logo

హామీలన్నీ నెరవేరుస్తాం: మంత్రి సురేఖ

కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుందని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. శనివారం స్థానిక పీఎస్‌ఆర్‌ గార్డెన్‌లో మెదక్‌ పార్లమెంట్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా సీపీఎం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విస్తృత స్థాయి సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు.

Published : 05 May 2024 01:14 IST

ప్రసంగిస్తున్న సురేఖ, పక్కన మెదక్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి నీలం మధు, చుక్క రాములు

సంగారెడ్డి టౌన్‌, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుందని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. శనివారం స్థానిక పీఎస్‌ఆర్‌ గార్డెన్‌లో మెదక్‌ పార్లమెంట్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా సీపీఎం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విస్తృత స్థాయి సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో భారాస నాయకులు రాష్ట్రాన్ని దోచుకున్నారని, ప్రజా సంక్షేమాన్ని విస్మరించారని ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజల అవసరాలు తీర్చేందుకే ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ఆరు గ్యారంటీల్లో భాగంగా ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌, ఉచిత గృహ విద్యుత్తు పథకాలు అమలు చేస్తున్నామన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి నీలం మధును గెలిపించాలని కోరారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు చుక్క రాములు మాట్లాడుతూ మోదీ విధానాలతో అంబానీ, ఆదానీల ఆదాయం భారీగా పెరిగిందని, పేదలకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. మెదక్‌ అభ్యర్థి నీలం మధు, మాజీ ఎమ్మెల్సీ ఆర్‌.సత్యనారాయణ, కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షురాలు నిర్మలారెడ్డి, నాయకుల రాజు, జయరాజు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని