logo

బార్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడిగా సుభాష్‌చంద్రబోస్‌

మెదక్‌ జిల్లా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా సుభాష్‌చంద్రబోస్‌ ఎన్నికయ్యారు. గురువారం మెదక్‌ పట్టణంలోని న్యాయస్థాన ప్రాంగణంలో ఎన్నిక నిర్వహించారు.

Published : 29 Mar 2024 03:13 IST

నియామకపత్రాన్ని అందజేస్తున్న సీనియర్‌ న్యాయవాది పోచయ్య

మెదక్‌ టౌన్‌, న్యూస్‌టుడే: మెదక్‌ జిల్లా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా సుభాష్‌చంద్రబోస్‌ ఎన్నికయ్యారు. గురువారం మెదక్‌ పట్టణంలోని న్యాయస్థాన ప్రాంగణంలో ఎన్నిక నిర్వహించారు. మధ్యాహ్నం 4.00 గంటలకు కౌంటింగ్‌ ప్రక్రియ చేపట్టారు. ప్రధాన కార్యదర్శిగా శ్రీపతిరావు, కార్యవర్గ సభ్యులుగా చిరంజీవి, రమేష్‌నాయక్‌, శారద, పరశురాములు విజయం సాధించారు. అనంతరం ఉపాధ్యక్షులుగా ఆకుల శ్రీనివాస్‌, సంయుక్త కార్యదర్శిగా దుర్గారెడ్డి, క్రీడలు, సాంస్కృతిక కార్యదర్శిగా మధుకిరణ్‌, గ్రంథాలయకార్యదర్శిగా అశ్వనికుమార్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారిగా శిరిగ ప్రభాకర్‌, సహాయ అధికారులుగా సాయికుమార్‌, లక్ష్మణ్‌ గౌడ్‌, మంజుల వ్యవహరించారు. నూతన కార్యవర్గానికి సీనియర్‌ న్యాయవాదులు పోచయ్య, జనార్దన్‌రెడ్డి, రామారావు నియామక పత్రాలు అందజేసి అభినందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని