ఒక్క ప్రమాదం.. నాలుగిళ్లలో విషాదం
ఒక్క రోడ్డు ప్రమాదం.. నాలుగిళ్లలో తీరని విషాదాన్ని నింపింది. ఓ వైపు పెళ్లి బాజాలు, మరోవైపు బంధువులు, మిత్రుల సంతోషం, ముచ్చట్లతో సంతోషంగా ఉన్న ఆ పెళ్లి ఇల్లు శోకసంద్రంలో మునిగిపోయింది.
బోసిపోయిన పెళ్లి ఇల్లు
న్యూస్టుడే, పాపన్నపేట: ఒక్క రోడ్డు ప్రమాదం.. నాలుగిళ్లలో తీరని విషాదాన్ని నింపింది. ఓ వైపు పెళ్లి బాజాలు, మరోవైపు బంధువులు, మిత్రుల సంతోషం, ముచ్చట్లతో సంతోషంగా ఉన్న ఆ పెళ్లి ఇల్లు శోకసంద్రంలో మునిగిపోయింది. పచ్చని పందిరి సిద్ధం చేస్తుండగా.. విధి వక్రీకరించింది. బుధవారం పెళ్లి కుమార్తెను తీసుకొచ్చేందుకు 30 మంది బంధువులు ట్రాక్టర్పై వెళ్తుండగా బోల్తాపడటంతో ముగ్గురు మహిళలు మృత్యువాతపడ్డారు. ఈ ఘటన మరువకముందే గురువారం వరుడి తాత మనోవేదనతో ఆత్మహత్య చేసుకోవడం మరింత కలిచివేసింది.
వరుడి ఇంటి వద్దే..: పాపన్నపేట మండలం బాచారానికి చెందిన సొంగ గౌరగారి పెంటయ్య (68), పాపమ్మ దంపతులకు ఏకైక కుమార్తె శ్యామమ్మ ఉన్నారు. కుమారులు లేకపోవడంతో శ్యామమ్మను ఇదే గ్రామానికి చెందిన పోచయ్యతో వివాహం చేసి ఇల్లరికం తెచ్చుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు రమేష్, కృష్ణ ఉన్నారు. పెద్ద కుమారుడు రమేష్కు ఇటీవల అందోలుకు చెందిన మమతతో వివాహం నిశ్చయమైంది. వరుడి ఇంటి వద్ద గురువారం జరగాల్సిన పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేశారు. పెళ్లికుమార్తెను తీసుకొచ్చేందుకు వరుడి సమీప బంధువులు 30 మంది ట్రాక్టర్లో అందోలుకు బయల్దేరారు. మన్సానిపల్లి మలుపు వద్ద ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడటంతో ముగ్గురు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు.
భర్తకు అండగా..: ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో మృతిచెందిన వారందరికీ వ్యవసాయమే ఆధారం. ఈ ఘటనలో మృతి చెందిన జట్టిగారి సంగమ్మ (47), గోపాల్ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, కుమారుడు సాయికుమార్ ఉన్నారు. కుమార్తెలందరికీ వివాహాలు జరిగాయి. సాయికుమార్ హైదరాబాద్లో ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. గోపాల్ ఇటీవల పక్షవాతం బారినపడ్డాడు. సంగమ్మ ఓ వైపు వ్యవసాయం చేస్తూ, మరోవైపు భర్త ఆలనాపాలన చూసుకుంటోంది. ప్రమాదంలో సంగమ్మ మృతి చెందడంతో తనకెవరు దిక్కని గోపాల్ రోదన అందరినీ కంటతడిపెట్టించింది.
అందరివీ వ్యవసాయ కుటుంబాలే..
- ఈ ఘటనలో మృతి చెందిన రావుగారి భూదమ్మ (50).. భర్త కిష్టయ్య పదేళ్ల కిందట మృతి చెందాడు. కుమారుడు లక్ష్మీనారాయణ, కుమార్తె ఉన్నారు. భర్త చనిపోయాక కుటుంబ భారమంతా భూదమ్మపైనే పడింది. వ్యవసాయంతో పాటు కూలీ పనులు చేసుకుంటూ అందరినీ పెంచి పెద్ద చేసింది. అందరికీ వివాహాలు జరిగాయి.
- మరో మృతురాలు రావుగారి ఆగమ్మ (50)కు భర్త మల్లయ్య, కుమార్తె మహేశ్వరి ఉన్నారు. వీరికి వ్యవసాయమే ఆధారం. కుమారులు లేకపోవడంతో కుమార్తెకు వివాహం చేసి అల్లుడిని ఇల్లరికం తెచ్చుకున్నారు.
ఉలిక్కిపడిన బాచారం: గ్రామస్థులంతా పెళ్లికి సిద్ధమవుతుండగా, ఇంతలో ట్రాక్టరు బోల్తా పడిన విషయం తెలియడంతో అందరూ హతాశులయ్యారు. మృతులందరూ సమీప బంధువులు కావడంతో ఆనందం కాస్త ఆవిరైంది. దీనికితోడు వృద్ధుడి ఆత్మహత్య మరింత కలచివేసింది. గత ఫిబ్రవరి 19న ఇదే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ ఘటన మరువక ముందే మరో నలుగురు మృతి చెందడంతో బాచారం గ్రామం ఉలిక్కిపడింది. బాధిత కుటుంబాలను మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు గురువారం సాయంత్రం పరామర్శించారు. అధైర్యపడొద్దని, అండగా ఉంటామని చెప్పారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యాధికారులతో ఫోన్లో మాట్లాడారు. నరేందర్ గౌడ్, శ్రీనివాస్, గణేష్, తదితరులున్నారు.
మనోవేదనతో తాత..
పెంటయ్య
బంధువులంతా శోకసంద్రంలో మునిగిపోగా, తన మనవడి పెళ్లి ఆగిపోయిందని రమేష్ తాత పెంటయ్య మనోవేదనకు గురయ్యాడు. గురువారం తెల్లవారుజామున ఇంట్లోని ఓ గదిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఓ వైపు రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, వృద్ధుడి బలవన్మరణంతో బంధువులు, గ్రామస్థుల రోదనలు మిన్నంటాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అభివృద్ధికి భరోసా.. గెలుపునకు దిశానిర్దేశం
[ 27-04-2024]
మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నారాయణఖేడ్ నియోజకవర్గ అభివృద్ధికి భరోసా కల్పించారు. రానున్న లోకసభ ఎన్నికల్లో జహీరాబాద్ ఎంపీగా సురేష్షెట్కార్ను లక్ష మెజారిటీతో గెలిపించేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. -
రెండో విడత ర్యాండమైజేషన్ పూర్తి
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ సిబ్బంది రెండో విడత ర్యాండమైజేషన్ పూర్తి చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాహుల్ రాజ్ తెలిపారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లో మెదక్ పార్లమెంట్ ఎన్నికల సాధారణ పరిశీలకులు సమీర్ మాధవ్ కుర్కోటి పర్యవేక్షణలో ఈ ప్రక్రియ నిర్వహించారు. -
‘రాజీనామాలతో కొత్త నాటకం’
[ 27-04-2024]
రాజీనామాల పేరుతో మాజీ మంత్రి హరీశ్రావు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కొత్త నాటకానికి తెరలేపారని భాజపా ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. ఇద్దరూ రాజీనామాలు చేసేవారు కాదు, పనిచేసే వారు కాదని విమర్శించారు. -
సగం కట్టి.. వదిలిపెట్టి
[ 27-04-2024]
నియోజకవర్గ, డివిజన్ కేంద్రమైన నర్సాపూర్ పురపాలికలో సమీకృత మార్కెట్ నిర్మాణ పనులు ఏడాదిగా అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. ప్రజలకు కనీస మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా పురపాలికల్లో సమీకృత మార్కెట్ల నిర్మాణానికి గత ప్రభుత్వం పూనుకుంది. -
విధుల్లో నిర్లక్ష్యం తగదు
[ 27-04-2024]
విధుల నిర్వహణలో సిబ్బంది నిర్లక్ష్యం తగదని జిల్లా వైద్యాధికారి శ్రీరామ్ అన్నారు. శుక్రవారం ఆయన పెద్దశంకరంపేట పీహెచ్సీని సందర్శించారు. ఆస్పత్రి నిర్వహణ తీరు, ప్రసూతి వివరాలను పరిశీలించారు. -
విద్యార్థి అధ్యయనం.. విజ్ఞాన కౌశలం
[ 27-04-2024]
విద్యార్థిలో దాగిన విజ్ఞాన తృష్ణను వెలికితీసి.. నూతన ఆవిష్కరణలకు కళాశాల విద్యా శాఖ కృషి చేస్తోంది. వారి కృషి ఫలితంగా ఏటా నిర్వహిస్తున్న ‘జిజ్ఞాస’ పోటీల్లో పలువురు ప్రతిభ చాటుతున్నారు. -
పరిశీలిస్తారు.. నివేదిస్తారు..
[ 27-04-2024]
ప్రజాస్వామ్యంలో ఓటుకు ఉన్న ప్రాధాన్యం మనందరికీ తెలిసిందే. ఎవరికీ ఎక్కువ ఓట్లు పడితే వారే పాలకపక్షాలుగా గద్దెనెక్కవచ్చు. నిర్ణీత వ్యవధిలో నిర్వహించే ఎన్నికల ప్రక్రియ సాఫీగా సాగాలి. -
ఇంటింటికీ ఓటరు చీటీలు
[ 27-04-2024]
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తోంది. స్వేచ్ఛాయుతంగా ఓటు వేసేందుకు సకల సౌకర్యాలు కల్పించిన ఎన్నికల సంఘం.. ఓటర్లకు పోల్ చీటీలు పంపిణీ చేస్తోంది. -
ఉల్లంఘనులకు ముకుతాడు
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. అభ్యర్థుల నామపత్రాల స్వీకరణ గడువు ముగిసింది. ప్రచారాలు ఊపందుకుంటున్నాయి. -
భారాస అక్రమాలు బయటపడుతున్నాయి
[ 27-04-2024]
బీసీ బిడ్డ నీలం మధుకు సీఎం రేవంత్రెడ్డి టిక్కెట్ ఇచ్చారని.. ఇక గెలిపించుకోవాలని మంత్రి కొండా సురేఖ కోరారు. సిద్దిపేటలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ, పార్టీ కార్యాలయంలో సమావేశం శుక్రవారం జరిగాయి. -
రాజీనామా పత్రం రాసి పెట్టుకో హరీశ్రావు: పొన్నం
[ 27-04-2024]
వచ్చే ఆగస్టు 15 నాటికి తమ పార్టీ రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతుందని, మాజీ ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్రావు ముందుగానే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా పత్రం రాసి పెట్టుకోవాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ అన్నారు. -
53 ఆమోదం.. ఒకటి తిరస్కరణ
[ 27-04-2024]
మెదక్ లోక్సభ స్థానానికి దాఖలైన నామినేషన్లలో ఒక అభ్యర్థి నామపత్రాన్ని రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. మొత్తం 54 మంది అభ్యర్థులు 90 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
జైల్లో కేజ్రీవాల్ ఆరోగ్యంగానే..: ఎయిమ్స్ మెడికల్ బోర్డు..!
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
-
ఆలిన్ హెర్బల్ పరిశ్రమలో మళ్లీ వ్యాపించిన మంటలు
-
రోడ్డుపై పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: అమెరికా కారు ప్రమాదంలో 3 భారతీయులు దుర్మరణం
-
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
-
హాలీవుడ్కు వెళ్లాక భయపడ్డా.. ఆ భావన మనసును కుంగదీసింది: ప్రియాంక చోప్రా