సాధారణ జీవితం.. బస్సులో ప్రయాణం
ప్రస్తుతం ఎన్నికలంటే చాలు రూ.కోట్లు వెచ్చించాల్సిందే. అప్పుడే ఫలితం దక్కుతుందన్నది నేటి తరం భావన. కానీ ఒకప్పుడు శాసనసభ ఎన్నికల్లో అభ్యర్థి ఖర్చు చేసింది కేవలం రూ.30 వేలంటే అందరూ ఆశ్చర్యపోతారు
ఆర్ఎస్ వాసురెడ్డి
ప్రస్తుతం ఎన్నికలంటే చాలు రూ.కోట్లు వెచ్చించాల్సిందే. అప్పుడే ఫలితం దక్కుతుందన్నది నేటి తరం భావన. కానీ ఒకప్పుడు శాసనసభ ఎన్నికల్లో అభ్యర్థి ఖర్చు చేసింది కేవలం రూ.30 వేలంటే అందరూ ఆశ్చర్యపోతారు. ఇది మాత్రం అక్షర సత్యం. ఎమ్మెల్యేగా పని చేసినా చనిపోయే వరకు సాధారణ జీవితమే గడిపారు. ఆయనే మెదక్ జిల్లా రామాయంపేట ఎమ్మెల్యేగా పని చేసిన రామన్నగారి శ్రీనివాస్రెడ్డి (ఆర్ఎస్ వాసురెడ్డి).
వాసురెడ్డి 1985లో రామాయంపేట నియోజకవర్గం నుంచి భాజపా తరఫున పోటీ చేసి గెలుపొందారు. అప్పట్లో ఆయన ఖర్చు చేసింది కేవలం రూ.30 వేలే. నాడు ప్రచారం కూడా సాదాసీదాగా సాగింది. కార్యకర్తలు సైకిళ్లపై వెళ్లి ప్రచారం చేశారు. ప్రత్యర్థి ఎక్కువ డబ్బు ఖర్చు చేసినా ప్రజలు ఆదరించింది వాసురెడ్డినే కావడం గమనార్హం. 1983లోనూ ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేయగా ఓటమిపాలయ్యారు. ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక ప్రజల మధ్యనే ఉండేవారు. శాసనసభ సమావేశాలకు బస్సులోనే వెళ్లేవారు. చనిపోయే వరకు ఎక్కడికి వెళ్లాలన్నా ఆర్టీసీ బస్సే ఎక్కేవారు. అభివృద్ధి విషయంలో ఏనాడు రాజీ పడలేదన్న పేరు సంపాదించుకున్నారు. గత నెలలో అనారోగ్యంతో చేగుంట మండలం పొలంపల్లిలోని ఆయన స్వగ్రామంలో తుదిశ్వాస విడిచారు. నేడు పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఆదర్శ ప్రాయుడు.
న్యూస్టుడే, చేగుంట
పీవీ నర్సింహరావు
వంగరవాసి
ఆర్థిక సంస్కరణలతో దేశ ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను మార్చిన పీవీ నర్సింహరావు అంటే తెలియని వారుండరు. ఆయనది హుస్నాబాద్ నియోజకవర్గంలోని వంగర గ్రామం. ప్రస్తుతం ఈ గ్రామం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో ఉంది. ఆయన ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధానమంత్రి పదవులను అలంకరించారు. 1957లో తొలిసారిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మంథని నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. 1962లో రాష్ట్ర న్యాయశాఖ మంత్రి పదవి చేపట్టారు. 1971లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. హనుమకొండ, రాంటెక్, నంద్యాల నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. కేంద్రంలో విదేశీ వ్యవహారాలు, రక్షణ, మావన వనరుల అభివృద్ధి శాఖలు చేపట్టారు 1991-96 వరకు పీవీ ప్రధానిగా బాధ్యతలను సమర్థంగా నిర్వహించడమే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. పీవీ కుమారుడు రంగారావు విద్యాశాఖ మంత్రిగా పని చేశారు. మరోకుమారుడు పీవీ రాజేశ్వర్రావు ఓసారి ఎంపీగా ఎన్నికయ్యారు. పీవీ కుమార్తె సురభి వాణిదేవి ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు.
న్యూస్టుడే, హుస్నాబాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వానాకాలం సాగుకు సన్నద్ధం
[ 19-05-2024]
ఓ వైపు ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ కొనసాగుతుండగా... మరోవైపు అన్నదాతలు సాగుకు సన్నద్ధమవుతున్నారు. -
ఆగుతూ.. సాగుతూ..ఇబ్బంది పెడుతూ..
[ 19-05-2024]
అభివృద్ధికి మారుపేరుగా నిలిచే జాతీయ రహదారి పనులు నత్తనడకన సాగుతున్నాయి. ప్రజలను ఇబ్బందికి గురిచేస్తున్నాయి. మెదక్-ఎల్కతుర్తి 134 కి.మీ.ల 765డీజీ జాతీయ రహదారిని రూ.1,461 కోట్ల నిధులతో చేపట్టారు. -
చెరువు మట్టి.. పొలానికి పుష్టి
[ 19-05-2024]
రసాయన ఎరువుల వినియోగం రోజురోజుకు పెరుగడంతో భూసారం తగ్గడమే కాకుండా చీడపీడల ఉద్ధృతితో పాటు పంట దిగుబడుల్లో తేడా ఏర్పడుతోంది. -
లెక్కలు తేలుస్తారు
[ 19-05-2024]
సంఘాలు.. సంస్థలు.. కార్యాలయాలు ఎక్కడైనా లెక్కలే కీలకం. వీటిలో తేడా వస్తే నమ్మకానికి తావుండదు. అందుకే ఇవి పక్కాగా ఉండాలి. -
సీఎం ముఖచిత్రంతో..రాత పుస్తకాలు
[ 19-05-2024]
సర్కారు బడుల బలోపేతమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే మధ్యాహ్న భోజనం, ఉచితంగా రెండు జతల ఏకరూప దుస్తులు, -
తొలకరికే తొందరొద్దు
[ 19-05-2024]
తొలకరి వర్షాలకే రైతులు తొందరపడి ఎలాంటి విత్తనాలు విత్తొద్దు.. భూమిలో 60 శాతానికి పైగా తేమ ఉన్నప్పుడే విత్తాలి.. ఖరీఫ్ సీజన్కు అవసరమయ్యే ఎరువులు, విత్తనాలు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచాం -
4 రోజులు రూ.4.29 కోట్లు
[ 19-05-2024]
సార్వత్రిక ఎన్నికలు.. వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో అత్యధికులు స్వస్థలాలకు రాకపోకలు సాగించారు. -
సైబర్ నేరస్థులకు ‘మ్యూల్’ ఖాతాలు
[ 19-05-2024]
సైబర్ నేరస్థుల కోసం ‘మ్యూల్’ బ్యాంకు ఖాతాలు తెరుస్తున్న ముఠా గుట్టును తూర్పు మండలం టాస్క్ఫోర్స్, సైబర్ పోలీసులు, తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరోలు రట్టు చేశాయి. అయిదుగురు నిందితులను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. -
వెంకట్రామిరెడ్డిపై చర్యలు తీసుకోండి
[ 19-05-2024]
భారాస ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని భాజపా నేత రఘునందన్రావు రాష్ట్ర డీజీపీని కలిసి శనివారం ఫిర్యాదు చేశారు. -
అటు.. ఇటు ఓటేశారు!
[ 19-05-2024]
ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కే వజ్రాయుధం. దేశాన్ని పాలించేందుకు సమర్థ నేతలను ఎన్నుకునేందుకు రాజ్యాంగం కల్పించిన హక్కు ఇది. -
పఠనాసక్తికి బాసట
[ 19-05-2024]
విద్యార్థులు సెలవులు రాగానే చరవాణులకు, టీవీలకు అతుక్కుపోతుంటారు. కేవలం పాఠశాలలు కొనసాగుతున్నప్పుడే చదువుపై దృష్టిపెడుతున్నారు. -
హామీలు అమలు చేయకుంటే రోడ్డెక్కుతాం: భారాస
[ 19-05-2024]
ఎన్నికలకు ముందు రైతులకిచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని, లేదంటే రోడ్డెక్కుతామని మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి హెచ్చరించారు. -
అన్నదాతల ఆందోళన
[ 19-05-2024]
పట్టణంలోని ఏఎంసీ ఆవరణలో నిర్వహిస్తున్న పీఏసీఎస్ కొనుగోలు కేంద్రానికి ధాన్యం తరలించిన రైతులు లారీల సమస్య కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు
తాజా వార్తలు (Latest News)
-
ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ఫొటోతో నకిలీ వాట్సప్ కాల్స్
-
‘డబ్బు తిన్న వారిపై కుక్కల్ని వదలండి’.. కొడాలి నాని అనుచరుడి వీడియో వైరల్
-
భూమి రాసివ్వకపోతే.. చంపేస్తామన్నారు!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/05/24)
-
పెట్స్పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!
-
ఆరు నెలల్లో పీవోకే విలీనం ఖాయం..: సీఎం యోగి