logo

లాడ్జిలో భారీగా వస్త్రాలు స్వాధీనం

రామాయంపేట పట్టణంలోని ఓ లాడ్జిలో ఎన్నికల్లో పంపిణీ చేయడానికి సామగ్రి దాచి ఉంచారనే ఫిర్యాదు నేపథ్యంలో మంగళవారం పోలీసులు తనిఖీలు చేశారు.

Published : 08 May 2024 03:13 IST

తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు
రామాయంపేట: రామాయంపేట పట్టణంలోని ఓ లాడ్జిలో ఎన్నికల్లో పంపిణీ చేయడానికి సామగ్రి దాచి ఉంచారనే ఫిర్యాదు నేపథ్యంలో మంగళవారం పోలీసులు తనిఖీలు చేశారు. లాడ్జిలోని ఓ గదిలో ఉన్న చీరలు, పంజాబీ డ్రెస్సులు, అంగీముక్కలు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో పంజాబీ డ్రెస్‌ మెటీరియల్‌ 204 పీసులు, చీరలు 202, అంగీముక్కలు 196 ఉన్నట్లు గుర్తించామని ఎఫ్‌ఎస్‌టీ సభ్యుడు భూపతి తెలిపారు. బాధ్యులను గుర్తించి కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు