ఖాళీ ప్లాట్లు.. ఎన్నాళ్లీ పాట్లు
సూర్యాపేట పట్టణంలోని బాలాజీనగర్లో ఖాళీ స్థలంలో నీరు నిలిచి మురుగు కూపంగా మారింది. దుర్వాసనతో చుట్టుపక్కల ఇళ్లవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
సూర్యాపేట పట్టణంలోని బాలాజీనగర్లో ఖాళీ స్థలంలో నీరు నిలిచి మురుగు కూపంగా మారింది. దుర్వాసనతో చుట్టుపక్కల ఇళ్లవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దోమల వృద్ధి చెందటంతో రాత్రి సమయంలో కాలనీవాసులు కంటినిండా కునుకుతీయడం లేదు. రోగాల బారినపడే పరిస్థితి నెలకొందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
సూర్యాపేట పురపాలిక, న్యూస్టుడే: చాలా మంది భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని పట్టణాల్లో ఇళ్ల స్థలాలు కొనుగోలు చేస్తున్నారు. గృహాలు నిర్మించుకోకుండా, ఎప్పటికప్పుడు నిర్వహణ చర్యలు తీసుకోకుండా ఖాళీగా వదిలేస్తున్నారు. నిర్మించిన ఇళ్ల కంటే స్థలాలు లోతట్టులో ఉండటంతో వర్షాలకు వరద నీరు నిలిచి మురుగు కూపాలుగా మారుతున్నాయి. జిల్లా కేంద్రంగా సూర్యాపేటతోపాటు తిరుమలగిరి, నేరేడుచర్ల, కోదాడ, హుజూర్నగర్ పురపాలికల పరిధిలో స్థిరాసి వ్యాపారం జోరందుకుంది. కొందరు నిబంధనలు పాటించకుండా ఇష్టారీతిన ప్లాట్లు ఏర్పాటు చేస్తూ విక్రయాలు చేస్తున్నారు. గతంలో ఉన్న కాలనీలతోపాటు కొత్తగా ఏర్పడిన వాటిలో ఓపెన్ ప్లాట్లు స్థానికులకు పెద్ద సమస్యగా మారాయి. జిల్లాలోని ఐదు పురపాలికల్లో 45 ప్రాంతాల్లో ఈ సమస్య నెలకొంది.
కొరవడిన పర్యవేక్షణ
ఖాళీ స్థలాల్లో మురుగు, వర్షం నీరు నిలిచి, పిచ్చిమొక్కలు పెరగకుండా యజమానులు చర్యలు తీసుకోవాలి. మున్సిపల్ అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో యజమానులూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కొనుగోలుదారులకు మున్సిపల్ అధికారులు అడపాదడపా నోటీసులు జారీ చేయడమే తప్ప శాశ్వత పరిష్కారం మాత్రం చూపడం లేదు. కొందరు స్పందించి రక్షణ చర్యలు తీసుకుంటుండగా, మరికొందరు పట్టించుకోవడం లేదు. కొందరి వివరాలు తెలియక వారికి నోటీసులు జారీ చేయలేకపోతున్నామంటూ పుర అధికారులు చేతులు దులుపుకొంటున్నారు. ఖాళీ స్థలం పన్ను(వీఎల్టీ)ను యజమానులు చెల్లించాల్సి ఉంటుంది. డాక్యుమెంట్ విలువలో 0.5శాతం కట్టాలి. అంటే రూ.లక్ష విలువచేసే స్థలానికి రూ.500 చెల్లించాలి. ఈ పన్నుల వసూలులోనూ అధికారులు వెనుకడుగు వేస్తున్నారు.
చర్యలు తీసుకుంటాం
-సత్యనారాయణరెడ్డి, మున్సిపల్ కమిషనర్, సూర్యాపేట
ఖాళీ స్థలాల యజమానులు నిబంధనలు పాటించకుంటే చర్యలు తీసుకుంటాం. మురుగు నిల్వ ఉండకుండా, పిచ్చిమొక్కలు మొలవకుండా యజమానులు చూసుకోవాలి. వీఎల్టీ వసూలు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోరుబాట.. ఓటు మాట..!
[ 26-04-2024]
ఉమ్మడి జిల్లాలో భారాస అధినేత కేసీఆర్ ‘పోరుబాట - బస్సుయాత్ర’ రెండో రోజూ కొనసాగింది. గురువారం సాయంత్రం 4 గంటలకు సూర్యాపేట నుంచి బయల్దేరిన కేసీఆర్కు అర్వపల్లి, తిరుమలగిరి, దేవరుప్పల, జనగామ, ఆలేరు ప్రాంతాల్లో పూలతో స్వాగతం పలికారు. -
ఓటుతోనే చైతన్యవంతమైన ప్రజాస్వామ్యం: కలెక్టర్
[ 26-04-2024]
ప్రతి ఓటరు నిజాయితీతో ఓటు వేసి చైతన్యవంతమైన ప్రజాస్వామ్యానికి ఊతం ఇవ్వాలని కలెక్టర్ దాసరి హరిచందన పిలుపునిచ్చారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యునికేషన్(సీబీసీ) ఆధ్వర్యంలో గురువారం నల్గొండలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన మూడు రోజుల పాటు ఏర్పాటు చేసిన ఛాయా చిత్ర ప్రదర్శనను ఆమె ప్రారంభించారు. -
ముగిసిన నామినేషన్ల పర్వం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల క్రతువు గురువారంతో ముగిసింది. ఉమ్మడి జిల్లాలోని నల్గొండ లోక్సభ స్థానానికి 56 మంది అభ్యర్థులు 114 సెట్ల నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. -
గిరి గీశారు అందరూ.. బరిలో నిలిచేది ఎందరో
[ 26-04-2024]
గుజరాత్లోని సూరత్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. సదరు అభ్యర్థి నామినేషన్ పత్రాల్లోని సంతకాలు తమవి కావని ముగ్గురు ప్రతిపాదకులు రిటర్నింగ్ అధికారి (ఆర్వో)కి అఫిడవిట్లు సమర్పించారు. -
దేవరకొండ నుంచి 450 మంది పోటీ
[ 26-04-2024]
లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఆయా శాసన సభ నియోజకవర్గాలు కలిసి ఉంటాయి. అక్కడి జనాభాను బట్టి ఐదు నుంచి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండొచ్చు. అలాంటిది లోక్సభ నియోజకవర్గానికి ఒకే శాసనసభ నియోజకవర్గం నుంచి 450 మంది పోటీ చేసి ఆకర్షించారు. -
జోజిలపాస్ను అధిరోహించిన దేవరకొండ వాసి
[ 26-04-2024]
అత్యంత ధైర్య సాహసాలతో.. ఎత్తయిన ప్రాంతం జోజీలపాస్కు చేరుకొని ఔరా అనిపించాడు నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణానికి చెందిన అజీజ్. ఇతని తల్లిదండ్రులు అబ్దుల్ సలాం, ఖుర్షీద్భేగంలు. -
వేసవి శిబిరాలు.. నైపుణ్య కారకాలు!
[ 26-04-2024]
వేసవి సెలవులు వచ్చేశాయి. ఇక చిన్నారులు తమ స్నేహితులతో కలిసి ఆటలాడుతుంటే.. వారిలో క్రమశిక్షణకు తోడు నైపుణ్యాభివృద్ధి, సృజనకు మెరుగులుదిద్దాలని తల్లిదండ్రులు ఆశ పడుతుంటారు. -
బంజరు భూముల్లో ఆడుకునేవాళ్లం
[ 26-04-2024]
వేసవి సెలవులొస్తే చాలు.. బాల్యమిత్రులతో కలిసి ఆటల పోటీలు నిర్వహించేవాళ్లం. అప్పట్లో బంజరు భూములే మాకు క్రీడా మైదానాలు. ఆ భూములను మేమే స్వయంగా పిచ్చి మొక్కలు తొలగించి బాగు చేసుకునేవాళ్లం. -
భక్తవత్సలుడికి సంప్రదాయ ఆరాధనలు
[ 26-04-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో గురువారం స్వయంభువులైన పంచనారసింహులను ఆరాధిస్తూ చేపట్టిన నిత్య పూజలు ఆలయ ఆచారంగా కొనసాగాయి. వేకువజామున సుప్రభాతం చేపట్టిన పూజారులు గర్భాలయ ద్వారాలను తెరిచి మూలవరులకు హారతినిచ్చి కొలిచారు. -
యువకుడి బలవన్మరణం
[ 26-04-2024]
పురుగుమందు తాగి యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన మండలంలోని నాతాళ్లగూడెంలో గురువారం ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. -
అనుబంధాలు తెగిపాయె.. ఆనందాలు ఆవిరాయె
[ 26-04-2024]
తల్లిదండ్రులతో పాటు, నానమ్మ, తాత.. నలుగురు ఒకేసారి మరణిస్తే ఆ కుటుంబానికి ఉండే బాధ మాటల్లో చెప్పలేం. ఈ చిత్రంలో కనిపిస్తున్న చిన్నారులు కౌశిక్, కార్తీక్ ఇద్దరి వయసు ఆరేళ్లలోపే. -
సీ విజిల్లో నిర్భయంగా ఫిర్యాదు చేయొచ్చు
[ 26-04-2024]
ఎన్నికల నియమావళి ఉల్లంఘనల కింద సీవిజిల్ యాప్లో నిర్భయంగా ఫిర్యాదు చేయొచ్చని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హన్మంత్ కె.జెండగే అన్నారు. భువనగిరి గ్రామీణ పోలీస్పరిధిలోని రాయగిరిలో గురువారం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. -
ఈవో ఉంటేనే తెరుస్తారా!
[ 26-04-2024]
యాదాద్రికి విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా క్షేత్ర సమాచారాన్ని ఎప్పటికప్పుడు వారికి అందించేందుకు కొండపైన ఏర్పాటు చేసిన హెల్ప్డెస్క్ మూణ్నాల ముచ్చటగానే మారింది. -
బీసీ గురుకులాల్లో 83.94 శాతం ఉత్తీర్ణత
[ 26-04-2024]
ఇంటర్మీడియట్ ఫలితాల్లో బీసీ గురుకులాల విద్యార్థులు ద్వితీయ సంవత్సరంలో 83.94శాతం ఉత్తీర్ణత సాధించారని బీసీ గురుకులాల రీజనల్ కోఆర్డినేటర్ షకీనా తెలిపారు. ప్రథమ సంవత్సరంలో 70.15శాతం ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్