ఇండియా కూటమిలో ప్రధాని అభ్యర్థి ఎవరు?
ఇండియా కూటమిలోని పార్టీలు అవినీతిలో కూరుకుపోయి ఉన్నాయని భాజపా తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై ఆరోపించారు. మంగళవారం జిల్లా కేంద్రం సంగారెడ్డిలో ఆ పార్టీ మెదక్ లోక్సభ అభ్యర్థి రఘునందన్రావుకు మద్దతుగా నిర్వహించిన రోడ్షో, కొత్త బస్టాండ్ వద్ద జరిగిన కార్నర్ మీటింగ్లో ఆయన ప్రసంగించారు.
భాజపా తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై
రోడ్షోలో ప్రసంగిస్తున్న అన్నామలై, పక్కన రఘునందన్రావు, గోదావరి, నాయకులు
సంగారెడ్డి అర్బన్: ఇండియా కూటమిలోని పార్టీలు అవినీతిలో కూరుకుపోయి ఉన్నాయని భాజపా తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై ఆరోపించారు. మంగళవారం జిల్లా కేంద్రం సంగారెడ్డిలో ఆ పార్టీ మెదక్ లోక్సభ అభ్యర్థి రఘునందన్రావుకు మద్దతుగా నిర్వహించిన రోడ్షో, కొత్త బస్టాండ్ వద్ద జరిగిన కార్నర్ మీటింగ్లో ఆయన ప్రసంగించారు. కూటమిలో ప్రధాని అభ్యర్థిని ఇంతవరకు ప్రకటించలేదని, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తారన్న గ్యారంటీ కూడా లేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రామ మందిరం తొలగిస్తారా? త్రిపుల్ తలాక్తోపాటు ఆర్టికల్ 370ని రద్దు చేస్తారా అన్ని ప్రశ్నిస్తూ, వాటిపై సమాధానం చెప్పాలని అన్నామలై డిమాండ్ చేశారు. భాజపా అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందని, కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని, రాజ్యాంగాన్ని మార్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రాజ్యాంగానికి అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లకు తమ పార్టీ కట్టుబడి ఉందన్నారు. మాజీ ప్రధాని వాజ్పేయీ హయాంలో మైనార్టీకి చెందిన అబ్దుల్ కలాంను, ఆ తర్వాత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ హయాంలో ఎస్సీ వర్గానికి చెందిన రామ్నాథ్ కోవింద్ను, గిరిజన మహిళ ద్రౌపది ముర్మును రాష్ట్రపతి చేసిన ఘనత భాజపాకే దక్కిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో ఒకటి మాత్రమే అమలవుతోందని, మిగిలిన వాటిని అమలు చేయలేేదని అన్నామలై విమర్శించారు. మహిళలకు ఇస్తామన్నా రూ.2,500, గ్యాస్ సిలిండర్ రూ.500, రైతు కూలీలకు రూ.12 వేలు, రైతు భరోసా ఎకరానికి రూ.15వేలు, పింఛన్ దారులకు రూ.4 వేలు ఇవ్వకుండా మోసం చేస్తోందని దుయ్యబట్టారు. మెదక్ లోక్సభ అభ్యర్థి రఘునందన్రావు, జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, భాజపా మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజేశ్వర్రావు దేశ్పాండే పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వానాకాలం సాగుకు సన్నద్ధం
[ 19-05-2024]
ఓ వైపు ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ కొనసాగుతుండగా... మరోవైపు అన్నదాతలు సాగుకు సన్నద్ధమవుతున్నారు. -
ఆగుతూ.. సాగుతూ..ఇబ్బంది పెడుతూ..
[ 19-05-2024]
అభివృద్ధికి మారుపేరుగా నిలిచే జాతీయ రహదారి పనులు నత్తనడకన సాగుతున్నాయి. ప్రజలను ఇబ్బందికి గురిచేస్తున్నాయి. మెదక్-ఎల్కతుర్తి 134 కి.మీ.ల 765డీజీ జాతీయ రహదారిని రూ.1,461 కోట్ల నిధులతో చేపట్టారు. -
చెరువు మట్టి.. పొలానికి పుష్టి
[ 19-05-2024]
రసాయన ఎరువుల వినియోగం రోజురోజుకు పెరుగడంతో భూసారం తగ్గడమే కాకుండా చీడపీడల ఉద్ధృతితో పాటు పంట దిగుబడుల్లో తేడా ఏర్పడుతోంది. -
లెక్కలు తేలుస్తారు
[ 19-05-2024]
సంఘాలు.. సంస్థలు.. కార్యాలయాలు ఎక్కడైనా లెక్కలే కీలకం. వీటిలో తేడా వస్తే నమ్మకానికి తావుండదు. అందుకే ఇవి పక్కాగా ఉండాలి. -
సీఎం ముఖచిత్రంతో..రాత పుస్తకాలు
[ 19-05-2024]
సర్కారు బడుల బలోపేతమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే మధ్యాహ్న భోజనం, ఉచితంగా రెండు జతల ఏకరూప దుస్తులు, -
తొలకరికే తొందరొద్దు
[ 19-05-2024]
తొలకరి వర్షాలకే రైతులు తొందరపడి ఎలాంటి విత్తనాలు విత్తొద్దు.. భూమిలో 60 శాతానికి పైగా తేమ ఉన్నప్పుడే విత్తాలి.. ఖరీఫ్ సీజన్కు అవసరమయ్యే ఎరువులు, విత్తనాలు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచాం -
4 రోజులు.. రూ.4.29 కోట్లు
[ 19-05-2024]
సార్వత్రిక ఎన్నికలు.. వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో అత్యధికులు స్వస్థలాలకు రాకపోకలు సాగించారు. -
సైబర్ నేరస్థులకు ‘మ్యూల్’ ఖాతాలు
[ 19-05-2024]
సైబర్ నేరస్థుల కోసం ‘మ్యూల్’ బ్యాంకు ఖాతాలు తెరుస్తున్న ముఠా గుట్టును తూర్పు మండలం టాస్క్ఫోర్స్, సైబర్ పోలీసులు, తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరోలు రట్టు చేశాయి. అయిదుగురు నిందితులను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. -
వెంకట్రామిరెడ్డిపై చర్యలు తీసుకోండి
[ 19-05-2024]
భారాస ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని భాజపా నేత రఘునందన్రావు రాష్ట్ర డీజీపీని కలిసి శనివారం ఫిర్యాదు చేశారు. -
అటు.. ఇటు ఓటేశారు!
[ 19-05-2024]
ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కే వజ్రాయుధం. దేశాన్ని పాలించేందుకు సమర్థ నేతలను ఎన్నుకునేందుకు రాజ్యాంగం కల్పించిన హక్కు ఇది. -
పఠనాసక్తికి బాసట
[ 19-05-2024]
విద్యార్థులు సెలవులు రాగానే చరవాణులకు, టీవీలకు అతుక్కుపోతుంటారు. కేవలం పాఠశాలలు కొనసాగుతున్నప్పుడే చదువుపై దృష్టిపెడుతున్నారు. -
హామీలు అమలు చేయకుంటే రోడ్డెక్కుతాం: భారాస
[ 19-05-2024]
ఎన్నికలకు ముందు రైతులకిచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని, లేదంటే రోడ్డెక్కుతామని మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి హెచ్చరించారు. -
అన్నదాతల ఆందోళన
[ 19-05-2024]
పట్టణంలోని ఏఎంసీ ఆవరణలో నిర్వహిస్తున్న పీఏసీఎస్ కొనుగోలు కేంద్రానికి ధాన్యం తరలించిన రైతులు లారీల సమస్య కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు
తాజా వార్తలు (Latest News)
-
రాజస్థాన్ను ముంచిన వరుణుడు.. హైదరాబాద్ను వరించిన అదృష్టం
-
భాజపాకు యూపీలో ఒక్క సీటు మాత్రమే.. రాహుల్ జోస్యం
-
‘బ్లూ ఆరిజిన్’ ప్రయోగం విజయవంతం.. అంతరిక్షయానం చేసిన తొలి తెలుగు వ్యక్తి
-
‘భారతీయుడు 2’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ లుక్తో అజిత్
-
పీర్జాదిగూడ మేయర్, కార్పొరేటర్ల కిడ్నాప్నకు కాంగ్రెస్ యత్నం: హరీశ్రావు
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!