ఎన్నికలకు సమాయత్తం
బరిలో నిలిచే అభ్యర్థులు తేలిపోవడంతో ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఇప్పటికే ఈవీఎంలు ఆయా జిల్లాలకు చేరుకోగా, అభ్యర్థులు భారీ సంఖ్యలో పోటీ చేస్తుండటంతో అదనంగా మరిన్ని ఈవీఎంలను తెప్పించారు.
ఈవీఎంల రెండో విడత ర్యాండమైజేషన్ పూర్తి
సెగ్మెంట్ల వారీగా కేటాయింపు
మెదక్లో ఈవీఎం ఎఫ్ఎల్సీని పరిశీలిస్తున్న రిటర్నింగ్ అధికారి రాహుల్రాజ్
న్యూస్టుడే-మెదక్: బరిలో నిలిచే అభ్యర్థులు తేలిపోవడంతో ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఇప్పటికే ఈవీఎంలు ఆయా జిల్లాలకు చేరుకోగా, అభ్యర్థులు భారీ సంఖ్యలో పోటీ చేస్తుండటంతో అదనంగా మరిన్ని ఈవీఎంలను తెప్పించారు. వాటికి రెండో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తి చేసి సెగ్మెంట్ల వారీగా కేటాయించారు. మరోవైపు ఎన్నికల సిబ్బందికి శిక్షణ నిర్వహిస్తున్నారు. ఈ అంశంపై ‘న్యూస్టుడే’ కథనం...
అభ్యర్థులు పెరగడంతో..
మెదక్ లోక్సభ నియోజకవర్గ స్థానం నుంచి 44 మంది అభ్యర్థులు పోటీచేస్తున్నారు. ఇది వరకు అధికారులు కొన్ని ఈవీఎంలను తెప్పించారు. వాటికి సంబంధించి మొదటి విడత పరిశీలన, ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. బరిలో ఉన్న అభ్యర్థుల సంఖ్య పెరగడంతో అదనంగా మరిన్ని ఈవీఎంలను తెప్పించారు. ఈ ఎన్నికల్లో ఒక్కో పోలింగ్ కేంద్రానికి మూడు బ్యాలెట్, ఒక కంట్రోల్ యూనిట్, ఒక వీవీప్యాట్ అవసరం. పోలింగ్ రోజున ఎటువంటి సాంకేతిక సమస్య తలెత్తకుండా 25 శాతం బ్యాలెట్ యూనిట్లు, 25 శాతం కంట్రోల్ యూనిట్లు, 40 శాతం వీవీప్యాట్లను అందుబాటులో ఉంచారు.
సిబ్బందికి శిక్షణ...:
ఆయా సెగ్మెంట్లలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి రెండో విడత శిక్షణ నిర్వహిస్తున్నారు. మొదటి విడత కొద్దిరోజుల కిందట పూర్తికాగా, ప్రస్తుతం శిక్షణ కొనసాగుతున్న సెగ్మెంట్ పరిధిలో సిబ్బందికి డ్యూటీ వేయనున్నారు. అధిక సంఖ్యలో అభ్యర్థులు బరిలో ఉండడంతో వారికి బ్యాలెట్ యూనిట్పై అవగాహన కల్పిస్తున్నారు. పీవో, ఏపీవోలకు శిక్షణ కొనసాగగా, త్వరలో ఇతర పోలింగ్ సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నారు.
సాంకేతిక నిపుణుల ఆధ్వర్యంలో..
ఈనెల 13న జరిగే పోలింగ్ నేపథ్యంలో నాలుగు నెలల ముందు నుంచే ఎన్నికల సంఘం ఈవీఎంల ఎంపిక ప్రక్రియ చేపట్టింది. ఇందులో భాగంగా మొదటి ఎఫ్ఎల్సీ(ఫస్ట్ లెవల్ చెకింగ్) ప్రక్రియను పూర్తి చేశారు. ఇందులో ఈవీఎంల తయారీ సంస్థల ఇంజినీర్లు, నిపుణులు, రాజకీయ పార్టీల నాయకులు, జిల్లా ఎన్నికల అధికారి పాల్గొన్నారు. జిల్లాలకు కేటాయించిన ఈవీఎంలు సరిగా పని చేస్తున్నాయా? లేదా? అనేది పరిశీలించారు. సరిగా పనిచేస్తున్న వాటిని మొదటి విడత ర్యాండమైజేషన్ పూర్తి చేసి ఆయా జిల్లాలోని నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంలకు తరలించారు. మొదటి విడత ర్యాండమైజేషన్ ఆయా జిల్లాల ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో జరగగా, రెండో విడత ర్యాండమైజేషన్ శుక్రవారం ఎన్నికల రిటర్నింగ్ అధికారి, మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్, ఎన్నికల పర్యవేక్షకులు, రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో నిర్వహించారు. ఈ మేరకు ఆయా సెగ్మెంట్లలో పోలింగ్ కేంద్రాల వారీగా ఈవీఎంల జాబితాను సంబంధింత ఏఆర్వోలకు పంపారు. ప్రస్తుతం ఆయా సెగ్మెంట్లలోని స్ట్రాంగ్రూంలలో భద్రపర్చిన ఈవీఎంల కమిషనింగ్ కొనసాగుతోంది. బరిలో 44 మంది అభ్యర్థులు ఉండడంతో ఇటీవల బ్యాలెట్ పేపర్ను ముద్రించారు. ఈ పేపర్ను బ్యాలెట్ యూనిట్లలో పొందుపరుస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇక స్థానిక సమరం
[ 18-05-2024]
మరో ఎన్నికల సందడి రానుంది. పార్లమెంట్ ఎన్నికలు పూర్తికావడంతో పరిపాలనపై దృష్టి సారించనున్న రాష్ట్ర ప్రభుత్వం.. స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు మొగ్గుచూపుతోంది. -
కొనుగోళ్లలో జాప్యంపై కర్షకుల కన్నెర్ర
[ 18-05-2024]
ధాన్యం కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ మండల పరిధిలోని మిన్పూర్ గ్రామ రైతులు శుక్రవారం మెదక్-బోడ్మట్పల్లి రహదారిపై ఆందోళనకు దిగారు. -
సొంతింటి కల..నెరవేరేనా?
[ 18-05-2024]
నియోజకవర్గ, డివిజన్ కేంద్రంలో నిర్మించిన కొన్ని ఇళ్ల పనులు కొసరు పనులతో నిలిచిపోగా, మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయి. -
భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని అనర్హుడిగా ప్రకటించండి
[ 18-05-2024]
మెదక్ లోక్సభ నియోజకవర్గం భారాస అభ్యర్థి పి.వెంకట్రామిరెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలని భాజపా మెదక్ అభ్యర్థి ఎం.రఘునందన్రావు శుక్రవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్రాజ్కు ఫిర్యాదు చేశారు. -
ఉపాధి కూలీలకు ఊరట
[ 18-05-2024]
ఈ ఏడాది వేసవిలో ఎండలు మండిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. -
ఒక్క రూపాయైనా జమ కాలేదు
[ 18-05-2024]
జిల్లావ్యాప్తంగా యాసంగిలో రైతులు ఉత్సాహంగా జొన్న పంట సాగు చేశారు. దిగుబడులు చేతికొస్తున్నాయి. -
శిథిల భవనాలు.. కానరాని చర్యలు
[ 18-05-2024]
ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయలోపం జనం ప్రాణాలను బలిగొంటోంది. -
పల్లెల్లో మొదలైన సందడి
[ 18-05-2024]
లోక్సభ ఎన్నికలు ముగిశాయి. ఇక గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారా..? అనే ప్రశ్నకు అవుననే సంకేతాలు వస్తున్నాయి. -
గుర్తించని జోన్లు.. ట్రాఫిక్ ఇక్కట్లు
[ 18-05-2024]
పట్టణాల్లో వ్యాపార జోన్లు అటకెక్కాయి. వ్యాపారాలు రహదారుల వెంట కాకుండా.. పురపాలక సంఘాలు ఏర్పాటు చేసిన జోన్లలో నిర్వహించుకునేలా ప్రణాళికలు రూపొంచడంలో యంత్రాంగం విఫలమయిందనే విమర్శలొస్తున్నాయి. -
కౌంటింగ్ కేంద్రాల్లో మూడంచెల భద్రత
[ 18-05-2024]
కౌంటింగ్ కేంద్రాల్లో మూడంచెల భద్రత ఏర్పాటు చేశామని రాష్ట్ర అదనపు ఎన్నికల కమిషనర్ లోకేష్కుమార్ అన్నారు. -
వాన రాకతో ధాన్యం ఆరక..
[ 18-05-2024]
వేసవికాలంలో జిల్లాలో వాతావరణంలో విభిన్న పరిస్థితులు నెలకొన్నాయి. -
నచ్చిన కోర్సు ఎంచుకోండి దోస్త్
[ 18-05-2024]
ఇంటర్ పూర్తిచేసిన విద్యార్థులకు ఎన్నో అవకాశాలు ఉంటాయి. డిగ్రీ కోర్సుల వైపు చూసే వారే ఎక్కువ మందే ఉంటారు. -
నిర్లక్ష్యం.. ప్రాణాంతకం
[ 18-05-2024]
ప్రజాప్రయోజనంతో చేపట్టే అభివృద్ధి పనుల పర్యవేక్షణ లోపించి ప్రాణాంతకంగా మారుతున్నాయి. -
నాన్నను కొట్టి.. పశ్చాత్తాపం చెంది..
[ 18-05-2024]
ఆవేశంలో అకారణంగా నాన్నను కొట్టి.. అనంతరం తండ్రి తప్పేమీ లేదని తెలుసుకున్న కుమారుడు పశ్చాత్తాపంతో ఆవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
తాజా వార్తలు (Latest News)
-
బెంగళూరు-చెన్నై కీలక పోరు.. వాతావరణ పరిస్థితి ఎలా ఉండనుందంటే?
-
నా మనవడు తప్పు చేస్తే..: ప్రజ్వల్ లైంగిక దౌర్జన్యం కేసుపై దేవెగౌడ స్పందన
-
10 ఏళ్లలో 31వేల కి.మీ రైల్వే మార్గం నిర్మాణం: అశ్వినీ వైష్ణవ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
తిరుపతి చేరుకున్న సిట్ బృందం.. విచారణ ప్రారంభం
-
ప్రత్యేక ట్రేడింగ్ సెషన్.. సెన్సెక్స్ 88+, నిఫ్టీ @ 22,500