ఇష్టానుసారం మాట్లాడటం తగదు..
తెలంగాణ ఏర్పాటుకు అడ్డం కాదు, నిలువు కాదు అన్నవాళ్లు ఇప్పుడు రాజకీయాలు చేస్తున్నారని నోరు అదుపులో పెట్టుకోవాలని, ఇష్టానుసారం మాట్లాడితే ప్రజలే తిరగబడతారని మంత్రి హరీశ్రావు హెచ్చరించారు.
గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి హరీశ్రావు. ఎంపీ ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి తదితరులు
పటాన్చెరు అర్బన్, న్యూస్టుడే: తెలంగాణ ఏర్పాటుకు అడ్డం కాదు, నిలువు కాదు అన్నవాళ్లు ఇప్పుడు రాజకీయాలు చేస్తున్నారని నోరు అదుపులో పెట్టుకోవాలని, ఇష్టానుసారం మాట్లాడితే ప్రజలే తిరగబడతారని మంత్రి హరీశ్రావు హెచ్చరించారు. పటాన్చెరులో గాంధీ జయంతి పురస్కరించుకుని రూ.5.10 కోట్లతో థీమ్ పార్కు, కొండా లక్ష్మణ్ బాపూజీ, గాంధీ కాంస్య విగ్రహాలతో పాటు లయన్స్ క్లబ్ భవనం, జిమ్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గాంధీ లేకుంటే స్వేచ్ఛా వాయువులు పీల్చేవారం కాదని అన్నారు. అలాంటి గాంధీజీని కూడా కొంతమంది కించపరిచే విధంగా తక్కువ చేసి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రతి రంగంలోనూ కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రం అవార్డులు సాధిస్తోంది. మిషన్ భగీరథ పథకానికి నీతిఅయోగ్ నిధులు ఇవ్వాలని సూచించినా కేంద్రం ఇవ్వడం లేదన్నారు. కాంగ్రెస్, తెదేపా ఏళ్లుగా పరిపాలించినా తాగునీరు ఇవ్వలేకపోయాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్కు కృష్ణా ఫేజ్-3, గోదావరి జలాల తెచ్చారని.. మంజీరాను సంగారెడ్డి, పటాన్చెరుకు ఇచ్చి తాగునీటి కష్టాలు తీర్చారన్నారు. భాజపా చేసింది ఏమీ లేదని ధరలు పెంచుతూ, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతోందని ఎద్దేవా చేశారు. ఎంపీ ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ కోసం తొలి, మలి విడత పోరాటాల్లో కొండా లక్ష్మణ్ బాపూజీ కీలకపాత్ర పోషించారన్నారు. ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి, ఎమ్మెల్సీ రమణ, చేనేత అభివృద్ధి సంస్థ ఛైర్మన్ ప్రభాకర్, మాజీ ఎమ్మెల్సీ భూపాల్రెడ్డి, కార్పొరేటర్ మెట్టుకుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ ఛైర్మన్ విజయ్కుమార్, తెరాస నాయకులు మధుసూదన్రెడ్డి, ఆదర్శరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమితానందం.. షా ఆగమనం
[ 26-04-2024]
భాజపా అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా ఆగమనంతో సిద్దిపేట కమలనాథుల్లో నూతనోత్సాహం వెల్లివిరిసింది. లోక్సభ ఎన్నికల వేళ కాషాయ దళంలో నయాజోష్ కనిపించింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
మెతుకుసీమ గులాబీ జెండా అడ్డా...
[ 26-04-2024]
మెతుకుసీమ గులాబీ జెండాకు అడ్డా అని... ఈ ఎన్నికల్లోనూ మరోసారి జెండా ఎగరవేస్తామని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు ధీమా వ్యక్తం చేశారు. -
వెల్లువెత్తిన నామపత్రాలు
[ 26-04-2024]
మెదక్ లోక్సభ స్థానానికి వెల్లువలా నామపత్రాలు దాఖలయ్యాయి. మొత్తం 54 మంది అభ్యర్థులు 90 సెట్ల నామినేషన్లు సమర్పించారు. -
బీసీ బిడ్డను ఆశీర్వదించండి
[ 26-04-2024]
అన్ని వర్గాలను కలుపు కొనిపోయే బీసీ బిడ్డగా తనను ఆశీర్వదించాలని మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు కోరారు. గురువారం కౌడిపల్లి, కంచన్పల్లి, పాంపల్లి, వెల్దుర్తి, మాసాయిపేటలో రోడ్డుషో, సభ నిర్వహించారు. -
ఫలితం లేదు..
[ 26-04-2024]
జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు కొంతమేర ఊరటనిచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో రాలేదు. గత నాలుగేళ్ల నుంచి ఫలితాల్లో జిల్లా చివరి స్థానంలో నిలుస్తుండగా.. -
నిఘా నీడ.. పక్కా పర్యవేక్షణ
[ 26-04-2024]
సార్వత్రిక సమరంలో ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిఘా వ్యవస్థను పటిష్ఠం చేసింది. -
పంచాయతీ నుంచి లోక్సభకు..
[ 26-04-2024]
ఎం.బాగారెడ్డి.. మెతుకుసీమ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. నాలుగున్నర దశాబ్దాల పాటు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో అపజయం ఎరుగని నాయకుడిగా గుర్తింపు పొందారు. -
ఈతకు వెళ్లి బాలుడి మృత్యువాత
[ 26-04-2024]
ఈత కొట్టేందుకు చెరువులోకి దిగిన బాలుడు మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం కోనాయిపల్లిలో జరిగింది. -
జహీరాబాద్కు 69.. మెదక్కు 90
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామపత్రాల స్వీకరణ ఘట్టం గురువారంతో ముగిసింది. జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి 40 మంది అభ్యర్థులు 69 నామినేషన్లు దాఖలు చేశారు. -
రోడ్షోలు.. సభలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు కోలాహలం మధ్య నామినేషన్లు సమర్పించారు. -
నాయకుల ఉత్సాహం.. వలసలకు ప్రోత్సాహం
[ 26-04-2024]
ఎన్నికల్లో పైచేయి సాధించాలని ప్రధాన పార్టీలు చేరికలపై దృష్టి పెట్టాయి. ప్రజల్లో పరపతి ఉన్న నియోజకవర్గం, మండల స్థాయి నేతలపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు. -
ప్రైవేటు రుణాలతో ఆర్థిక ఇబ్బందులు
[ 26-04-2024]
హుస్నాబాద్ ప్రాంతంలో ప్రైవేటుగా సూక్ష్మ రుణాలు (మైక్రో ఫైనాన్స్) మళ్లీ మొదలయ్యాయి. పేదల అవసరాలను ఆసరా చేసుకుని రుణాలు ఇస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
సామాజిక మాధ్యమంలో బయటపడిన వరుడి గుట్టు.. ఒకరోజు ముందు ఆగిన పెళ్లి
[ 26-04-2024]
పెళ్లి నిశ్చయమైన యువకుడికి మరో మహిళతో సంబంధం ఉందని తెలుసుకున్న వధువు బంధువులు పెళ్లికి ఒకరోజు ముందు వరుడిని నిలదీసిన ఘటన శివ్వంపేట మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్