మృతదేహాలు ఎదురైనా.. ధైర్యంగా ముందుకెళ్లా
ఎనిమిదేళ్లుగా అనేక సవాళ్లను ఎదుర్కొన్నానని ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి బుధవారం నగరానికి చేరుకున్న భువనగిరికి చెందిన అన్వితారెడ్డి తెలిపారు. గడ్డకట్టే చలి, ఆక్సిజన్
అన్వితారెడ్డి, ఆమె తల్లిదండ్రులను సన్మానిస్తున్న అన్వితా సంస్థ ప్రతినిధులు
పంజాగుట్ట, న్యూస్టుడే: ఎనిమిదేళ్లుగా అనేక సవాళ్లను ఎదుర్కొన్నానని ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి బుధవారం నగరానికి చేరుకున్న భువనగిరికి చెందిన అన్వితారెడ్డి తెలిపారు. గడ్డకట్టే చలి, ఆక్సిజన్ స్థాయిలు పడిపోవడం, దారిలో ఎన్నో మృతదేహాలు ఎదురైనప్పటికీ ధైర్యంగా అడుగు ముందుకు వేయడంతోనే విజయం సాధ్యమైందని పేర్కొన్నారు. సోమాజిగూడలోని మెర్క్యూరీ హోటల్లతో జరిగిన కార్యక్రమంలో అన్వితారెడ్డితో పాటు ఆమె తల్లిదండ్రులు మధుసూన్రెడ్డి, చంద్రకళను అన్వితా గ్రూపు అధినేత అచ్యుతరావు బొప్పన ఆధ్వర్యంలో పలువురు సన్మానించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. మే 12న ఎవరెస్టు బేస్ క్యాంప్ చేరుకున్న అన్వితారెడ్డి వివిధ ఎత్తుల్లోని నాలుగు శిబిరాలను దాటి తన గైడ్తో కలిసి 15వ తేదీన రాత్రి సమయంలో క్యాంప్-4 నుంచి బయలుదేరిందన్నారు. మే 16న ఉదయం 9.30 గంటలకు 8848.86 మీటర్ల ఎత్తున్న ఎవరెస్టు శిఖరాన్ని చేరుకుందన్నారు. ఎంబీఏ పట్టభద్రురాలైన అన్వితారెడ్డి సామాన్య మధ్యతరగతి కుటుంబానికి చెందిన విద్యార్థిని అని, తండ్రి మధుసూదన్రెడ్డి వ్యవసాయదారుడని అచ్యుతరావు తెలిపారు. భువనగిరిలోని రాక్ క్లింబింగ్ పాఠశాలకు చెందిన కోచ్ శేఖర్బాబు శిక్షణ, అన్వితా గ్రూపు అధినేత అచ్యుతరావు సహకారం విజయాన్ని సాధించేందుకు దోహదపడ్డాయని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మామిడీలా
[ 27-04-2024]
మామిడి.. భారతదేశపు పండుగా గుర్తింపు పొందింది. ప్రపంచ ఎగుమతుల్లోనూ అగ్రస్థానంలో ఉంది. ఇది నిన్నామొన్నటి మాట. -
ఆదరించండి.. అభివృద్ధి చేస్తాడు: రాజగోపాల్రెడ్డి
[ 27-04-2024]
రాబోయే నాలుగేళ్లలో డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తి చేసి మునుగోడు నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగు నీరందించి సస్యశ్యామలం చేస్తానని భువనగిరి లోక్సభ కాంగ్రెస్ ఎన్నికల ఇన్ఛార్జి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. -
పద తమ్ముడూ.. పార్టీ మారుదాం!
[ 27-04-2024]
అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజకీయ పార్టీల క్యాడర్ స్వరూపం మారిపోతోంది. రాజకీయ సమీకరణాలూ శరవేగంగా మారుతున్నాయి. -
సమగ్ర సమాచార మార్గదర్శి
[ 27-04-2024]
ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం అనేక రకాల చర్యలు చేపడుతోంది. -
‘గుర్తు’ తెచ్చుకుందాం..రండి
[ 27-04-2024]
రాజకీయ పార్టీల ఉనికిని చాటేది వాటి గుర్తులే. గుర్తుల ఆధారంగానే ఆయా పార్టీలు ఎన్నికల ప్రచారం నిర్వహించడమే కాకుండా ఓటర్లు ఓటు వేస్తుంటారు. -
ప్రజల మనిషి ధర్మభిక్షం
[ 27-04-2024]
మునుగోడు మండలం ఊకొండిలో కల్లుగీత వృత్తి పని చేసుకునే ధర్మభిక్షం కుటుంబం సూర్యాపేటకు వలసవెళ్లి అక్కడే స్థిరపడింది. -
ఈతకెళ్లి తండ్రీతనయుల మృతి
[ 27-04-2024]
నీటి ప్రమాదాల నుంచి తప్పించుకునేలా తన ఇద్దరు కుమారులకు ఈత నేర్పాలని భావించిన ఆ తండ్రి. -
అవార్డుల ఉపాధ్యాయుడు ఆదె..!
[ 27-04-2024]
వృత్తిరీత్యా ఉపాధ్యాయుడిగా రెండు దశాబ్దాల నుంచి చిన్నారులకు విద్యాబోధన అందించటమే కాకుండా సమాజంలో విద్యాభివృద్ధికి తనవంతు తోడ్పాటు అందిస్తున్నారు ఆదె సత్యనారాయణ. -
వీడని మిస్టరీ..!
[ 27-04-2024]
ఈ నెల 18 నుంచి కనిపించకుండా పోయిన సూర్యాపేట మండలం యల్కారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు వడ్డె ఎల్లయ్య కేసు మిస్టరీ వీడటం లేదు. -
చివరికి మొగి పురుగు దాడి
[ 27-04-2024]
ఈ సీజన్లో ఎస్సారెస్పీ కాల్వల ద్వారా గోదావరి జలాలు ఆలస్యంగా విడుదల కావడంతో తుంగతుర్తి నియోజకవర్గంలో 40 శాతం వరి సాగు జనవరి మాసంలో చేపట్టారు. -
వేతనాలు రాక టీఏల ఇబ్బందులు
[ 27-04-2024]
గ్రామీణ ప్రాంతాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు ఉపాధి పనులను చూపిస్తూ విధులు నిర్వహిస్తున్న సాంకేతిక సహాయకుల ( టెక్నికల్ అసిస్టెంట్లు)కు రెండు నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
బరిలో..
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్లలో భాగంగా శుక్రవారం జరిగిన నామపత్రాల పరిశీలన కార్యక్రమంలో నల్గొండ లోక్సభ పరిధిలో 25 మంది అభ్యర్థుల నామినేషన్లు సరిగా లేకపోవడంతో తిరస్కరించినట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్