పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తాం
సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన మాట మేరకు ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని మెదక్ కాంగ్రెస్ పార్లమెంటు అభ్యర్థి నీలం మధు అన్నారు
మనోహరాబాద్, న్యూస్టుడే: సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన మాట మేరకు ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని మెదక్ కాంగ్రెస్ పార్లమెంటు అభ్యర్థి నీలం మధు అన్నారు. మండలంలోని రంగాయపల్లి, చెట్లగౌరారం, దండుపల్లి మీదుగా కాళ్లకల్ వరకు భారీ ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. కాళ్లకల్లో కార్నర్ మీటింగ్లో మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డితో కలిసి నీలం మధు మాట్లాడారు. ఇందిరాగాంధీ పోటీ చేసిన స్థానం నుంచి బరిలో నిలవడం గర్వంగా ఉందన్నారు. అంతకుముందు రంగాయపల్లి వద్ద మండల పార్టీ అధ్యక్షుడు మల్లారెడ్డి, కాంగ్రెస్ నాయకులు మహిపాల్రెడ్డి, శ్రీనివాసగౌడ్ ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు. పటాన్చెరుకు చెందిన ఓ అభిమాని స్కేటింగ్ చేస్తూ ప్రచారంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో నేతలు బాలకృష్ణారెడ్డి, విఠల్రెడ్డి, సుధాకర్రెడ్డి, ఎలక్షన్రెడ్డి, భూంరెడ్డి, ఆంక్షారెడ్డి, నాగరాజుగౌడ్, భానుయాదవ్ పాల్గొన్నారు.
డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి, నీలం మధు ఆధ్వర్యంలో ముప్పిరెడ్డిపల్లి భారాస సీనియర్ నాయకుడు పెంటయ్య, బిక్షపతి, చంద్రయ్యతోపాటు పలువురు పార్టీలో చేరగా కండువా కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో నాయకులు రమేశ్చారి, మహిపాల్రెడ్డి, రాంరెడ్డి, సత్యనారాయణ పాల్గొన్నారు.
‘రూ.2 లక్షల రుణమాఫీ తథ్యం’
బ్బాక: భారాస హయాంలో పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయలేదని.. ప్రస్తుతం సీఎం రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో ఆగస్టు 15 లోపు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రూ.2 లక్షల మాఫీని ఒకే విడతలో అమలు చేసి తీరుతామని తెలంగాణ పీసీసీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్కు మద్ధతుగా దుబ్బాక పట్టణంలోని బస్టాండ్ వద్ద నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ కార్నర్ మీటింగ్లో ఆయన పాల్గొని మాట్లాడారు. అంతకు ముందు హబ్షీపూర్ చౌరస్తా నుంచి దుబ్బాక పట్టణంలోని పుర వీధుల గుండా కాంగ్రెస్ శ్రేణులు నిర్వహించిన ద్విచక్రవాహన ర్యాలీలో పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వానాకాలం సాగుకు సన్నద్ధం
[ 19-05-2024]
ఓ వైపు ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ కొనసాగుతుండగా... మరోవైపు అన్నదాతలు సాగుకు సన్నద్ధమవుతున్నారు. -
ఆగుతూ.. సాగుతూ..ఇబ్బంది పెడుతూ..
[ 19-05-2024]
అభివృద్ధికి మారుపేరుగా నిలిచే జాతీయ రహదారి పనులు నత్తనడకన సాగుతున్నాయి. ప్రజలను ఇబ్బందికి గురిచేస్తున్నాయి. మెదక్-ఎల్కతుర్తి 134 కి.మీ.ల 765డీజీ జాతీయ రహదారిని రూ.1,461 కోట్ల నిధులతో చేపట్టారు. -
చెరువు మట్టి.. పొలానికి పుష్టి
[ 19-05-2024]
రసాయన ఎరువుల వినియోగం రోజురోజుకు పెరుగడంతో భూసారం తగ్గడమే కాకుండా చీడపీడల ఉద్ధృతితో పాటు పంట దిగుబడుల్లో తేడా ఏర్పడుతోంది. -
లెక్కలు తేలుస్తారు
[ 19-05-2024]
సంఘాలు.. సంస్థలు.. కార్యాలయాలు ఎక్కడైనా లెక్కలే కీలకం. వీటిలో తేడా వస్తే నమ్మకానికి తావుండదు. అందుకే ఇవి పక్కాగా ఉండాలి. -
సీఎం ముఖచిత్రంతో..రాత పుస్తకాలు
[ 19-05-2024]
సర్కారు బడుల బలోపేతమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే మధ్యాహ్న భోజనం, ఉచితంగా రెండు జతల ఏకరూప దుస్తులు, -
తొలకరికే తొందరొద్దు
[ 19-05-2024]
తొలకరి వర్షాలకే రైతులు తొందరపడి ఎలాంటి విత్తనాలు విత్తొద్దు.. భూమిలో 60 శాతానికి పైగా తేమ ఉన్నప్పుడే విత్తాలి.. ఖరీఫ్ సీజన్కు అవసరమయ్యే ఎరువులు, విత్తనాలు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచాం -
4 రోజులు.. రూ.4.29 కోట్లు
[ 19-05-2024]
సార్వత్రిక ఎన్నికలు.. వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో అత్యధికులు స్వస్థలాలకు రాకపోకలు సాగించారు. -
సైబర్ నేరస్థులకు ‘మ్యూల్’ ఖాతాలు
[ 19-05-2024]
సైబర్ నేరస్థుల కోసం ‘మ్యూల్’ బ్యాంకు ఖాతాలు తెరుస్తున్న ముఠా గుట్టును తూర్పు మండలం టాస్క్ఫోర్స్, సైబర్ పోలీసులు, తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరోలు రట్టు చేశాయి. అయిదుగురు నిందితులను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. -
వెంకట్రామిరెడ్డిపై చర్యలు తీసుకోండి
[ 19-05-2024]
భారాస ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని భాజపా నేత రఘునందన్రావు రాష్ట్ర డీజీపీని కలిసి శనివారం ఫిర్యాదు చేశారు. -
అటు.. ఇటు ఓటేశారు!
[ 19-05-2024]
ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కే వజ్రాయుధం. దేశాన్ని పాలించేందుకు సమర్థ నేతలను ఎన్నుకునేందుకు రాజ్యాంగం కల్పించిన హక్కు ఇది. -
పఠనాసక్తికి బాసట
[ 19-05-2024]
విద్యార్థులు సెలవులు రాగానే చరవాణులకు, టీవీలకు అతుక్కుపోతుంటారు. కేవలం పాఠశాలలు కొనసాగుతున్నప్పుడే చదువుపై దృష్టిపెడుతున్నారు. -
హామీలు అమలు చేయకుంటే రోడ్డెక్కుతాం: భారాస
[ 19-05-2024]
ఎన్నికలకు ముందు రైతులకిచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని, లేదంటే రోడ్డెక్కుతామని మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి హెచ్చరించారు. -
అన్నదాతల ఆందోళన
[ 19-05-2024]
పట్టణంలోని ఏఎంసీ ఆవరణలో నిర్వహిస్తున్న పీఏసీఎస్ కొనుగోలు కేంద్రానికి ధాన్యం తరలించిన రైతులు లారీల సమస్య కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు
తాజా వార్తలు (Latest News)
-
‘బ్లూ ఆరిజిన్’ ప్రయోగం విజయవంతం.. అంతరిక్షయానం చేసిన తొలి తెలుగు వ్యక్తి
-
‘భారతీయుడు 2’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ లుక్తో అజిత్
-
పీర్జాదిగూడ మేయర్, కార్పొరేటర్ల కిడ్నాప్నకు కాంగ్రెస్ యత్నం: హరీశ్రావు
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
బహిరంగ సభ మధ్యలోనే వెనుదిరిగిన రాహుల్.. కారణమిదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM