దివ్యమైన ఓటుకు సాక్ష్యం
సాక్ష్యం యాప్లో దివ్యాంగులకు అవసరమైన సమస్త సమాచారాన్ని అందుబాటులో ఉంచారు. కొత్తగా ఓటు హక్కు పొందేందుకు దరఖాస్తు చేసుకునే వీలుంది. అది ఏ స్థాయిలో ఉందో ఆరా తీయవచ్చు.
‘యాప్’ అందుబాటులోకి తీసుకొచ్చిన ఎన్నికల సంఘం
న్యూస్టుడే, సంగారెడ్డి టౌన్, సిద్దిపేట, మెదక్, వికారాబాద్
సమస్త సమాచారం: సాక్ష్యం యాప్లో దివ్యాంగులకు అవసరమైన సమస్త సమాచారాన్ని అందుబాటులో ఉంచారు. కొత్తగా ఓటు హక్కు పొందేందుకు దరఖాస్తు చేసుకునే వీలుంది. అది ఏ స్థాయిలో ఉందో ఆరా తీయవచ్చు. తన ఓటు ఏ పోలింగ్ కేంద్రంలో ఉందో కూడా దీన్ని పరిశీలిస్తే తెలిసిపోతుంది. పోలింగ్ కేంద్రం చిరునామా తదితర వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు. తమ నియోజకవర్గానికి సంబంధించి పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలు సైతం ఇందులో ఉంటాయి. ఈ యాప్ను ఉపయోగించి ఏమైనా ఫిర్యాదులు ఉన్నా ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లేందుకు వీలుంటుంది.
ఓటు.. ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం. దీన్ని అందరూ వినియోగించుకుంటేనే సత్ఫలితాలు సాధ్యం. అంగవైకల్యం కారణంగా నడవలేని స్థితిలో ఉండటం కారణంగా కొంతమంది ఓటింగ్కు దూరంగా ఉంటున్నారు. ఎన్నికల సమయంలో ప్రతి ఓటుకూ ప్రాధాన్యం ఉంటుంది. ఒక ఓటు ఆధిక్యతతో అభ్యర్థులు గెలుపొందిన సందర్భాలెన్నో ఉన్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈసారి అర్హులైన వారంతా ఓటింగ్లో పాల్గొనేలా ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే తొలిసారిగా ఇటీవల నిర్వహించిన శాసనసభ ఎన్నికల సమయంలో దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా సాక్ష్యం యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పార్లమెంట్ ఎన్నికల్లోనూ దీన్ని అమలుచేస్తున్నారు. దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది.
జాబితా ఆధారంగా..
ఎన్నికల సంఘం అందుబాటులోకి తీసుకొచ్చిన సాక్ష్యం యాప్ను ఓటు హక్కు ఉన్న దివ్యాంగులు ఎవరైనా వినియోగించుకోవచ్చు. ప్లే స్టోర్కి వెళ్లి సాక్ష్యం యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. అందులో వివరాలు నమోదు చేసి రిజిస్టర్ కావాల్సి ఉంటుంది. ఇందులో తమకు అవసరమైన సేవలన్నీ పొందవచ్చు. కార్యాలయాలు, అధికారుల చుట్టూ తిరగాల్సిన పని ఉండదు. ఓటరు జాబితా ఆధారంగా దివ్యాంగుల వివరాలను ఇప్పటికే అధికారులు సేకరించారు. ఇంటి నుంచే ఓటేసే సదుపాయాన్ని ఎన్నికల సంఘం కల్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అర్హుల వివరాలను బూత్స్థాయి అధికారులు ఫారం 12-డి పత్రాల్లో నమోదు చేస్తున్నారు. రిటర్నింగ్ అధికారులకు అందజేయనున్నారు.
వసతుల కల్పనకు..
ఎంతో మంది దివ్యాంగులు పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేస్తుంటారు. సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్, వికారాబాద్ జిల్లాల్లో ఇప్పటికే పోలింగ్ కేంద్రాల గుర్తింపు ప్రక్రియ పూర్తయింది. ఈ క్రమంలో దివ్యాంగులు కేంద్రంలోకి వెళ్లేందుకు ఇబ్బందులు తలెత్తకూడదన్న ఉద్దేశంతో పలు రకాల వసతులు కల్పిస్తున్నారు. గత శాసనసభ ఎన్నికల్లో ఏర్పాటుచేసిన ర్యాంపులను వినియోగించుకుంటున్నారు. లేనిచోట్ల నిర్మాణాలు చేపట్టారు. ప్రత్యేకంగా నియమించిన నోడల్ అధికారులు ఆయా కేంద్రాల్లో దివ్యాంగులకు వసతుల తీరుపై ఆరా తీస్తున్నారు. ఎప్పటికప్పుడు ఉన్నతాధికారుల నివేదిస్తున్నారు.
వీల్ఛైర్ కోసం..
దివ్యాంగులు పోలింగ్ కేంద్రం వద్ద మూడు చక్రాల సైకిలు అవసరమని సాక్ష్యం యాప్ ద్వారా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు. వారు కేంద్రానికి వెళ్లేసరికి వీల్ఛైర్ సిద్ధంగా ఉండేలా కార్యాచరణ రూపొందించారు. దీనికితోడు ఇంటి నుంచి ఓటేసేందుకు సైతం ఈ యాప్ నుంచి వివరాలు నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. వీరికోసం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున ప్రత్యేక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటుచేస్తున్నారు.
పక్కాగా నిఘా
న్యూస్టుడే, నర్సాపూర్: లోక్సభ ఎన్నికల నేపథ్యంలో అన్ని జిల్లాల్లో పలుచోట్ల చెక్పోస్టులు ఏర్పాటుచేశారు. పోలీసులు ప్రతి వాహనాన్ని క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. అక్రమంగా నగదు తరలిస్తున్నారా, మద్యం తీసుకెళ్తున్నారా నిఘా వేసి ఉంచారు. ఆయా చెక్పోస్టుల వద్ద కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు సీసీ కెమెరాలను బిగించారు. వాటిని ఎన్నికల రిటర్నింగ్ అధికారి (కలెక్టర్) కార్యాలయానికి అనుసంధానం చేశారు. అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన బృందం నిరంతరం స్క్రీన్పై తనిఖీ దృశ్యాలను వీక్షిస్తుండటం గమనార్హం.
నామపత్రాల్లో ఏముంటాయంటే..
లోక్సభ ఎన్నికల ప్రకటన గురువారం వెలువడింది. మెదక్లో మెదక్, సంగారెడ్డిలో జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి నామినేషన్లు స్వీకరిస్తున్నారు. నామినేషన్లో భాగంగా అభ్యర్థులు పలు రకాల పత్రాలు రిటర్నింగ్ అధికారులకు సమర్పిస్తుంటారు. ఫాం-2ఏ ద్వారా నామినేషన్ దాఖలు చేస్తారు. ఆయా పత్రాలను కేంద్ర ఎన్నికల సంఘం ఉచితంగా అందిస్తుంది. సంబంధిత రిటర్నింగ్ అధికారి కార్యాలయాలు, అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లోని సహాయ రిటర్నింగ్ అధికారి లేదంటే తహసీల్ కార్యాలయాల్లో ఇవి లభిస్తాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో ఉంటుంది. వివరాలు పూరించడంలో సందేహాల నివృత్తికి సహాయక డెస్కులను సంప్రదించవచ్చు.
పార్టీ తరఫున: ఏదైనా రాజకీయ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థి ఫాం-ఏతో పాటు ఫాం-బీ అందించాల్సి ఉంటుంది. పార్టీ అధ్యక్షుడి సంతకంతో కూడిన ఆయా ఫాంలను అధికారులకు సమర్పించాలి. అప్పుడే సదరు పార్టీ అభ్యర్థిగా పరిగణిస్తారు.
- రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల అందరి వివరాలను ఫాం-ఏ ద్వారా తెలియజేస్తాయి. వీటిపై అధ్యక్షుడు లేదా ప్రధాన కార్యదర్శి సంతకంతో పాటు ముద్ర ఉంటుంది. ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారో ఇందులో పొందుపరుస్తారు.
- తమ పార్టీ తరఫున పోటీ చేస్తున్నది వీరే అని పార్టీ ప్రతినిది ఇచ్చేదే బీ-ఫాం. నామినేషన్ సమయంలో అందించాలి. నామినేషన్ల చివరి రోజు మధ్యాహ్నం 3 గంటల్లోపు దీన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. దీని ద్వారానే పార్టీ గుర్తును కేటాయిస్తారు.
సమగ్ర వివరాలు..: నామినేషన్ దాఖలుతో పాటు ఫాం-35 (అఫిడవిట్) సైతం అభ్యర్థులు విధిగా సమర్పించాలి. తమతో పాటు కుటుంబ సభ్యుల ఆస్తులు, అప్పులు, క్రిమినల్ కేసులు, న్యాయస్థానాల్లో విచారణలో ఉన్న కేసుల వివరాలు తప్పనిసరిగా పొందుపరచాల్చిందే.
న్యూస్టుడే, గజ్వేల్ గ్రామీణ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తొలి ఓటు వేశారోచ్
[ 03-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో తొలి సారిగా చేపట్టిన ఇంటి నుంచి ఓటు ప్రక్రియ సాఫీగా కొనసాగింది. -
రెండు కళ్లూ చాలవులే..
[ 03-05-2024]
కల్యాణ వేదికపై ఆసీనులైన శ్రీరామచంద్రమూర్తిని సీతమ్మవారు ఓరకంట చూసి చిరుమందహాసం చేస్తోంది.. పక్కనే మరో వేదికపై వరుడి అలంకరణలో ఉన్న పరమేశ్వరుడిని చూసిన పార్వతిదేవి సిగ్గులొలికిస్తోంది. -
విద్వేషాలు రెచ్చగొడుతున్న భాజపా
[ 03-05-2024]
ప్రజా సంక్షేమాన్ని విస్మరించి విద్వేషాలను రెచ్చగొడుతూ అప్రజాస్వామిక రాజకీయాలు సాగిస్తున్న భాజపాను ఓడించాలని విశ్రాంత ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి పిలుపునిచ్చారు. -
లక్ష్యం.. సాకారం చేసుకొని..
[ 03-05-2024]
సినిమా అనేది ఓ రంగుల ప్రపంచం. ఎంతోమంది ఈ కలల ప్రపంచంలోకి అడుగుపెట్టాలని కలలు కంటుంటారు. -
కాంగ్రెస్ సర్కారుతోనే సంక్షేమం: మంత్రి పొన్న
[ 03-05-2024]
కాంగ్రెస్ ప్రభుత్వంతోనే ప్రజల సంక్షేమం, అభివృద్ధి జరుగుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (03/05/24)
-
ఫొటోషూట్లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
-
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
-
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
-
డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి
-
అభిమాని బర్త్డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్