యాసంగి కొనుగోళ్లకు సన్నద్ధం
యాసంగిలో పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. గత సీజన్తో పోల్చితే ఈసారి గణనీయంగా సాగు పెరిగింది. దీంతో ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు.
2.30 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా
209 కేంద్రాల ఏర్పాటుకు ప్రణాళిక
కల్హేర్ మండలం బీబీపేటలో వరి చేను
ఈనాడు, సంగారెడ్డి: యాసంగిలో పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. గత సీజన్తో పోల్చితే ఈసారి గణనీయంగా సాగు పెరిగింది. దీంతో ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. గత యాసంగిలో 75వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. ఈసారి ఏకంగా 2.07 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాల్సి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దాదాపు మూడింతల మేర అదనంగా కొనాల్సి వస్తుండటంతో 209 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. గత వానాకాలం మాదిరిగానే ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. వరి సాగు చేసిన ప్రతి గ్రామంలోనూ కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజరు సుగుణాబాయి తెలిపారు. ఏప్రిల్ నుంచి కేంద్రాలకు ధాన్యం రావడం ఆరంభం అవుతుందంటున్నారు. అందుకు తగినట్లుగా సిద్ధమవుతున్నారు. మే నెలలో ఒక్కసారిగా ధాన్యం భారీగా కేంద్రాలకు రానుంది. ఆ సమయంలోనూ సమస్యలు ఉత్పన్నమవకుండా చూస్తే మేలు.
కొరత రాకుండా చూడాలి
ప్రధానంగా ప్రతిసారీ రవాణా సమస్య వస్తుంటుంది. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం రోజుల పాటు కేంద్రాల్లోనే ఉంటుంది. మిల్లుకు తరలించే వరకు రైతుదే బాధ్యత అని నిర్వాహకులు చెబుతుంటారు. దీంతో అన్నదాతలు కేంద్రాల వద్దే పడిగాపులు పడాల్సిన పరిస్థితి. అకాల వర్షాల వల్ల ధాన్యం తడిసిపోతే వారే నష్టపోవాల్సి ఉంటుంది. ఈ అంశాలన్నీ దృష్టిలో ఉంచుకొని ఈసారి లారీల కొరత తలెత్తకుండా చూడాలి. గన్నీ సంచులు, ధాన్యం శుభ్ర పరిచేవి, తేమ కొలిచేవి, తూకం యంత్రాలు... ఇలా అవసరమైన అన్నింటినీ కొనుగోళ్లు మొదలయ్యేలోగా కేంద్రాల్లో అందుబాటులో ఉంచితే సమస్యలు రావు.
ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉండటంతో..
ఈసారి వేసవిలో భానుడు ప్రతాపం చూపుతాడనే అంచనాలున్నాయి. ఈ క్రమంలో కేంద్రాల వద్ద కనీస వసతులు ఏర్పాటు చేస్తే మేలు. తాగునీరు, ఓఆర్ఎస్ పొట్లాలు అందుబాటులో ఉంచాలి. రైతులు, హమాలీలు విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా నీడ ఉండేలా చూస్తే వడదెబ్బ బారిన పడకుండా వారిని కాపాడుకోవచ్చు. దాతలు స్పందించి కొనుగోలు కేంద్రాల వద్ద మజ్జిగ, అంబలి లాంటి వాటిని అందిస్తే అందరికీ ప్రయోజనకరంగా ఉంటుంది. అధికారులు ఈ దిశగానూ వారిని ప్రోత్సహిస్తే మేలు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమితానందం.. షా ఆగమనం
[ 26-04-2024]
భాజపా అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా ఆగమనంతో సిద్దిపేట కమలనాథుల్లో నూతనోత్సాహం వెల్లివిరిసింది. లోక్సభ ఎన్నికల వేళ కాషాయ దళంలో నయాజోష్ కనిపించింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
మెతుకుసీమ గులాబీ జెండా అడ్డా...
[ 26-04-2024]
మెతుకుసీమ గులాబీ జెండాకు అడ్డా అని... ఈ ఎన్నికల్లోనూ మరోసారి జెండా ఎగరవేస్తామని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు ధీమా వ్యక్తం చేశారు. -
వెల్లువెత్తిన నామపత్రాలు
[ 26-04-2024]
మెదక్ లోక్సభ స్థానానికి వెల్లువలా నామపత్రాలు దాఖలయ్యాయి. మొత్తం 54 మంది అభ్యర్థులు 90 సెట్ల నామినేషన్లు సమర్పించారు. -
బీసీ బిడ్డను ఆశీర్వదించండి
[ 26-04-2024]
అన్ని వర్గాలను కలుపు కొనిపోయే బీసీ బిడ్డగా తనను ఆశీర్వదించాలని మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు కోరారు. గురువారం కౌడిపల్లి, కంచన్పల్లి, పాంపల్లి, వెల్దుర్తి, మాసాయిపేటలో రోడ్డుషో, సభ నిర్వహించారు. -
ఫలితం లేదు..
[ 26-04-2024]
జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు కొంతమేర ఊరటనిచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో రాలేదు. గత నాలుగేళ్ల నుంచి ఫలితాల్లో జిల్లా చివరి స్థానంలో నిలుస్తుండగా.. -
నిఘా నీడ.. పక్కా పర్యవేక్షణ
[ 26-04-2024]
సార్వత్రిక సమరంలో ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిఘా వ్యవస్థను పటిష్ఠం చేసింది. -
పంచాయతీ నుంచి లోక్సభకు..
[ 26-04-2024]
ఎం.బాగారెడ్డి.. మెతుకుసీమ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. నాలుగున్నర దశాబ్దాల పాటు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో అపజయం ఎరుగని నాయకుడిగా గుర్తింపు పొందారు. -
ఈతకు వెళ్లి బాలుడి మృత్యువాత
[ 26-04-2024]
ఈత కొట్టేందుకు చెరువులోకి దిగిన బాలుడు మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం కోనాయిపల్లిలో జరిగింది. -
జహీరాబాద్కు 69.. మెదక్కు 90
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామపత్రాల స్వీకరణ ఘట్టం గురువారంతో ముగిసింది. జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి 40 మంది అభ్యర్థులు 69 నామినేషన్లు దాఖలు చేశారు. -
రోడ్షోలు.. సభలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు కోలాహలం మధ్య నామినేషన్లు సమర్పించారు. -
నాయకుల ఉత్సాహం.. వలసలకు ప్రోత్సాహం
[ 26-04-2024]
ఎన్నికల్లో పైచేయి సాధించాలని ప్రధాన పార్టీలు చేరికలపై దృష్టి పెట్టాయి. ప్రజల్లో పరపతి ఉన్న నియోజకవర్గం, మండల స్థాయి నేతలపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు. -
ప్రైవేటు రుణాలతో ఆర్థిక ఇబ్బందులు
[ 26-04-2024]
హుస్నాబాద్ ప్రాంతంలో ప్రైవేటుగా సూక్ష్మ రుణాలు (మైక్రో ఫైనాన్స్) మళ్లీ మొదలయ్యాయి. పేదల అవసరాలను ఆసరా చేసుకుని రుణాలు ఇస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
సామాజిక మాధ్యమంలో బయటపడిన వరుడి గుట్టు.. ఒకరోజు ముందు ఆగిన పెళ్లి
[ 26-04-2024]
పెళ్లి నిశ్చయమైన యువకుడికి మరో మహిళతో సంబంధం ఉందని తెలుసుకున్న వధువు బంధువులు పెళ్లికి ఒకరోజు ముందు వరుడిని నిలదీసిన ఘటన శివ్వంపేట మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం