logo

షెట్కార్‌ విజయానికి కృషి చేయండి: మంత్రి

కాంగ్రెస్‌ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే అమలు చేయనున్న పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ అన్నారు.

Published : 09 May 2024 01:11 IST

పార్టీలో చేరిన వారికి కండువా వేస్తున్న దామోదర్‌ రాజనర్సింహ

వట్‌పల్లి, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే అమలు చేయనున్న పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ అన్నారు. మండలంలోని మర్వెల్లిలో బుధవారం నిర్వహించిన పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరయ్యారు. మండలంలోని దరఖాస్తుపల్లి, ఖాదీరాబాద్‌, బిజిలీపూర్‌, షాద్‌నగర్‌కు చెందిన భారాస నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరగా.. వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యమన్నారు. జహీరాబాద్‌ పార్లమెంట్‌ అభ్యర్థి సురేష్‌కుమార్‌ షెట్కార్‌ను భారీ మెజార్టీతో గెలిపించేందుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో వీరశైవ లింగాయత్‌, లింగ బలిజ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పట్లోళ్ల సంగమేశ్వర్‌, యువజన విభాగం రాష్ట్ర బాధ్యుడు పరమేశ్వర్‌, మాజీ సర్పంచి శివచరణ్‌, ఏఎంసీ మాజీ అధ్యక్షుడు రాంరెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు రమేష్‌ జోషి, యువజన విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి వినయ్‌గౌడ్‌, మండల అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు ప్రవీణ్‌గౌడ్‌, నాయకులు శ్రీశైలం, మల్లికార్జున్‌, ప్రశాంత్‌కుమార్‌, నాగరాజు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు