Harish Rao: మీ కోసం 18 గంటలు శ్రమిస్తున్నా: మంత్రి హరీశ్
‘సిద్దిపేట ప్రజలే నా కుటుంబం. మీకోసం రోజులో 18 గంటలు శ్రమిస్తున్నా. నేను ఎక్కడున్నా ఇక్కడికి వస్తేనే తృప్తిగా ఉంటుంది. మరింత సేవ చేసేందుకు ప్రేమ, ఆశీర్వాదం అందించాలి..’ అని మంత్రి హరీశ్రావు అన్నారు.
మరింత సేవ చేసేందుకు ఆశీర్వదించండి: మంత్రి హరీశ్రావు
బ్యాడ్మింటన్ ఆడుతున్న హరీశ్రావు
సిద్దిపేట, సిద్దిపేట టౌన్, న్యూస్టుడే: ‘సిద్దిపేట ప్రజలే నా కుటుంబం. మీకోసం రోజులో 18 గంటలు శ్రమిస్తున్నా. నేను ఎక్కడున్నా ఇక్కడికి వస్తేనే తృప్తిగా ఉంటుంది. మరింత సేవ చేసేందుకు ప్రేమ, ఆశీర్వాదం అందించాలి..’ అని మంత్రి హరీశ్రావు అన్నారు. శుక్రవారం రాత్రి సిద్దిపేటలో రూ.లక్ష చొప్పున బీసీ బంధు చెక్కులను నియోజకవర్గంలోని 400 మంది లబ్ధిదారులకు అందించారు. గృహలక్ష్మి పథకం కింద మరో 400 మందికి మంజూరు ఉత్తర్వులు పంపిణీ చేశారు. చిన్నకోడూరు మండల జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పట్టాలు అందజేశారు. వెట్టిచాకిరి విముక్తి కింద బాధితులకు స్థల పట్టాలు, కుల సంఘ భవనాలకు నిధులు మంజూరు చేస్తూ ప్రతులను అందజేసి మాట్లాడారు. దేశానికి తెలంగాణ నమూనా అయితే.. రాష్ట్రానికి సిద్దిపేట అని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో ఈ ప్రాంత గౌరవాన్ని ఇనుమడింపజేశామన్నారు. జిల్లా పాలనాధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో అత్యధిక బీసీ బంధు సాయం అందించిన జాబితాలో సిద్దిపేట జిల్లా మొదటిస్థానంలో ఉందన్నారు. మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్హుస్సేన్, మున్సిపల్ అధ్యక్షురాలు మంజుల, సుడా ఛైర్మన్ రవీందర్రెడ్డి, రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్ సభ్యుడు పాల సాయిరాం, మాజీ ఛైర్మన్ రాజనర్సు, సుడా డైరెక్టర్ మచ్చ వేణుగోపాల్, ఎస్సీ, బీసీ అభివృద్ధి శాఖల అధికారులు శ్రీరాంరెడ్డి, హరికృష్ణ, ప్రజాప్రతినిధులు, నాయకులు ఉన్నారు.
క్రీడాభివృద్ధికి పెద్దపేట
క్రీడాభివృద్ధికి పెద్దపీట వేస్తూ ఇప్పటి వరకు రూ.11 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి హరీశ్రావు తెలిపారు. స్పోర్ట్స్ క్లబ్ కోరిక మేరకు కబడ్డీ, ఖోఖో కోర్టులు, రన్నింగ్ ట్రాక్ త్వరలో మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు. సిద్దిపేటలోని లఘు క్రీడా మైదానం వద్ద రూ.1.50 కోట్లతో నిర్మించిన బాస్కెట్బాల్, షటిల్ బ్యాడ్మింటన్ కోర్టులను టీఎస్ఈడబ్ల్యూఐడీసీ ఛైర్మన్ రావుల శ్రీధర్రెడ్డితో కలిసి ప్రారంభించారు. నెలన్నర వ్యవధిలో రెండు కోర్టులను నిర్మించి ప్రారంభించేందుకు కృషి చేసిన శ్రీధర్రెడ్డిని అభినందించారు. బ్యాడ్మింటన్ ఆడారు. వాలీబాల్ అకాడమీలో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ధ్రువపత్రాలు అందజేశారు. సిద్దిపేట స్పోర్ట్స్ క్లబ్ కన్వీనర్ పాల సాయిరాం, బాస్కెట్ బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మన్నె మహేశ్కుమార్, కార్యదర్శి వంశీ ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బంగారు ఆభరణాలు చోరీ
[ 18-05-2024]
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఆర్టీసీ బస్టాండ్లో బంగారం చోరీకి గురైంది. బస్సు ఎక్కుతున్న మహిళ బ్యాగు లోంచి 8 తులాల బంగారు ఆభరణాలను దుండగులు చోరీ చేశారు. -
ఇక స్థానిక సమరం
[ 18-05-2024]
మరో ఎన్నికల సందడి రానుంది. పార్లమెంట్ ఎన్నికలు పూర్తికావడంతో పరిపాలనపై దృష్టి సారించనున్న రాష్ట్ర ప్రభుత్వం.. స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు మొగ్గుచూపుతోంది. -
కొనుగోళ్లలో జాప్యంపై కర్షకుల కన్నెర్ర
[ 18-05-2024]
ధాన్యం కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ మండల పరిధిలోని మిన్పూర్ గ్రామ రైతులు శుక్రవారం మెదక్-బోడ్మట్పల్లి రహదారిపై ఆందోళనకు దిగారు. -
సొంతింటి కల..నెరవేరేనా?
[ 18-05-2024]
నియోజకవర్గ, డివిజన్ కేంద్రంలో నిర్మించిన కొన్ని ఇళ్ల పనులు కొసరు పనులతో నిలిచిపోగా, మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయి. -
భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని అనర్హుడిగా ప్రకటించండి
[ 18-05-2024]
మెదక్ లోక్సభ నియోజకవర్గం భారాస అభ్యర్థి పి.వెంకట్రామిరెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలని భాజపా మెదక్ అభ్యర్థి ఎం.రఘునందన్రావు శుక్రవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్రాజ్కు ఫిర్యాదు చేశారు. -
ఉపాధి కూలీలకు ఊరట
[ 18-05-2024]
ఈ ఏడాది వేసవిలో ఎండలు మండిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. -
ఒక్క రూపాయైనా జమ కాలేదు
[ 18-05-2024]
జిల్లావ్యాప్తంగా యాసంగిలో రైతులు ఉత్సాహంగా జొన్న పంట సాగు చేశారు. దిగుబడులు చేతికొస్తున్నాయి. -
శిథిల భవనాలు.. కానరాని చర్యలు
[ 18-05-2024]
ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయలోపం జనం ప్రాణాలను బలిగొంటోంది. -
పల్లెల్లో మొదలైన సందడి
[ 18-05-2024]
లోక్సభ ఎన్నికలు ముగిశాయి. ఇక గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారా..? అనే ప్రశ్నకు అవుననే సంకేతాలు వస్తున్నాయి. -
గుర్తించని జోన్లు.. ట్రాఫిక్ ఇక్కట్లు
[ 18-05-2024]
పట్టణాల్లో వ్యాపార జోన్లు అటకెక్కాయి. వ్యాపారాలు రహదారుల వెంట కాకుండా.. పురపాలక సంఘాలు ఏర్పాటు చేసిన జోన్లలో నిర్వహించుకునేలా ప్రణాళికలు రూపొంచడంలో యంత్రాంగం విఫలమయిందనే విమర్శలొస్తున్నాయి. -
కౌంటింగ్ కేంద్రాల్లో మూడంచెల భద్రత
[ 18-05-2024]
కౌంటింగ్ కేంద్రాల్లో మూడంచెల భద్రత ఏర్పాటు చేశామని రాష్ట్ర అదనపు ఎన్నికల కమిషనర్ లోకేష్కుమార్ అన్నారు. -
వాన రాకతో ధాన్యం ఆరక..
[ 18-05-2024]
వేసవికాలంలో జిల్లాలో వాతావరణంలో విభిన్న పరిస్థితులు నెలకొన్నాయి. -
నచ్చిన కోర్సు ఎంచుకోండి దోస్త్
[ 18-05-2024]
ఇంటర్ పూర్తిచేసిన విద్యార్థులకు ఎన్నో అవకాశాలు ఉంటాయి. డిగ్రీ కోర్సుల వైపు చూసే వారే ఎక్కువ మందే ఉంటారు. -
నిర్లక్ష్యం.. ప్రాణాంతకం
[ 18-05-2024]
ప్రజాప్రయోజనంతో చేపట్టే అభివృద్ధి పనుల పర్యవేక్షణ లోపించి ప్రాణాంతకంగా మారుతున్నాయి. -
నాన్నను కొట్టి.. పశ్చాత్తాపం చెంది..
[ 18-05-2024]
ఆవేశంలో అకారణంగా నాన్నను కొట్టి.. అనంతరం తండ్రి తప్పేమీ లేదని తెలుసుకున్న కుమారుడు పశ్చాత్తాపంతో ఆవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
తాజా వార్తలు (Latest News)
-
రీడర్స్ డైజెస్ట్.. యూకేలో ముగిసిన 86 ఏళ్ల ప్రయాణం
-
చైనా సైబర్ ముఠా చేతిలో ఏపీ వాసులు.. ఉద్యోగాల పేరుతో ఏజెంట్ల మోసం
-
బెంగళూరు vs చెన్నై: వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే పరిస్థితి ఏంటి?
-
ఈసీ అనుమతి నిరాకరణ.. తెలంగాణ కేబినెట్ భేటీ వాయిదా
-
భారత బలగాలకు ద్రోహం చేసిన చరిత్ర కాంగ్రెస్ది: ప్రధాని మోదీ
-
మీ కార్యాలయానికే వస్తాం.. ధైర్యముంటే అరెస్టు చేసుకోండి: కేజ్రీవాల్ సవాల్