స్పందించండి.. సంధించండి
ప్రజలు రాకపోకలు సాగించేటపుడు దారిలో అనేక సంఘటనలు చూస్తుంటారు. కొన్ని హృదయవిదారకంగా, ఎలాగైనా సాయం చేయాలనిపించేలా.. ఇంకొన్ని అన్యాయంగా, అక్రమంగా.. అగుపిస్తాయి. బిజీ జీవితమైనా ఉత్తమ పౌరులుగా స్పందించాలనిపిస్తుంది.
న్యూస్టుడే, సంగారెడ్డి అర్బన్, మెదక్, వికారాబాద్ కలెక్టరేట్, సిద్దిపేట
ప్రజలు రాకపోకలు సాగించేటపుడు దారిలో అనేక సంఘటనలు చూస్తుంటారు. కొన్ని హృదయవిదారకంగా, ఎలాగైనా సాయం చేయాలనిపించేలా.. ఇంకొన్ని అన్యాయంగా, అక్రమంగా.. అగుపిస్తాయి. బిజీ జీవితమైనా ఉత్తమ పౌరులుగా స్పందించాలనిపిస్తుంది. ఫోన్ చేసి ఎవరికైనా సమాచారం ఇవ్వాలనిపిస్తుంది. సంబంధిత ఫోన్ నంబరు గుర్తుకురాక ఇప్పుడెలా అని సతమతం అవుతుంటారు. అలాంటి వాటికి ప్రభుత్వం, సంస్థలు టోల్ఫ్రీ ఫోన్ నంబర్లను అందుబాటులో ఉంచారు. వాటిని నమోదు చేసుకొని అవసరమైనపుడు ఫోన్ చేసి సంధించొచ్చు. ఆయా ఫోన్ నంబర్లను తెలియజేయడమే ఈ కథనం ఉద్దేశం.
సైబర్ నేరాల అడ్డుకట్టకు..
1930
యువతకు సైబర్ నేరాల నియంత్రణపై అవగాహన
సైబర్ నేరాలు అత్యధికంగా నమోదవుతున్నాయి. నిరక్షరాస్యలే కాకుండా ఉన్నతాద్యోగులు సైతం బాధితులే ఉండటం గమనార్హం. ఆన్లైన్లో యాప్ల ద్వారా ఉద్యోగాలు, అధికంగా నగదు అందిస్తాం అంటూ ఆకట్టుకునే ప్రయత్నాలు చేసి గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్లు చేసి మోసానికి గురి చేస్తున్నారు. అలాంటి వాటికి త్వరగా ఆన్లైన్లో https:///www.cybercrime.gov.in సమాచారం ఇచ్చిన వెంటనే వారు నగదును నిందితుడి ఖాతాకు వెళ్లకుండా నిలిపివేస్తారు. జాతీయ టోల్ఫ్రీ నంబరు 1930 ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.
వేధింపులకు గురవుతున్నారా
181
నిత్యం భర్త మద్యం తాగి వచ్చి భార్యతో తగాదా పెట్టుకుంటున్నారా? వరకట్నం తేవాలని వేధిస్తున్నారా? బహిరంగ ప్రదేశాల్లో ఎవరైనా ఆకతాయిలు సతాయిస్తున్నారా? వెంటనే మహిళ హెల్ప్లైన్ 181 టోల్ఫ్రీ నంబర్కు సమాచారం ఇస్తే చాలు. క్షణాల్లో అక్కడికి సఖి కేంద్రానికి సంబంధించిన వాహనం వస్తుంది. మహిళకు ఉచితంగా వైద్యం, న్యాయం, పోలీసు, వసతి, సౌకర్యాలు కల్పిస్తుంది. ఇటీవల ‘టీసేఫ్’ యాప్ను తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. యాప్లో ప్రయాణిస్తున్న ప్రాంతం వివరాలు నమోదు చేస్తే పోలీసు రక్షణ వ్యవస్థలోకి వెళ్తాయి.
మూగ జీవాల రక్షణ
మూగ జంతువులు బావిలో పడటం.. చెట్లలో ఇరుక్కుపోవడం, రోడ్డు ప్రమాదాల్లో గాయపడి అవస్థ పడుతుంటాయి. అలాంటి ఇబ్బందికర పరిస్థితిలో జంతువులను రక్షించేందుకు అటవీ రేంజ్ అధికారులకు ఫోన్ చేస్తే స్పందిస్తారు.
సంగారెడ్డి జిల్లా అటవీ శాఖ రేంజీ అధికారి వీరేంద్రబాబు 94401 11126... మెదక్ జిల్లా అధికారి రవిప్రసాద్ 94903 57522.. సిద్దిపేటలో .. సందీప్కుమార్ - 99595 30053.. వికారాబాద్లో ... జ్ఞానేశ్వర్ 89789 71100కు ఫోన్ చేయాల్సి ఉంటుంది.
వయో వృద్ధులకు అండ
14567
వయసు పైబడిన వెంటనే తల్లిదండ్రులను సరిగా పట్టించుకోవటం లేదు. ఆస్తి పంపకాలు, కుటుంబ కలహాలు, ఇతరత్రా గొడవలు ఉంటున్నాయి. ఎవరైనా 14567కు ఫిర్యాదు చేస్తే చాలు.. అధికారులు స్పందించి కుటుంబీకులకు కౌన్సిలింగ్ ఇస్తారు. అవసరమైతే ఇతరత్రా సాయం చేస్తారు. ఆర్డీవో ఆధ్వర్యంలో విచారణ చేపడతారు.
ఆహార కల్తీకి చెక్
ఇష్టంగా కొనుకున్న ఆహారం నాసిగా ఉన్నా.. హోటల్లో అపరిశుభ్ర వాతావరణం ఉన్నా.. పండ్లను హానికారకమైన కార్బైడ్తో మగ్గిస్తున్నా.. చెక్ పెట్టవచ్చు. వీటి నియంత్రణకు అధికారికి ఫోన్ ద్వారా సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటారు.
సంగారెడ్డిలో ఆహార కల్తీ నియంత్రణ పర్యవేక్షణ అధికారి ధర్రేంద 9848411174..
మెదక్లో .. తార్యానాయక్ 9676974565.. సిద్దిపేటలో.. అనూష - 93470 44004.
తూకాల్లో మోసాలు
తూకాల్లో కనికట్టు చేసినా.. పెట్రోలు తక్కువ వస్తోందని అనుమానం వచ్చినా.. చూస్తూ ఊరుకోవద్దు. తూనికలు కొలతల శాఖను సంప్రదించండి.
సంగారెడ్డి జిల్లా తూనికలు, కొలతల శాఖ అధికారి
అనిల్కుమార్ 85230 11449.. మెదక్లో .. సుధాకర్ 99664 41128..
సిద్దిపేటలో.. శ్రీనివాస్రెడ్డి 98489 23848..
వికారాబాద్లో ... అశోక్కుమార్ 90003 14247
బాల్యవివాహాలను నిలువరించండిలా..
1098
బాల్య వివాహాలు అరికట్టేందుకు సూచనలిస్తున్న అధికారులు
ఎవరైనా బాలబాలికలకు పెళ్లి చేస్తే 1098కు సమాచారం ఇవ్వాలి. బాలల పరిరక్షణ అధికారి, పోలీసులు, రెవెన్యూ అధికారులు వచ్చి కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇస్తారు. పెళ్లి పూర్తయితే ఇరు వర్గాలపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటారు. బడికి వెళ్లాల్సిన వయసులో ఇటుక బట్టీల్లో, హోటళ్లు, దుకాణాల్లో చట్ట విరుద్ధంగా పని చేయించుకుంటే ఫోన్ చేయాలి. కార్మిక శాఖ, బాలల పరిరక్షణ అధికారులు చర్యలు తీసుకుంటారు.
గ్యాస్తో జాగ్రత్త!
1906
18002333555
వంటకు గ్యాస్ ఎంతటి ప్రయోజనకరమో.. నిర్లక్ష్యంగా ఉంటే అంత ప్రమాదకరం. సిలిండర్ లీకేజీని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే లీకేజీ లేదా ఇతరత్రా సిలిండర్ సమస్యలకు టోల్ఫ్రీ నంబరుకు చేస్తే.. పరిష్కారం దొరుకుతుంది. హెచ్పీ, భారత్, ఇండేన్ తదితర గ్యాస్ కంపెనీలకు ప్రత్యేకంగా వేర్వేరు ఫోన్ నంబర్లు ఉన్నా.. టోల్ఫ్రీ ద్వారా ఏ కంపెనీదైనా ఫిర్యాదు, సూచనలు, ప్రతిపాదనలు చేయవచ్చు. గ్యాస్ లీకేజీలకు మాత్రమే ప్రత్యేకంగా 1906 నంబరు కేటాయించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అభివృద్ధికి భరోసా.. గెలుపునకు దిశానిర్దేశం
[ 27-04-2024]
మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నారాయణఖేడ్ నియోజకవర్గ అభివృద్ధికి భరోసా కల్పించారు. రానున్న లోకసభ ఎన్నికల్లో జహీరాబాద్ ఎంపీగా సురేష్షెట్కార్ను లక్ష మెజారిటీతో గెలిపించేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. -
రెండో విడత ర్యాండమైజేషన్ పూర్తి
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ సిబ్బంది రెండో విడత ర్యాండమైజేషన్ పూర్తి చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాహుల్ రాజ్ తెలిపారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లో మెదక్ పార్లమెంట్ ఎన్నికల సాధారణ పరిశీలకులు సమీర్ మాధవ్ కుర్కోటి పర్యవేక్షణలో ఈ ప్రక్రియ నిర్వహించారు. -
‘రాజీనామాలతో కొత్త నాటకం’
[ 27-04-2024]
రాజీనామాల పేరుతో మాజీ మంత్రి హరీశ్రావు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కొత్త నాటకానికి తెరలేపారని భాజపా ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. ఇద్దరూ రాజీనామాలు చేసేవారు కాదు, పనిచేసే వారు కాదని విమర్శించారు. -
సగం కట్టి.. వదిలిపెట్టి
[ 27-04-2024]
నియోజకవర్గ, డివిజన్ కేంద్రమైన నర్సాపూర్ పురపాలికలో సమీకృత మార్కెట్ నిర్మాణ పనులు ఏడాదిగా అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. ప్రజలకు కనీస మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా పురపాలికల్లో సమీకృత మార్కెట్ల నిర్మాణానికి గత ప్రభుత్వం పూనుకుంది. -
విధుల్లో నిర్లక్ష్యం తగదు
[ 27-04-2024]
విధుల నిర్వహణలో సిబ్బంది నిర్లక్ష్యం తగదని జిల్లా వైద్యాధికారి శ్రీరామ్ అన్నారు. శుక్రవారం ఆయన పెద్దశంకరంపేట పీహెచ్సీని సందర్శించారు. ఆస్పత్రి నిర్వహణ తీరు, ప్రసూతి వివరాలను పరిశీలించారు. -
విద్యార్థి అధ్యయనం.. విజ్ఞాన కౌశలం
[ 27-04-2024]
విద్యార్థిలో దాగిన విజ్ఞాన తృష్ణను వెలికితీసి.. నూతన ఆవిష్కరణలకు కళాశాల విద్యా శాఖ కృషి చేస్తోంది. వారి కృషి ఫలితంగా ఏటా నిర్వహిస్తున్న ‘జిజ్ఞాస’ పోటీల్లో పలువురు ప్రతిభ చాటుతున్నారు. -
పరిశీలిస్తారు.. నివేదిస్తారు..
[ 27-04-2024]
ప్రజాస్వామ్యంలో ఓటుకు ఉన్న ప్రాధాన్యం మనందరికీ తెలిసిందే. ఎవరికీ ఎక్కువ ఓట్లు పడితే వారే పాలకపక్షాలుగా గద్దెనెక్కవచ్చు. నిర్ణీత వ్యవధిలో నిర్వహించే ఎన్నికల ప్రక్రియ సాఫీగా సాగాలి. -
ఇంటింటికీ ఓటరు చీటీలు
[ 27-04-2024]
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తోంది. స్వేచ్ఛాయుతంగా ఓటు వేసేందుకు సకల సౌకర్యాలు కల్పించిన ఎన్నికల సంఘం.. ఓటర్లకు పోల్ చీటీలు పంపిణీ చేస్తోంది. -
ఉల్లంఘనులకు ముకుతాడు
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. అభ్యర్థుల నామపత్రాల స్వీకరణ గడువు ముగిసింది. ప్రచారాలు ఊపందుకుంటున్నాయి. -
భారాస అక్రమాలు బయటపడుతున్నాయి
[ 27-04-2024]
బీసీ బిడ్డ నీలం మధుకు సీఎం రేవంత్రెడ్డి టిక్కెట్ ఇచ్చారని.. ఇక గెలిపించుకోవాలని మంత్రి కొండా సురేఖ కోరారు. సిద్దిపేటలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ, పార్టీ కార్యాలయంలో సమావేశం శుక్రవారం జరిగాయి. -
రాజీనామా పత్రం రాసి పెట్టుకో హరీశ్రావు: పొన్నం
[ 27-04-2024]
వచ్చే ఆగస్టు 15 నాటికి తమ పార్టీ రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతుందని, మాజీ ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్రావు ముందుగానే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా పత్రం రాసి పెట్టుకోవాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ అన్నారు. -
53 ఆమోదం.. ఒకటి తిరస్కరణ
[ 27-04-2024]
మెదక్ లోక్సభ స్థానానికి దాఖలైన నామినేషన్లలో ఒక అభ్యర్థి నామపత్రాన్ని రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. మొత్తం 54 మంది అభ్యర్థులు 90 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
జైల్లో కేజ్రీవాల్ ఆరోగ్యంగానే..: ఎయిమ్స్ మెడికల్ బోర్డు..!
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
-
ఆలిన్ హెర్బల్ పరిశ్రమలో మళ్లీ వ్యాపించిన మంటలు
-
రోడ్డుపై పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: అమెరికా కారు ప్రమాదంలో 3 భారతీయులు దుర్మరణం
-
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
-
హాలీవుడ్కు వెళ్లాక భయపడ్డా.. ఆ భావన మనసును కుంగదీసింది: ప్రియాంక చోప్రా