logo

రెండో పెళ్లి వ్యామోహంతో భార్య హత్య

తన కుమార్తెను హత్య చేసి కాగ్నా నదిలో పడేశారని అనుమానం వ్యక్తం చేస్తూ, హతురాలి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేసి శనివారం హత్యోందంతాన్ని ఛేదించారు.

Published : 05 May 2024 01:23 IST

బాధితురాలి తండ్రి ఫిర్యాదుతో కేసు ఛేదించిన పోలీసులు

వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ బాలకృష్ణారెడ్డి

తాండూరు గ్రామీణ: తన కుమార్తెను హత్య చేసి కాగ్నా నదిలో పడేశారని అనుమానం వ్యక్తం చేస్తూ, హతురాలి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేసి శనివారం హత్యోందంతాన్ని ఛేదించారు. తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి తెలిపిన వివరాలు.. వికారాబాద్‌ జిల్లా తాండూరు మండలం చంద్రవంచకు చెందిన బోయిని లక్ష్మప్పకు కర్ణాటక కలుబుర్గి జిల్లా జెట్టూరుకు చెందిన అనితను ఇచ్చి 14 ఏళ్ల కిందట వివాహం చేశారు. సంతానం కలగకపోవడంతో, లక్ష్మప్ప రెండో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. భార్యకు విషయం చెప్పడంతో సహకరించలేదు. ఈ అంశమై చాలా సార్లు గొడవపడ్డారు. చివరకు ఎలాగైనా ఆమెను వదిలించుకోవాలని భావించి,  ఏప్రిల్‌ 25న భార్యతో కలిసి గ్రామ శివారులోని కాగ్నా నది వద్దకు వెళ్లి మద్యం తాగారు. అనిత అపస్మారకస్థితిలోకి వెళ్లగా కత్తితో గొంతుకోసి హతమార్చి, మృతదేహాన్ని నదిలో పడేసి వెళ్లిపోయాడు. అదే నెల 30న స్థానికులు నదిలో గుర్తుతెలియని మృతదేహం ఉందని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై విఠల్‌రెడ్డి బృందం మృతదేహాన్ని వెలికితీసి తాండూరు ఆస్పత్రికి తరలించారు. మే1న అనిత తండ్రి నాయికోటి తుల్జప్ప పోలీసులను ఆశ్రయించి తన కూతురిని అల్లుడే చంపేశాడని ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు చేపట్టారు. పరారైన లక్ష్మప్పను శనివారం అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించడంతో రిమాండ్‌కు తరలించారు. తాండూరుగ్రామీణ సీఐ అశోక్‌, ఎస్సై విఠల్‌రెడ్డి, ఏఎస్‌ఐలు పవన్‌, దస్తప్ప ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు