చుక్క నీరు కూడా వదులుకోబోం: మంత్రి ఉత్తమ్
ప్రస్తుత ఎన్నికలు భారతదేశ దిశ, దశ మార్చేవని, ప్రతి ఓటరూ ఇది గుర్తించి ఓటు వేయాలని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి పిలుపునిచ్చారు.
నేరేడుచర్ల: ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతున్న మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, చిత్రంలో ఎంపీ అభ్యర్థి రఘువీర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
గరిడేపల్లి, మఠంపల్లి, నేరేడుచర్ల, పాలకవీడు గ్రామీణం, హుజూర్నగర్, న్యూస్టుడే: ప్రస్తుత ఎన్నికలు భారతదేశ దిశ, దశ మార్చేవని, ప్రతి ఓటరూ ఇది గుర్తించి ఓటు వేయాలని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి పిలుపునిచ్చారు. గరిడేపల్లిలో జరిగిన ప్రచార సభలో మాట్లాడుతూ.. భాజపా మతపరమైన అల్లర్లు సృష్టించి రిజర్వేషన్లు తొలగించే కుట్ర చేస్తుందన్నారు. కాంగ్రెస్, తాను మంత్రిగా ఉన్నంత కాలం కృష్ణా, గోదావరిలోని చుక్క నీరు కూడా వదులుకోబోమని పేర్కొన్నారు. భారాస కనుమరుగవుతుందనే బాధలో కేసీఆర్, జగదీశ్రెడ్డి ఏదో మాట్లాడుతున్నారని, ఆ పార్టీకి ఎంపీ సీట్లు రాకపోవడమే కాకుండా, ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్లో చేరడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
- మఠంపల్లి ఎన్నికల ప్రచార సభలో కాంగ్రెస్ నాయకులకు దిశానిర్దేశం చేశారు. కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల్లోని అన్ని ఎత్తిపోతల పథకాలు పూర్తి సామర్థ్యంతో పనిచేసేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. మఠంపల్లి ఎన్నికల కార్యక్రమాలను సమన్వయం చేసుకునేందుకు త్రిసభ్య కమిటీ వేస్తున్నట్లు తెలిపారు. మఠంపల్లికి ప్యాసింజర్ రైలు కోసం రఘువీర్ కృషి చేస్తారని చెప్పారు. మాజీ మంత్రి జానారెడ్డి మాట్లాడుతూ.. అభివృద్ధి, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత భాజపా, భారాసకు లేదన్నారు. తన కుమారుడు స్వల్ప అస్వస్థతకు గురి కావడం వల్ల సమావేశానికి హాజరు కాలేకపోయారని తెలిపారు.
- ఉత్తమ్కుమార్రెడ్డి శుక్రవారం హుజూర్నగర్ సభలో రెండు నిమిషాలు మాట్లాడి తనకు ఆరోగ్యం బాగోలేదని వేదిక నుంచి దిగిపోయారు. తనకు స్వల్ప అస్వస్థత ఉందని, నిలబడి మాట్లాడలేకపోతున్నానని మఠంపల్లి సభలో ప్రకటించి కూర్చొని మాట్లాడారు.
- పాలకవీడు మండలం జాన్పహాడ్ మీటింగ్లో మంత్రి మాట్లాడుతూ.. గుండెబోయిన గూడెం ఎత్తిపోతల పథకానికి ఎన్నికల తర్వాత నిధులు కేటాయించి త్వరలో పూర్తి చేస్తామన్నారు. జాన్పహాడ్ దర్గా అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పన కోసం నిధులు కేటాయించి శాశ్వత సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. భారాస, భాజపాలకు డిపాజిట్లు కూడా రావన్నారు.
- నేరేడుచర్ల ప్రధాన కూడలి వద్ద మంత్రి మాట్లాడుతూ..భారాసకు లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటూ దక్కదన్నారు. మాజీ మంత్రి జానారెడ్డి మాట్లాడుతూ దేశంలో నిరుద్యోగం, ధరలు పెరిగిపోయాయని, కేసీఆర్ మాదిరిగా ప్రధాని మోదీకి ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలన్నారు. కాంగ్రెస్ గెలుపు పార్టీకి ఎంత ముఖ్యమో, దేశానికి అంతే ముఖ్యమని నల్గొండ ఎంపీ అభ్యర్థి రఘువీర్రెడ్డి అన్నారు. మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ దేశ ప్రజల భవిష్యత్తు కోసం ఇండియా కూటమిని గెలిపించాలన్నారు. నల్గొండ డీసీసీ అధ్యక్షుడు శంకర్నాయక్, నేరేడుచర్ల పురఛైర్మన్ ప్రకాష్, జడ్పీటీసీ సభ్యుడు నర్సయ్య, కాంగ్రెస్ జిల్లా మహిళా అధ్యక్షురాలు అనురాధ, తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కార్పొరేట్ వాకిటకు..సర్కారు సౌరభం
[ 18-05-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రభుత్వం కార్పొరేట్ విద్యకు సహకారం అందిస్తోంది. -
పరిశ్రమలు 900.. అధికారులు ఐదుగురు
[ 18-05-2024]
రసాయన, ఇతర పరిశ్రమల నుంచి వచ్చే ప్రమాదకర వ్యర్థాలను జాగ్రత్తగా నిర్వీర్యం చేయాలి. ఎక్కడ పడితే అక్కడ పారబోస్తే భూగర్భ జలాలు కలుషితం కావడంతో పాటు ప్రజలు వ్యాధుల బారిన పడే ప్రమాదం పొంచి ఉంది. -
ప్రముఖుల పల్లెల్లో..ప్రజాస్వామ్యం మురిసె
[ 18-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్లో ప్రముఖుల పల్లెల్లో ఓటు చైతన్యం వెల్లివిరిసింది. ఈ గ్రామాలకు చెందిన నేతలు ఎంపీలుగా, ఎమ్మెల్సీలుగా, ఎమ్మెల్యేలుగా సేవలు అందించడంతో పాటు ఇతర ముఖ్యులు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేవిధంగా పల్లెవాసులు వారిని ప్రోత్సహించారు. -
చలో.. నెల్లిబండ గట్టు జాతర
[ 18-05-2024]
వందల ఏళ్ల చరిత్ర.. రెండేళ్లకోసారి జాతర.. వేలాది మంది భక్తుల రాక.. ఉమ్మడి జిల్లాలో దురాజ్పల్లి పెద్దగట్టు తర్వాతి స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకున్న చిన్నగట్టు జాతరకు నెల్లిబండ ముస్తాబైంది. -
పట్టభద్రులకు పోల్ చిట్టీలు
[ 18-05-2024]
వరంగల్- ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు అధికారులు సన్నద్ధమయ్యారు. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో ప్రధాన పార్టీల తరఫున బరిలో ఉన్న అభ్యర్థులు ప్రచారంలో నిమగ్నమయ్యారు. -
పెరిగిన పోలింగ్.. ఎవరికి లాభించేనో?
[ 18-05-2024]
లోక్సభ ఎన్నికల క్రతువు ఇటీవలే ముగిసింది. అందరి దృష్టి భువనగిరి లోక్సభ పైనే ఉంది. ఇక్కడ గతంలో కంటే పోలింగ్ శాతం పెరగడంతో ఇది ఎవరికి లాభిస్తుందనే విషయమై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. -
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు.. అందనున్న ప్రత్యేక సేవలు
[ 18-05-2024]
సాధారణ సేవలకు మాత్రమే పరిమితమైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పల్లెదవాఖానాల్లో అదనంగా ఏడు రకాల వైద్య సేవలను గ్రామీణ ప్రాంతాల వాసులకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. -
అమ్మ అంత్యక్రియలకు అడ్డంకిగా ఆస్తి
[ 18-05-2024]
అమ్మ అంత్యక్రియలకు ఆస్తి పంపకం అడ్డంకిగా మారిన ఉదంతమిది. కన్నతల్లి అంత్యక్రియలు తమ బాధ్యత అనే విషయాన్ని మరిచి ఆ కుటుంబ సభ్యులు రెండు రోజులుగా ఆస్తి పంపకం విషయమై గ్రామపెద్దలతో ఎడతెగని చర్చలు జరిపారు -
ఆ చేపల పులుసు..మనసులు గెలుచు
[ 18-05-2024]
-
ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం: బూర
[ 18-05-2024]
పార్లమెంట్ ఎన్నికల స్ఫూర్తితో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలు పనిచేయాలని భాజపా ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్, జిల్లా అధ్యక్షుడు పాశం భాస్కర్ కోరారు -
కలవరపెడుతున్న క్షయ
[ 18-05-2024]
క్షయ వ్యాధి కలవరపెడుతోంది. జిల్లాలో ప్రతి సంవత్సరం వ్యాధి బారినపడేవారు సంఖ్య పెరుగుతోంది. -
ఈసారైనా సీసీ లైనింగ్కు గ్రీన్సిగ్నల్ వచ్చేనా..?
[ 18-05-2024]
నల్గొండ జిల్లాలో 2.20 లక్షల ఎకరాలకు సాగు నీరందించే ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు(ఏఎంఆర్పీ) ప్రధాన కాల్వకు సిమెంటు కాంక్రీటు(సీసీ) లైనింగ్ చేసే పనులకు ఈ సారైనా ప్రభుత్వం పచ్చజెండా ఊపుతుందా..
తాజా వార్తలు (Latest News)
-
నిండు గర్భిణికి పురిటి నొప్పులు.. దారి లేక 6 కిలోమీటర్లు డోలీలోనే!
-
పేదింటి ఉత్తమ విద్యార్థులకు విమాన ప్రయాణం
-
విడాకుల్లో ఎవరి జోక్యం లేదు: గాయని సైంధవి
-
రద్దయిన క్రికెట్ మ్యాచ్కు టికెట్ల డబ్బు వాపసు
-
సవాల్ స్వీకరించి.. స్పందనగా ఆచరించి
-
కియా కార్లు అద్దెకూ తీసుకోవచ్చు.. హైదరాబాద్ సహా 6 నగరాల్లో