నవోన్మేశమే.. ‘యువా’శయం
ఎన్నికలు ఏవైనా.. యువ భాగస్వామ్యం కీలకం. వారు తీసుకునే నిర్ణయం సమాజ ప్రగతికి దోహదపడుతుంది.
న్యూస్టుడే, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి టౌన్, వికారాబాద్
ఎన్నికలు ఏవైనా.. యువ భాగస్వామ్యం కీలకం. వారు తీసుకునే నిర్ణయం సమాజ ప్రగతికి దోహదపడుతుంది. ఉమ్మడి మెదక్, వికారాబాద్ జిల్లాల్లో మెజార్టీ ఓటర్లుగా యువతీ, యువకులు ఉన్నారు. ఈ తరుణంలో వారి భవితకు భరోసా కల్పించాల్సిన బాధ్యత ఎన్నికయ్యే నేతపై ఉంటుంది. యువ ఆకాంక్షలను అద్దం పట్టే పాలన అందించాల్సిన ఆవశ్యకత ఉంది. చదువు, ఉద్యోగం, ఉపాధి, నైపుణ్య శిక్షణ, ఇతరత్రా రంగాల్లో తమదైన ప్రత్యేకతను చాటేందుకు యువత ఉవ్విళ్లూరుతుంటారు. ఈ క్రమంలో వారి ఆశయాలకు నెరవేర్చేందుకు సంపూర్ణ సహకారం అందించాలని ఆకాంక్షిస్తున్నారు. లోక్సభ ఎన్నికల వేళ యువత ఆశలు, ఆశయాలపై ‘న్యూస్టుడే’ కథనం.
చదువుతోనే ప్రగతి..
చదువుతోనే సమాజ ప్రగతి సాకారమవుతుంది. అందుకు సమగ్ర ప్రణాళిక అవశ్యం. డిమాండ్ మేర ప్రభుత్వ విద్యా సంస్థలను విస్తృతం చేయాల్సి ఉంది. పూర్తిస్థాయిలో వసతులు కల్పించి మెరుగైన బోధనకు చర్యలు చేపట్టాలి. సిద్దిపేటలో విశ్వవిద్యాలయం, హుస్నాబాద్, మెదక్లో ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉంది. గజ్వేల్ విద్యా సౌధం నిర్వహణను మెరుగుపర్చాలి. తూప్రాన్, రామాయంపేటలో డిగ్రీ, హుస్నాబాద్లో ప్రభుత్వ ఐటీఐ, నైపుణ్య శిక్షణ కేంద్రం, పీజీ కళాశాల ఏర్పాటు చేయాలి. వికారాబాద్లోనూ పలు విద్యాలయాలను నెలకొల్పాల్సి ఉంది. నాలుగు జిల్లాల్లో 4 వేలకు పైగా విద్యాలయాలు ఉండగా.. 7 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరిలో డిగ్రీ, పీజీ తదితర కోర్సులు చేస్తున్న వారు 1.50 లక్షల మంది వరకు ఉన్నారు.
ఉపాధికి ఊతమివ్వండి..
సిద్దిపేట, మెదక్, వికారాబాద్ జిల్లాల్లో పారిశ్రామిక అభివృద్ధి అవశ్యం. పెద్దసంఖ్యలో పరిశ్రమలు కరవై ఉపాధికి ఇతర జిల్లాలు, నగరాలు లేదా దేశాలకు వలసలు వెళ్తున్నారు. ఉపాధి పెంచేలా పారిశ్రామిక అభివృద్ధికి బాటలు వేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. వివిధ కార్పొరేషన్ల రుణాలకు దరఖాస్తు చేసుకున్నా ఏళ్లుగా అందని పరిస్థితి. వాటి పరిష్కారానికి కృషి చేస్తారనే నమ్మకం కలిగించాలని కోరుతున్నారు.ః కేంద్ర, రాష్ట్ర రాయితీ పథకాలు త్వరితగతిన అమలు చేయాలి. రాయితీ రుణాలు ఏళ్లుగా మంజూరు కాక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పరిశ్రమలు, కుటీర పరిశ్రమల ఏర్పాటు దిశగా ప్రోత్సాహం అవసరం. జిల్లాల్లో పరిశ్రమలు మరిన్ని ఏర్పాటు కావాలి. స్థానికులకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలి. స్వయం ఉపాధికి బాటలు వేయాలి.
రాజకీయంలో వెనుకబాటు..
అన్నింటా ముందంజలో ఉండే యువత రాజకీయంలో మాత్రం వెనుకడుగే. చదువు పూర్తవగానే ఉద్యోగాలు, ఉపాధి వేటలో పడి దేశ నిర్మాణంలో ప్రత్యక్ష పాత్ర పోషించడం లేదు. సరైన ప్రోత్సాహం లేక చతికిలపడుతున్నారు. ఈ తరుణంలో ప్రభుత్వాలు, పార్టీలు.. యువతకు పెద్దపీట వేయాల్సి ఉంది. ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన ఉన్నా ప్రోత్సహించే వారే కరవయ్యారు. ః రాజకీయ పార్టీలు యువతకు వివిధ ఎన్నికల్లో ప్రాధాన్యం ఇవ్వాలి. నిర్దేశిత మొత్తంలో సీట్ల కేటాయింపు చేపట్టాలి. పదవుల కేటాయింపుల్లోనూ పెద్దపీట వేయాలి.
శిక్షణతో బాసట..
ఎందులోనైనా రాణించాలంటే శిక్షణ అవసరం. ఆ దిశగా యువతలో నైపుణ్యం పెంచేలా శిక్షణ కేంద్రాలను నెలకొల్పాలి. తర్ఫీదు అందిస్తూ స్వయం ఉపాధికి బాటలు వేసే కేంద్రాలు మరిన్ని అవశ్యం. సిద్దిపేట, సంగారెడ్డి జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల సాధనకు సన్నద్ధం చేసేవి ఉన్నాయి. వీటిని అన్ని జిల్లాలకు విస్తరించాలి. యువత డిమాండ్కు అనుగుణంగా కోర్సులు అందుబాటులోకి తేవాలి.
యువతకు అనుగుణంగా డివిజన్ కేంద్రాల్లోనూ శిక్షణ కేంద్రాలను అందుబాటులోకి తేవాలి. అవసరం మేరకు అన్ని ప్రాంతాల్లో అధ్యయన కేంద్రాలు తప్పనిసరి. ఐఏఎస్, ఐపీఎస్, ఇతర ఉన్నతస్థాయి ఉద్యోగాల సాధనకు శిక్షణ అందించాలి.
- మెదక్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, నర్సాపూర్, గజ్వేల్, పటాన్చెరు, దుబ్బాక అసెంబ్లీ సెగ్మెంట్లు వస్తాయి.
- జహీరాబాద్ స్థానం పరిధిలో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్, నారాయణఖేడ్, అందోలు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.
- చేవెళ్ల పరిధిలో వికారాబాద్ జిల్లా కేంద్రంతో పాటు, తాండూరు, పరిగి ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వానాకాలం సాగుకు సన్నద్ధం
[ 19-05-2024]
ఓ వైపు ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ కొనసాగుతుండగా... మరోవైపు అన్నదాతలు సాగుకు సన్నద్ధమవుతున్నారు. -
ఆగుతూ.. సాగుతూ..ఇబ్బంది పెడుతూ..
[ 19-05-2024]
అభివృద్ధికి మారుపేరుగా నిలిచే జాతీయ రహదారి పనులు నత్తనడకన సాగుతున్నాయి. ప్రజలను ఇబ్బందికి గురిచేస్తున్నాయి. మెదక్-ఎల్కతుర్తి 134 కి.మీ.ల 765డీజీ జాతీయ రహదారిని రూ.1,461 కోట్ల నిధులతో చేపట్టారు. -
చెరువు మట్టి.. పొలానికి పుష్టి
[ 19-05-2024]
రసాయన ఎరువుల వినియోగం రోజురోజుకు పెరుగడంతో భూసారం తగ్గడమే కాకుండా చీడపీడల ఉద్ధృతితో పాటు పంట దిగుబడుల్లో తేడా ఏర్పడుతోంది. -
లెక్కలు తేలుస్తారు
[ 19-05-2024]
సంఘాలు.. సంస్థలు.. కార్యాలయాలు ఎక్కడైనా లెక్కలే కీలకం. వీటిలో తేడా వస్తే నమ్మకానికి తావుండదు. అందుకే ఇవి పక్కాగా ఉండాలి. -
సీఎం ముఖచిత్రంతో..రాత పుస్తకాలు
[ 19-05-2024]
సర్కారు బడుల బలోపేతమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే మధ్యాహ్న భోజనం, ఉచితంగా రెండు జతల ఏకరూప దుస్తులు, -
తొలకరికే తొందరొద్దు
[ 19-05-2024]
తొలకరి వర్షాలకే రైతులు తొందరపడి ఎలాంటి విత్తనాలు విత్తొద్దు.. భూమిలో 60 శాతానికి పైగా తేమ ఉన్నప్పుడే విత్తాలి.. ఖరీఫ్ సీజన్కు అవసరమయ్యే ఎరువులు, విత్తనాలు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచాం -
4 రోజులు.. రూ.4.29 కోట్లు
[ 19-05-2024]
సార్వత్రిక ఎన్నికలు.. వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో అత్యధికులు స్వస్థలాలకు రాకపోకలు సాగించారు. -
సైబర్ నేరస్థులకు ‘మ్యూల్’ ఖాతాలు
[ 19-05-2024]
సైబర్ నేరస్థుల కోసం ‘మ్యూల్’ బ్యాంకు ఖాతాలు తెరుస్తున్న ముఠా గుట్టును తూర్పు మండలం టాస్క్ఫోర్స్, సైబర్ పోలీసులు, తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరోలు రట్టు చేశాయి. అయిదుగురు నిందితులను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. -
వెంకట్రామిరెడ్డిపై చర్యలు తీసుకోండి
[ 19-05-2024]
భారాస ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని భాజపా నేత రఘునందన్రావు రాష్ట్ర డీజీపీని కలిసి శనివారం ఫిర్యాదు చేశారు. -
అటు.. ఇటు ఓటేశారు!
[ 19-05-2024]
ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కే వజ్రాయుధం. దేశాన్ని పాలించేందుకు సమర్థ నేతలను ఎన్నుకునేందుకు రాజ్యాంగం కల్పించిన హక్కు ఇది. -
పఠనాసక్తికి బాసట
[ 19-05-2024]
విద్యార్థులు సెలవులు రాగానే చరవాణులకు, టీవీలకు అతుక్కుపోతుంటారు. కేవలం పాఠశాలలు కొనసాగుతున్నప్పుడే చదువుపై దృష్టిపెడుతున్నారు. -
హామీలు అమలు చేయకుంటే రోడ్డెక్కుతాం: భారాస
[ 19-05-2024]
ఎన్నికలకు ముందు రైతులకిచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని, లేదంటే రోడ్డెక్కుతామని మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి హెచ్చరించారు. -
అన్నదాతల ఆందోళన
[ 19-05-2024]
పట్టణంలోని ఏఎంసీ ఆవరణలో నిర్వహిస్తున్న పీఏసీఎస్ కొనుగోలు కేంద్రానికి ధాన్యం తరలించిన రైతులు లారీల సమస్య కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు
తాజా వార్తలు (Latest News)
-
ఆర్సీబీ ఇంపాక్ట్ ప్లేయర్గా క్రిస్గేల్: జెర్సీ ఇంకా ఫిట్గానే ఉందన్న యూనివర్స్ బాస్
-
రిషి సునాక్ దంపతుల సంపద.. రాజు ఆస్తుల కంటే ఎక్కువ!
-
ధోనీపై కమల్ ప్రశంసలు.. క్రిస్గేల్తో రిషబ్ ఫొటో
-
ఎయిర్లైన్స్ లాభాల్లో బిగ్ జంప్.. ఉద్యోగులకు 8 నెలల జీతం బోనస్..
-
బలహీనపడిన ఆవర్తనం.. తెలంగాణలో మరో 3 రోజుల పాటు వర్షాలు
-
తెలంగాణ కేబినెట్ భేటీ.. షరతులతో కూడిన అనుమతిచ్చిన ఈసీ