బాటసారి.. ఇదిగో రహదారి..!
రాష్ట్రంలో అత్యధిక జాతీయ రహదారులు ఉమ్మడి నల్గొండ జిల్లా మీదుగానే వెళ్తున్నాయి. పది రహదారులు 773.కి.మీ. మేర విస్తరించి ఉమ్మడి జిల్లాలోని పలు గ్రామీణ, పట్టణ ప్రాంతాల గుండా వెళ్తూ రవాణా సౌకర్యాలను కల్పిస్తున్నాయి.
ఈనాడు, నల్గొండ, న్యూస్టుడే, గరిడేపల్లి
రాష్ట్రంలో అత్యధిక జాతీయ రహదారులు ఉమ్మడి నల్గొండ జిల్లా మీదుగానే వెళ్తున్నాయి. పది రహదారులు 773.కి.మీ. మేర విస్తరించి ఉమ్మడి జిల్లాలోని పలు గ్రామీణ, పట్టణ ప్రాంతాల గుండా వెళ్తూ రవాణా సౌకర్యాలను కల్పిస్తున్నాయి. ఇంత పెద్ద విస్తీర్ణంలో జాతీయ రహదారులుండటం రాష్ట్రంలోనే ప్రథమం.
హైదరాబాద్ - విజయవాడ
రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక వాహన రద్దీ ఉన్న మార్గంగా హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారి ప్రసిద్ధి చెందింది. ఫుణె నుంచి మచిలీపట్నం వెళ్లే ఈ రహదారి ఉమ్మడి నల్గొండ జిల్లాలో దండు మల్కాపూర్లో మొదలై చౌటుప్పల్, చిట్యాల, నకిరేకల్, సూర్యాపేట, కోదాడ మీదుగా 186 కి.మీ.మేర సాగుతోంది.
హైదరాబాద్ - వరంగల్
హైదరాబాద్ నుంచి మొదలై ఛత్తీస్గఢ్లోని భూపాలపట్నం వరకు వెళ్లే ఈ రహదారి ఉమ్మడి జిల్లాలో బీబీనగర్, భువనగిరి, ఆలేరు మీదుగా 48 కి.మీ. మేర ఉంది.
బిక్కుమళ్ల - నకిరేకల్
రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలను కలిపుతూ సాగే ఈ రహదారి సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం బిక్కుమళ్ల వద్ద మొదలై నూతన్కల్, తుంగతుర్తి, అర్వపల్లి మీదుగా నకిరేకల్ వద్ద ముగుస్తుంది. ఈ రహదారిలో భాగంగా మూసీ నదిపై అర్వపల్లి వద్ద బ్రిడ్జి నిర్మించడంతో నూతన్కల్, తుంగతుర్తి, అర్వపల్లి ప్రాంత వాసులు హైదరాబాద్ వెళ్లాలంటే సూర్యాపేటకు వెళ్లకుండానే నకిరేకల్ మీదుగా వెళ్తున్నారు. దీని వల్ల సుమారు 35 కి.మీ. మేర దూర భారం తగ్గింది. ఇది మొత్తం 65 కి.మీ. మేర సాగుతోంది.
నకిరేకల్ - నాగార్జునసాగర్
నకిరేకల్ నుంచి నల్గొండ మీదుగా హాలియా, నాగార్జునసాగర్ వరకు ఈ రహదారి వెళ్తుంది. పనులు తుది దశలో ఉన్నాయి. తానంచెర్ల - రేణిగుంట మార్గంలో నిర్మిస్తున్న ఈ రహదారి నాగార్జునసాగర్ అనంతరం ఏపీలోని మాచర్ల మీదుగా రేణిగుంట వరకు సాగుతుంది. ఇది మొత్తం జిల్లాలో 78 కి.మీ. మేర విస్తరించి ఉంది.
కోదాడ - జడ్చర్ల
కర్ణాటక రాష్ట్రంలో మొదలై మహబూబ్నగర్, జడ్చర్ల మీదుగా నల్గొండ జిల్లాలోని డిండి మండలం ఎర్రగుంటపల్లి వద్ద ఈ జాతీయ రహదారి ప్రవేశిస్తుంది. దేవరకొండ, హాలియా, మిర్యాలగూడ, హుజూర్నగర్, కోదాడ వరకు మొత్తం 156 కి.మీ. మేర విస్తరించి ఉంది. పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ఈ రహదారి నిర్మాణం వల్ల ఉమ్మడి జిల్లాలోని వాణిజ్య ప్రాంతాలైన దేవరకొండ, మిర్యాలగూడ, హుజూర్నగర్, కోదాడ ప్రాంతాలకు రవాణా సౌకర్యం మెరుగవటమే కాకుండా కర్ణాటక రాష్ట్రం నుంచి కోల్కతాకు దగ్గరి మార్గం ఇది.
కోదాడ - ఖమ్మం
కోదాడ నుంచి ఖమ్మం మీదుగా కురవి వెళ్లే ఈ రహదారి ఉమ్మడి జిల్లాలో కోదాడ వద్ద ప్రారంభమై పాలేరు వాగు వద్ద ముగుస్తుంది. మొత్తం 13 కి.మీ. మేర విస్తరించి ఉంది.
సూర్యాపేట - జనగామ
సూర్యాపేట నుంచి జనగాం, సిద్ధిపేట మీదుగా సిరిసిల్ల వరకు వెళ్లే ఈ రహదారి సూర్యాపేట నుంచి అర్వపల్లి, ఫణిగిరి, తిరుమలగిరి మీదుగా వెళ్తుంది. ఉమ్మడి జిల్లాలో 45 కి.మీ. మేర విస్తరించి ఉంది.
సూర్యాపేట - కొవ్వూరు (రాజమహేంద్రవరం)
సూర్యాపేట నుంచి చివ్వెంల, మోతె మీదుగా ఖమ్మం జిల్లాలోని కూసుమంచి, ఖమ్మం, వైరా, తల్లాడ, సత్తుపల్లి, అశ్వారావుపేట మీదుగా ఆంధ్రప్రదేశ్లోని కొవ్వూరు వరకు ఈ రహదారి సాగుతోంది. సూర్యాపేట జిల్లాలో ఈ రహదారి 32 కి.మీ. మేర విస్తరించి ఉంది. పనులు తుది దశకు చేరుకున్నాయి.
సంగారెడ్డి - చౌటుప్పల్ (ఆర్ఆర్ఆర్ - ఉత్తర భాగం)
ప్రాంతీయ వలయ రహదారి (ఆర్ఆర్ఆర్)లో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి నిర్మిస్తున్న ఈ రహదారి సంగారెడ్డి వద్ద మొదలై నర్సాపూర్, తుఫ్రాన్, గజ్వేల్, జగదేవ్పూర్ మీదుగా ఉమ్మడి జిల్లాలో ప్రవేశిస్తుంది. తుర్కపల్లి, యాదగిరిగుట్ట, భువనగిరి, వలిగొండ మండలాల్లోని గ్రామాలను కలుపుతూ చౌటుప్పల్ వద్ద ముగుస్తుంది. హైదరాబాద్ బాహ్య వలయ రహదారి (ఓఆర్ఆర్)కి ఆవల నిర్మిస్తున్న ఈ రహదారి వల్ల రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యం మెరుగవనుంది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 44 కి.మీ. మేర ఈ రహదారి విస్తరించి ఉంటుంది.
హైదరాబాద్ - కొత్తగూడెం
హైదరాబాద్ సమీపంలోని బాహ్య వలయ రహదారి (ఓఆర్ఆర్) గౌరెల్లి నుంచి ఉమ్మడి జిల్లాలోని వలిగొండ, అర్వపల్లి మీదుగా కొత్తగూడెం వరకు ఈ రహదారి సాగుతోంది. ఉమ్మడి జిల్లాలో పోచంపల్లి మండలంలో మొదలై అర్వపల్లి మండలంలో ముగుస్తుంది. దీని వల్ల ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం అరగంట ముందుగా వెళ్లవచ్చు. సుమారు 35 కి.మీ. మేర ప్రయాణ దూరం తగ్గుతుంది. 230 కి.మీ. మేర నిర్మించే ఈ రహదారిని నాలుగు ప్యాకేజీలుగా విభజించారు. ప్రస్తుతం గౌరెల్లి నుంచి వలిగొండ వరకు టెండర్ల ప్రక్రియ పూర్తయింది. ఈ రహదారి ఉమ్మడి జిల్లాలో 106 కి.మీ. మేర విస్తరించి ఉంది. ఈ మార్గం పూర్తి కావాలంటే మరో రెండేళ్లకు పైగా సమయం పట్టనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోరుబాట.. ఓటు మాట..!
[ 26-04-2024]
ఉమ్మడి జిల్లాలో భారాస అధినేత కేసీఆర్ ‘పోరుబాట - బస్సుయాత్ర’ రెండో రోజూ కొనసాగింది. గురువారం సాయంత్రం 4 గంటలకు సూర్యాపేట నుంచి బయల్దేరిన కేసీఆర్కు అర్వపల్లి, తిరుమలగిరి, దేవరుప్పల, జనగామ, ఆలేరు ప్రాంతాల్లో పూలతో స్వాగతం పలికారు. -
ఓటుతోనే చైతన్యవంతమైన ప్రజాస్వామ్యం: కలెక్టర్
[ 26-04-2024]
ప్రతి ఓటరు నిజాయితీతో ఓటు వేసి చైతన్యవంతమైన ప్రజాస్వామ్యానికి ఊతం ఇవ్వాలని కలెక్టర్ దాసరి హరిచందన పిలుపునిచ్చారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యునికేషన్(సీబీసీ) ఆధ్వర్యంలో గురువారం నల్గొండలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన మూడు రోజుల పాటు ఏర్పాటు చేసిన ఛాయా చిత్ర ప్రదర్శనను ఆమె ప్రారంభించారు. -
ముగిసిన నామినేషన్ల పర్వం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల క్రతువు గురువారంతో ముగిసింది. ఉమ్మడి జిల్లాలోని నల్గొండ లోక్సభ స్థానానికి 56 మంది అభ్యర్థులు 114 సెట్ల నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. -
గిరి గీశారు అందరూ.. బరిలో నిలిచేది ఎందరో
[ 26-04-2024]
గుజరాత్లోని సూరత్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. సదరు అభ్యర్థి నామినేషన్ పత్రాల్లోని సంతకాలు తమవి కావని ముగ్గురు ప్రతిపాదకులు రిటర్నింగ్ అధికారి (ఆర్వో)కి అఫిడవిట్లు సమర్పించారు. -
దేవరకొండ నుంచి 450 మంది పోటీ
[ 26-04-2024]
లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఆయా శాసన సభ నియోజకవర్గాలు కలిసి ఉంటాయి. అక్కడి జనాభాను బట్టి ఐదు నుంచి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండొచ్చు. అలాంటిది లోక్సభ నియోజకవర్గానికి ఒకే శాసనసభ నియోజకవర్గం నుంచి 450 మంది పోటీ చేసి ఆకర్షించారు. -
జోజిలపాస్ను అధిరోహించిన దేవరకొండ వాసి
[ 26-04-2024]
అత్యంత ధైర్య సాహసాలతో.. ఎత్తయిన ప్రాంతం జోజీలపాస్కు చేరుకొని ఔరా అనిపించాడు నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణానికి చెందిన అజీజ్. ఇతని తల్లిదండ్రులు అబ్దుల్ సలాం, ఖుర్షీద్భేగంలు. -
వేసవి శిబిరాలు.. నైపుణ్య కారకాలు!
[ 26-04-2024]
వేసవి సెలవులు వచ్చేశాయి. ఇక చిన్నారులు తమ స్నేహితులతో కలిసి ఆటలాడుతుంటే.. వారిలో క్రమశిక్షణకు తోడు నైపుణ్యాభివృద్ధి, సృజనకు మెరుగులుదిద్దాలని తల్లిదండ్రులు ఆశ పడుతుంటారు. -
బంజరు భూముల్లో ఆడుకునేవాళ్లం
[ 26-04-2024]
వేసవి సెలవులొస్తే చాలు.. బాల్యమిత్రులతో కలిసి ఆటల పోటీలు నిర్వహించేవాళ్లం. అప్పట్లో బంజరు భూములే మాకు క్రీడా మైదానాలు. ఆ భూములను మేమే స్వయంగా పిచ్చి మొక్కలు తొలగించి బాగు చేసుకునేవాళ్లం. -
భక్తవత్సలుడికి సంప్రదాయ ఆరాధనలు
[ 26-04-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో గురువారం స్వయంభువులైన పంచనారసింహులను ఆరాధిస్తూ చేపట్టిన నిత్య పూజలు ఆలయ ఆచారంగా కొనసాగాయి. వేకువజామున సుప్రభాతం చేపట్టిన పూజారులు గర్భాలయ ద్వారాలను తెరిచి మూలవరులకు హారతినిచ్చి కొలిచారు. -
యువకుడి బలవన్మరణం
[ 26-04-2024]
పురుగుమందు తాగి యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన మండలంలోని నాతాళ్లగూడెంలో గురువారం ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. -
అనుబంధాలు తెగిపాయె.. ఆనందాలు ఆవిరాయె
[ 26-04-2024]
తల్లిదండ్రులతో పాటు, నానమ్మ, తాత.. నలుగురు ఒకేసారి మరణిస్తే ఆ కుటుంబానికి ఉండే బాధ మాటల్లో చెప్పలేం. ఈ చిత్రంలో కనిపిస్తున్న చిన్నారులు కౌశిక్, కార్తీక్ ఇద్దరి వయసు ఆరేళ్లలోపే. -
సీ విజిల్లో నిర్భయంగా ఫిర్యాదు చేయొచ్చు
[ 26-04-2024]
ఎన్నికల నియమావళి ఉల్లంఘనల కింద సీవిజిల్ యాప్లో నిర్భయంగా ఫిర్యాదు చేయొచ్చని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హన్మంత్ కె.జెండగే అన్నారు. భువనగిరి గ్రామీణ పోలీస్పరిధిలోని రాయగిరిలో గురువారం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. -
ఈవో ఉంటేనే తెరుస్తారా!
[ 26-04-2024]
యాదాద్రికి విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా క్షేత్ర సమాచారాన్ని ఎప్పటికప్పుడు వారికి అందించేందుకు కొండపైన ఏర్పాటు చేసిన హెల్ప్డెస్క్ మూణ్నాల ముచ్చటగానే మారింది. -
బీసీ గురుకులాల్లో 83.94 శాతం ఉత్తీర్ణత
[ 26-04-2024]
ఇంటర్మీడియట్ ఫలితాల్లో బీసీ గురుకులాల విద్యార్థులు ద్వితీయ సంవత్సరంలో 83.94శాతం ఉత్తీర్ణత సాధించారని బీసీ గురుకులాల రీజనల్ కోఆర్డినేటర్ షకీనా తెలిపారు. ప్రథమ సంవత్సరంలో 70.15శాతం ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం