ఆశల చిగురింత
గొల్లకుర్మ, యాదవులకు గొర్రెల పెంపకంతో శాశ్వత ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకాన్ని తీసుకొచ్చింది. జీవాల పెంపకందారుల పాలిట ఈ పథకం వరంలా మారింది.
వచ్చే నెల గొర్రెల పంపిణీకి కసరత్తు
న్యూస్టుడే, సంగారెడ్డి టౌన్: గొల్లకుర్మ, యాదవులకు గొర్రెల పెంపకంతో శాశ్వత ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకాన్ని తీసుకొచ్చింది. జీవాల పెంపకందారుల పాలిట ఈ పథకం వరంలా మారింది. ఇంతవరకు బాగానే ఉన్నా.. కొంత కాలంగా నిధుల లేమితో యూనిట్ల గ్రౌండింగ్ ప్రక్రియ ముందుకుసాగని పరిస్థితి. ఏప్రిల్ నుంచి గొర్రెల పంపిణీ ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో లబ్ధిదారుల్లో ఆశలు చిగురించాయి.
లక్ష్యం 30,896 యూనిట్లు
జిల్లాలో గొర్రెల పెంపకందారుల సహకార సంఘాల్లో సభ్యులుగా ఉన్న 30,896 మందికి జీవాలు పంపిణీ చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఐదేళ్ల కిందట గ్రామ సభలు నిర్వహించి లబ్ధిదారులను ఎంపికచేశారు. 2017-18 నుంచి పంపిణీ ప్రక్రియ కొనసాగుతోంది. నిధుల లేమితో పంపిణీలో జాప్యం జరుగుతోంది. ఇప్పటివరకు 19,178 యూనిట్లు మాత్రమే గ్రౌండింగ్ చేశారు.
వాటాధనం చెల్లించిన వారికి ప్రాధాన్యం
ప్రభుత్వ మార్గదర్శకాలు అందగానే ఏప్రిల్ నుంచి ప్రారంభం కానున్న గొర్రెల పంపిణీకి అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే వాటాధనం చెల్లించి నిరీక్షిస్తున్న లబ్ధిదారులకు తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఒక్కో యూనిట్లో 20 గొర్రెలు, ఒక పొట్టేలు ఉంటాయి. యూనిట్ విలువ గతంలో రూ.1.25 లక్షలు ఉండగా ఇప్పుడు రూ.1.75లక్షలకు పెంచారు. 75శాతం అంటే రూ.1,31,250 రాయితీ కింద ప్రభుత్వం అందిస్తుంది. లబ్ధిదారు వాటా ధనం రూ.43,750 చొప్పున 700 మంది రూ.3.06కోట్లు చెల్లించారు. వీరందరికీ యూనిట్లు కేటాయించనున్నారు. నిధులు విడుదల కాగానే పంపిణీ చేయనున్నట్టు జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారిణి వసంతకుమారి తెలిపారు.
గొల్లకుర్మ, యాదవుల జనాభా: 48,814
కుటుంబాలు: 11,210
గొర్రెల పెంపకందారుల సహకార సంఘాలు: 503
వాటిలో సభ్యులు: 30,896
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
అమితానందం.. షా ఆగమనం
[ 26-04-2024]
భాజపా అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా ఆగమనంతో సిద్దిపేట కమలనాథుల్లో నూతనోత్సాహం వెల్లివిరిసింది. లోక్సభ ఎన్నికల వేళ కాషాయ దళంలో నయాజోష్ కనిపించింది. -
మెతుకుసీమ గులాబీ జెండా అడ్డా...
[ 26-04-2024]
మెతుకుసీమ గులాబీ జెండాకు అడ్డా అని... ఈ ఎన్నికల్లోనూ మరోసారి జెండా ఎగరవేస్తామని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు ధీమా వ్యక్తం చేశారు. -
వెల్లువెత్తిన నామపత్రాలు
[ 26-04-2024]
మెదక్ లోక్సభ స్థానానికి వెల్లువలా నామపత్రాలు దాఖలయ్యాయి. మొత్తం 54 మంది అభ్యర్థులు 90 సెట్ల నామినేషన్లు సమర్పించారు. -
బీసీ బిడ్డను ఆశీర్వదించండి
[ 26-04-2024]
అన్ని వర్గాలను కలుపు కొనిపోయే బీసీ బిడ్డగా తనను ఆశీర్వదించాలని మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు కోరారు. గురువారం కౌడిపల్లి, కంచన్పల్లి, పాంపల్లి, వెల్దుర్తి, మాసాయిపేటలో రోడ్డుషో, సభ నిర్వహించారు. -
ఫలితం లేదు..
[ 26-04-2024]
జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు కొంతమేర ఊరటనిచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో రాలేదు. గత నాలుగేళ్ల నుంచి ఫలితాల్లో జిల్లా చివరి స్థానంలో నిలుస్తుండగా.. -
నిఘా నీడ.. పక్కా పర్యవేక్షణ
[ 26-04-2024]
సార్వత్రిక సమరంలో ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిఘా వ్యవస్థను పటిష్ఠం చేసింది. -
పంచాయతీ నుంచి లోక్సభకు..
[ 26-04-2024]
ఎం.బాగారెడ్డి.. మెతుకుసీమ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. నాలుగున్నర దశాబ్దాల పాటు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో అపజయం ఎరుగని నాయకుడిగా గుర్తింపు పొందారు. -
ఈతకు వెళ్లి బాలుడి మృత్యువాత
[ 26-04-2024]
ఈత కొట్టేందుకు చెరువులోకి దిగిన బాలుడు మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం కోనాయిపల్లిలో జరిగింది. -
జహీరాబాద్కు 69.. మెదక్కు 90
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామపత్రాల స్వీకరణ ఘట్టం గురువారంతో ముగిసింది. జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి 40 మంది అభ్యర్థులు 69 నామినేషన్లు దాఖలు చేశారు. -
రోడ్షోలు.. సభలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు కోలాహలం మధ్య నామినేషన్లు సమర్పించారు. -
నాయకుల ఉత్సాహం.. వలసలకు ప్రోత్సాహం
[ 26-04-2024]
ఎన్నికల్లో పైచేయి సాధించాలని ప్రధాన పార్టీలు చేరికలపై దృష్టి పెట్టాయి. ప్రజల్లో పరపతి ఉన్న నియోజకవర్గం, మండల స్థాయి నేతలపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు. -
ప్రైవేటు రుణాలతో ఆర్థిక ఇబ్బందులు
[ 26-04-2024]
హుస్నాబాద్ ప్రాంతంలో ప్రైవేటుగా సూక్ష్మ రుణాలు (మైక్రో ఫైనాన్స్) మళ్లీ మొదలయ్యాయి. పేదల అవసరాలను ఆసరా చేసుకుని రుణాలు ఇస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
సామాజిక మాధ్యమంలో బయటపడిన వరుడి గుట్టు
[ 26-04-2024]
పెళ్లి నిశ్చయమైన యువకుడికి మరో మహిళతో సంబంధం ఉందని తెలుసుకున్న వధువు బంధువులు పెళ్లికి ఒకరోజు ముందు వరుడిని నిలదీసిన ఘటన శివ్వంపేట మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది.