ఉపాధి ప్రశ్నార్థకం.. జీవనం భారం!
రేయింబవళ్లు చెమటోడ్చి.. బీడీలు చుట్టే కార్మికుల కష్టం అంతాఇంతా కాదు. ఆరోగ్యాన్ని లెక్కచేయక.. కుటుంబ పోషణ భారం మోసే మహిళలు అనేకం. కొన్నేళ్లుగా ఈ రంగంపై ఆధారపడిన వారికి ఉపాధి కరవవుతోంది.
బీడీ కార్మికుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి అవశ్యం
న్యూస్టుడే, సిద్దిపేట, చేగుంట, రామాయంపేట
రేయింబవళ్లు చెమటోడ్చి.. బీడీలు చుట్టే కార్మికుల కష్టం అంతాఇంతా కాదు. ఆరోగ్యాన్ని లెక్కచేయక.. కుటుంబ పోషణ భారం మోసే మహిళలు అనేకం. కొన్నేళ్లుగా ఈ రంగంపై ఆధారపడిన వారికి ఉపాధి కరవవుతోంది. దీన్నే జీవనాధారంగా మార్చుకున్న ఎంతో మంది ప్రత్యామ్నాయం లేక ఆపసోపాలు పడుతున్నారు. ఏళ్లుగా ఎన్నో వెతలు అనుభవిస్తున్న కార్మికులు.. బతుకు బండి లాగేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. ఎన్నికల వేళ బరిలో నిలిచిన నేతలు.. తమ కష్టాలు తీర్చి గట్టెక్కిస్తామనే నమ్మకం కలిగించే వారికి జై కొడతామని చెబుతున్నారు సిద్దిపేట, మెదక్ జిల్లాల కార్మికులు. ఎన్నికల సంగ్రామంలో విజేతగా నిలిచే నేత.. వారిపై దృష్టిసారించి ప్రణాళికతో అడుగులు వేయాల్సిన ఆవశ్యకత ఉంది.
ఆకు(తునికి)ను ఓ నమూనాలో కత్తిరించి.. పొడి తంబాకు (పొగాకు) వేసి.. ఓపిగ్గా చుట్టి.. దారం కడితే ఒక బీడీ తయారవుతుంది. ఇలా చెమటోడ్చి శ్రమించే ఎంతో మంది కార్మికులు చేతినిండా పని లేక ఆపసోపాలు పడుతున్నారు. వచ్చే సొమ్ము గిట్టుబాటవక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో ఈ పరిశ్రమ విస్తరించింది. రెండు జిల్లాల్లో అనేక గడపలకు విస్తరించిన ఈ కుటీర పరిశ్రమ.. ఒడిదొడుకులు ఎదుర్కొంటోంది. బీడీ కార్మికులకు పోషణ భారంగా మారింది. పనిదినాలు తగ్గి ప్రత్యామ్నాయం లేక ఉసూరుమంటున్నారు. మరోవైపు సంక్షేమ బోర్డు ద్వారా పథకాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పనిదినాలు కుదించడంతో..
నాలుగేళ్లుగా జీఎస్టీ కారణంగా కంపెనీలకు నిర్వహణ భారం కాగా.. నెలకు 10 నుంచి 15 రోజులు మాత్రమే ఉపాధి కల్పిస్తున్నాయి. పనిదినాలు కుదించడంతో దానిపై ఆధారపడి జీవించే వారు ఇక్కట్లు పడుతున్నారు. మరోవైపు రోజంతా కష్టపడ్డా 500 బీడీలు చుట్టలేని పరిస్థితి కార్మికులకు ఎదురవుతోంది. ప్రత్యామ్నాయం కరవై.. బతుకుబండి లాగడం కష్టమవుతోంది. ఇరు జిల్లాలో 81 వేల మంది కార్మికులు ఉంటారు. మొత్తం ఐదు రకాల కంపెనీలు (ప్రధానమైనవి) విస్తరించాయి. నిత్యం 1.50 కోట్ల మేర బీడీలు ఉత్పత్తి అవుతున్నాయి. దుబ్బాక, సిద్దిపేట, రామాయంపేట, చేగుంటలో అత్యధికంగా కార్మికులు ఉన్నారు. వేయి బీడీలకు రూ.245.8 కూలీగా నిర్వాహకులు చెల్లిస్తున్నారు. మరోవైపు సంక్షేమ మండలికి సొమ్ము చేరక కొన్ని పథకాల అమలులో జాప్యం ఏర్పడుతోందని కార్మికులు వాపోతున్నారు. జీఎస్టీ చెల్లించని కొన్ని కంపెనీలు.. కార్మికులకు భవిష్యనిధి, ఈఎస్ఐ, కనీస వేతనం అమలు చేయడం లేదు.
సమస్యలు పరిష్కరిస్తే మేలు..
- గతంలో పదేళ్లు పని చేస్తే 50 ఏళ్లు నిండిన తర్వాత పింఛను అమలయ్యేది. ప్రస్తుతం 3,365 రోజులు పని చేస్తే పింఛను దక్కేలా సంబంధిత జీవో సవరణ చేశారు. పాత పద్ధతితోనే మేలు.
- బీడీ రంగంపై వస్తు సేవల పన్ను (జీఎస్టీ) గుదిబండగా మారింది. తక్షణమే మినహాయింపు ఇవ్వాలి.
- కార్మికులకు పింఛను రూ.వేయి వరకు వస్తోంది. ప్రతి నెలా రూ.5 వేల పింఛను అమలు చేయాలనే డిమాండ్ ఉంది.
- కొత్తగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం రూ.2016 నుంచి రూ.4 వేలకు జీవనభృతిని పెంచుతామనే హామీని నెరవేర్చాలి.
- ఈఎస్ఐ వర్తింపజేయాలి. మెరుగైన వైద్యానికి జిల్లా కేంద్రాల్లో వంద పడకల ఆసుపత్రి నిర్మించాలి. కుటుంబానికి ప్రత్యేక ఆరోగ్య బీమా కల్పించాలి.
- కంపెనీలు నాసిరకం ముడిసరకు సరఫరా చేస్తోంది. నాణ్యంగా అందించాలి.
- నెలలో కనీసం 24 రోజులు పనిదినాలు కల్పించాలి.
- వేయి బీడీలకు కూలీగా రూ.500 పెంచాలి. నెలకు దాదాపు రూ.10 వేలు గిట్టుబాటు కావాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బంగారు ఆభరణాలు చోరీ
[ 18-05-2024]
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఆర్టీసీ బస్టాండ్లో బంగారం చోరీకి గురైంది. బస్సు ఎక్కుతున్న మహిళ బ్యాగు లోంచి 8 తులాల బంగారు ఆభరణాలను దుండగులు చోరీ చేశారు. -
ఇక స్థానిక సమరం
[ 18-05-2024]
మరో ఎన్నికల సందడి రానుంది. పార్లమెంట్ ఎన్నికలు పూర్తికావడంతో పరిపాలనపై దృష్టి సారించనున్న రాష్ట్ర ప్రభుత్వం.. స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు మొగ్గుచూపుతోంది. -
కొనుగోళ్లలో జాప్యంపై కర్షకుల కన్నెర్ర
[ 18-05-2024]
ధాన్యం కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ మండల పరిధిలోని మిన్పూర్ గ్రామ రైతులు శుక్రవారం మెదక్-బోడ్మట్పల్లి రహదారిపై ఆందోళనకు దిగారు. -
సొంతింటి కల..నెరవేరేనా?
[ 18-05-2024]
నియోజకవర్గ, డివిజన్ కేంద్రంలో నిర్మించిన కొన్ని ఇళ్ల పనులు కొసరు పనులతో నిలిచిపోగా, మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయి. -
భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని అనర్హుడిగా ప్రకటించండి
[ 18-05-2024]
మెదక్ లోక్సభ నియోజకవర్గం భారాస అభ్యర్థి పి.వెంకట్రామిరెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలని భాజపా మెదక్ అభ్యర్థి ఎం.రఘునందన్రావు శుక్రవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్రాజ్కు ఫిర్యాదు చేశారు. -
ఉపాధి కూలీలకు ఊరట
[ 18-05-2024]
ఈ ఏడాది వేసవిలో ఎండలు మండిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. -
ఒక్క రూపాయైనా జమ కాలేదు
[ 18-05-2024]
జిల్లావ్యాప్తంగా యాసంగిలో రైతులు ఉత్సాహంగా జొన్న పంట సాగు చేశారు. దిగుబడులు చేతికొస్తున్నాయి. -
శిథిల భవనాలు.. కానరాని చర్యలు
[ 18-05-2024]
ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయలోపం జనం ప్రాణాలను బలిగొంటోంది. -
పల్లెల్లో మొదలైన సందడి
[ 18-05-2024]
లోక్సభ ఎన్నికలు ముగిశాయి. ఇక గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారా..? అనే ప్రశ్నకు అవుననే సంకేతాలు వస్తున్నాయి. -
గుర్తించని జోన్లు.. ట్రాఫిక్ ఇక్కట్లు
[ 18-05-2024]
పట్టణాల్లో వ్యాపార జోన్లు అటకెక్కాయి. వ్యాపారాలు రహదారుల వెంట కాకుండా.. పురపాలక సంఘాలు ఏర్పాటు చేసిన జోన్లలో నిర్వహించుకునేలా ప్రణాళికలు రూపొంచడంలో యంత్రాంగం విఫలమయిందనే విమర్శలొస్తున్నాయి. -
కౌంటింగ్ కేంద్రాల్లో మూడంచెల భద్రత
[ 18-05-2024]
కౌంటింగ్ కేంద్రాల్లో మూడంచెల భద్రత ఏర్పాటు చేశామని రాష్ట్ర అదనపు ఎన్నికల కమిషనర్ లోకేష్కుమార్ అన్నారు. -
వాన రాకతో ధాన్యం ఆరక..
[ 18-05-2024]
వేసవికాలంలో జిల్లాలో వాతావరణంలో విభిన్న పరిస్థితులు నెలకొన్నాయి. -
నచ్చిన కోర్సు ఎంచుకోండి దోస్త్
[ 18-05-2024]
ఇంటర్ పూర్తిచేసిన విద్యార్థులకు ఎన్నో అవకాశాలు ఉంటాయి. డిగ్రీ కోర్సుల వైపు చూసే వారే ఎక్కువ మందే ఉంటారు. -
నిర్లక్ష్యం.. ప్రాణాంతకం
[ 18-05-2024]
ప్రజాప్రయోజనంతో చేపట్టే అభివృద్ధి పనుల పర్యవేక్షణ లోపించి ప్రాణాంతకంగా మారుతున్నాయి. -
నాన్నను కొట్టి.. పశ్చాత్తాపం చెంది..
[ 18-05-2024]
ఆవేశంలో అకారణంగా నాన్నను కొట్టి.. అనంతరం తండ్రి తప్పేమీ లేదని తెలుసుకున్న కుమారుడు పశ్చాత్తాపంతో ఆవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
తాజా వార్తలు (Latest News)
-
భారత బలగాలకు ద్రోహం చేసిన చరిత్ర కాంగ్రెస్ది: ప్రధాని మోదీ
-
మీ కార్యాలయానికే వస్తాం.. ధైర్యముంటే అరెస్టు చేసుకోండి: కేజ్రీవాల్ సవాల్
-
కాకతీయ వర్సిటీ వీసీ రమేశ్పై విజిలెన్స్ విచారణకు ఆదేశం
-
ఎన్నికల తనిఖీల్లో.. రూ.8,889 కోట్ల సొత్తు స్వాధీనం: ఈసీ
-
పెట్స్పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!
-
దీదీతో పొత్తుపై హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలి.. అధీర్ కాదు: ఖర్గే