సై రాజేందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... చీలేమామిడి గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ నరేశ్కు అదే గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ గొల్ల శ్రీనివాస్కు పాత తగాదాలు ఉన్నాయి. శ్రీనివాస్ ఇంట్లో లేనప్పుడు నరేష్ తరచుగా ఆయన ఇంటికి వస్తుండేవాడు. ఇంటికి రావొద్దని గతంలో రెండుసార్లు హెచ్చరించినా నరేష్ వినిపించుకోలేదు. సోమవారం ఉదయం శ్రీనివాస్ ఇంట్లో లేనప్పుడు నరేష్ రాగా... కుటుంబ సభ్యులు గుర్తించి ఆయనపై కర్రలతో దాడి చేశారు. నరేశ్కు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పాత కక్షలు దృష్టిలో పెట్టుకుని దాడి చేయడంతోపాటు కులం పేరుతో దూషించారని నరేశ్ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గొల్ల శ్రీనివాస్, రవి, గోపాల్, శేఖర్, రాములు, మంగమ్మ, రమేశ్, నరసింహులు, జనాబాయి, సంగన్నలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. కాగా... వివాహేతర సంబంధమే గొడవకు దారి తీసినట్లు గ్రామస్థులు చెప్పుకొంటున్నారు.
సంఘాల నేతల పరామర్శ
జహీరాబాద్ అర్బన్: ఝరాసంగం మండలం చీలేమామిడిలో దళిత యువకుడిపై మూకుమ్ముడిగా దాడి చేయడం అమానుషమని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, మానిటరింగ్ కమిటీ, భీమ్ ఆర్మీ, కేవీపీఎస్, సమతా సైనిక్ దళ్, ప్రజాసంఘాల నాయకులు సోమవారం ఆరోపించారు. గాయపడి జహీరాబాద్ ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నరేష్ను పరామర్శించిన సందర్భంగా వారు మాట్లాడారు. ఈ సందర్భంగా బాధితుడి తండ్రితో ఝరాసంగం ఎస్ఐకి ఫిర్యాదు చేయించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, మానిటరింగ్ కమిటీ సభ్యుడు బంటు రామకృష్ణ, భీమ్ ఆర్మీ రాష్ట్ర అధ్యక్షుడు సిద్ధూ రావణ్, కేవీపీఎస్ నాయకుడు మహేష్, సమతా సైనిక్దళ్ నాయకుడు రాములు ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమితానందం.. షా ఆగమనం
[ 26-04-2024]
భాజపా అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా ఆగమనంతో సిద్దిపేట కమలనాథుల్లో నూతనోత్సాహం వెల్లివిరిసింది. లోక్సభ ఎన్నికల వేళ కాషాయ దళంలో నయాజోష్ కనిపించింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
మెతుకుసీమ గులాబీ జెండా అడ్డా...
[ 26-04-2024]
మెతుకుసీమ గులాబీ జెండాకు అడ్డా అని... ఈ ఎన్నికల్లోనూ మరోసారి జెండా ఎగరవేస్తామని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు ధీమా వ్యక్తం చేశారు. -
వెల్లువెత్తిన నామపత్రాలు
[ 26-04-2024]
మెదక్ లోక్సభ స్థానానికి వెల్లువలా నామపత్రాలు దాఖలయ్యాయి. మొత్తం 54 మంది అభ్యర్థులు 90 సెట్ల నామినేషన్లు సమర్పించారు. -
బీసీ బిడ్డను ఆశీర్వదించండి
[ 26-04-2024]
అన్ని వర్గాలను కలుపు కొనిపోయే బీసీ బిడ్డగా తనను ఆశీర్వదించాలని మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు కోరారు. గురువారం కౌడిపల్లి, కంచన్పల్లి, పాంపల్లి, వెల్దుర్తి, మాసాయిపేటలో రోడ్డుషో, సభ నిర్వహించారు. -
ఫలితం లేదు..
[ 26-04-2024]
జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు కొంతమేర ఊరటనిచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో రాలేదు. గత నాలుగేళ్ల నుంచి ఫలితాల్లో జిల్లా చివరి స్థానంలో నిలుస్తుండగా.. -
నిఘా నీడ.. పక్కా పర్యవేక్షణ
[ 26-04-2024]
సార్వత్రిక సమరంలో ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిఘా వ్యవస్థను పటిష్ఠం చేసింది. -
పంచాయతీ నుంచి లోక్సభకు..
[ 26-04-2024]
ఎం.బాగారెడ్డి.. మెతుకుసీమ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. నాలుగున్నర దశాబ్దాల పాటు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో అపజయం ఎరుగని నాయకుడిగా గుర్తింపు పొందారు. -
ఈతకు వెళ్లి బాలుడి మృత్యువాత
[ 26-04-2024]
ఈత కొట్టేందుకు చెరువులోకి దిగిన బాలుడు మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం కోనాయిపల్లిలో జరిగింది. -
జహీరాబాద్కు 69.. మెదక్కు 90
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామపత్రాల స్వీకరణ ఘట్టం గురువారంతో ముగిసింది. జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి 40 మంది అభ్యర్థులు 69 నామినేషన్లు దాఖలు చేశారు. -
రోడ్షోలు.. సభలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు కోలాహలం మధ్య నామినేషన్లు సమర్పించారు. -
నాయకుల ఉత్సాహం.. వలసలకు ప్రోత్సాహం
[ 26-04-2024]
ఎన్నికల్లో పైచేయి సాధించాలని ప్రధాన పార్టీలు చేరికలపై దృష్టి పెట్టాయి. ప్రజల్లో పరపతి ఉన్న నియోజకవర్గం, మండల స్థాయి నేతలపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు. -
ప్రైవేటు రుణాలతో ఆర్థిక ఇబ్బందులు
[ 26-04-2024]
హుస్నాబాద్ ప్రాంతంలో ప్రైవేటుగా సూక్ష్మ రుణాలు (మైక్రో ఫైనాన్స్) మళ్లీ మొదలయ్యాయి. పేదల అవసరాలను ఆసరా చేసుకుని రుణాలు ఇస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
సామాజిక మాధ్యమంలో బయటపడిన వరుడి గుట్టు.. ఒకరోజు ముందు ఆగిన పెళ్లి
[ 26-04-2024]
పెళ్లి నిశ్చయమైన యువకుడికి మరో మహిళతో సంబంధం ఉందని తెలుసుకున్న వధువు బంధువులు పెళ్లికి ఒకరోజు ముందు వరుడిని నిలదీసిన ఘటన శివ్వంపేట మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం