logo

రిజర్వేషన్లపై అసత్య ప్రచారం: రాజాసింగ్‌

తెలంగాణ రాష్ట్ర ప్రజలు కేసీఆర్‌ పాలనలో ఇబ్బందులు పడ్డారని, రేవంత్‌రెడ్డి పాలనతో అంతకు మించిన కష్టాలు అనుభవిస్తున్నారని గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఆరోపించారు.

Published : 07 May 2024 03:34 IST

మాట్లాడుతున్న రాజాసింగ్‌, పక్కన బీబీ పాటిల్‌

జహీరాబాద్‌, న్యూస్‌టుడే: తెలంగాణ రాష్ట్ర ప్రజలు కేసీఆర్‌ పాలనలో ఇబ్బందులు పడ్డారని, రేవంత్‌రెడ్డి పాలనతో అంతకు మించిన కష్టాలు అనుభవిస్తున్నారని గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఆరోపించారు. సోమవారం రాత్రి జహీరాబాద్‌ పట్టణంలో భాజపా అభ్యర్థి బీబీపాటిల్‌తో కలిసి రోడ్‌షో నిర్వహించారు. శివాజీ విగ్రహం వద్ద కార్నర్‌ మీటింగ్‌లో మాట్లాడారు. రిజర్వేషన్లపై కాంగ్రెస్‌, భారాసలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. ఆరు గ్యారంటీలు అమలు చేయకుండా రేవంత్‌రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. ప్రధాని మోదీతోనే దేశాభివృద్ధి సాధ్యమన్నారు. మోదీని ఓడించేందుకు దేశంలోని దళారులతో పాటు పాకిస్థాన్‌కు చెందిన నేతలు కుట్రలు చేస్తున్నారు. భాజపా విజయాన్ని ఎవరూ ఆపలేరన్నారు. ప్రజలంతా భాజపాకు ఓటు వేసి బీబీపాటిల్‌ను గెలిపించాలని కోరారు. భాజపా జిల్లా అధ్యక్షురాలు గోదావరి, డీసీసీబీ మాజీ ఛైర్మన్‌ ఎం.జైపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

హాజరైన భాజపా శ్రేణులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని