logo

తెరాసకు ప్రత్యామ్నాయం భాజపానే: సంకినేని

తెలంగాణలో తెరాసకు ప్రత్యామ్నాయ పార్టీ భాజపానేనని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్‌రావు అన్నారు. శనివారం సూర్యాపేట టౌన్‌, మండల బూత్‌ కమిటీల సమావేశం బాలాజీ గార్డెన్స్‌లో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ

Published : 26 Jun 2022 02:33 IST

సూర్యాపేటలో మాట్లాడుతున్న సంకినేని వెంకటేశ్వర్‌రావు, తదితరులు

సూర్యాపేట గ్రామీణం, న్యూస్‌టుడే: తెలంగాణలో తెరాసకు ప్రత్యామ్నాయ పార్టీ భాజపానేనని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్‌రావు అన్నారు. శనివారం సూర్యాపేట టౌన్‌, మండల బూత్‌ కమిటీల సమావేశం బాలాజీ గార్డెన్స్‌లో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ భాజపా కేంద్ర పార్టీ తెలంగాణపై పూర్తి స్థాయిలో దృష్టి సారించిందన్నారు. జూన్‌ 30, జులై 1,2 తేదీలలో కేంద్ర మంత్రి వీకే సింగ్‌ సూర్యాపేట నియోజకవర్గంలో పర్యటిస్తారన్నారు. కేంద్రమంత్రి మూడ్రోజులు సూర్యాపేటలో పర్యటించి 15 శక్తి కేంద్రాల సమావేశాల్లో పాల్గొంటారన్నారు. బూత్‌ కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారన్నారు.మిగులు బడ్జెట్‌ ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకొచ్చారన్నారు. పీకే సర్వేలో మంత్రి జగదీష్‌రెడ్డిపై తీవ్ర వ్యతిరేకత రావడంతో సోషల్‌మీడియాలో అభివృద్ధి ప్రధాత అంటూ పెయిడ్‌ ఆర్టిస్ట్‌లతో ఫేక్‌ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. పట్టణ అధ్యక్షుడు ఎండీ అబిద్‌, మండల అధ్యక్షుడు శశిధర్‌రెడ్డి, జిల్లా ప్రధానకార్యదర్శి వీరేంద్ర, అధికార ప్రతినిధి మల్సూర్‌గౌడ్‌, కోశాధికారి సుశీందర్‌రెడ్డి, మండల ఇన్‌ఛార్జి శ్రీనివాసారావు, జిల్లా ఉపాధ్యక్షులు చల్లమల్ల నర్సింహ, మీర్‌అక్బర్‌,  మమతారెడ్డి తదితరులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని