ప్రచారం కన్నా... సమీక్షలే మిన్నా..!
లోక్సభ ఎన్నికల ప్రచారానికి మరో ఏడు రోజులే గడువు ఉన్నా.. గతంతో పోలిస్తే క్షేత్రస్థాయిలో మాత్రం ప్రచారం ఊపందుకోలేదు.
ఫోన్ల ద్వారానే కీలక నాయకుల మద్దతు కోరుతున్న అభ్యర్థులు
ఈనాడు, నల్గొండ : లోక్సభ ఎన్నికల ప్రచారానికి మరో ఏడు రోజులే గడువు ఉన్నా.. గతంతో పోలిస్తే క్షేత్రస్థాయిలో మాత్రం ప్రచారం ఊపందుకోలేదు. భాజపా, సీపీఎం మాత్రమే గత కొన్ని రోజులుగా నల్గొండ, భువనగిరి లోక్సభ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం చేస్తుండగా.. మిగిలిన ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారం కంటే సమీక్షలు, వ్యూహ రచనలకే ప్రాధాన్యమిస్తున్నారు. రెండు లోక్సభ స్థానాల పరిధిలోని చాలా ప్రాంతాల్లో ఉదయం నుంచే ఎండలు మండిపోతుండటం, సగటున 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో అభ్యర్థులు సైతం ప్రచారానికి సుముఖత చూపించడం లేదు. ప్రధాన పార్టీల్లో ఆయా ముఖ్యనేతలు వచ్చినప్పుడు రాత్రి పూట ఏర్పాటు చేసే రోడ్షోలు, కార్నర్ సమావేశాల్లోనే ఎక్కువ మంది అభ్యర్థులు పాల్గొంటున్నారు. కొన్ని చోట్ల ఉదయపు నడక, అవసరం అనుకుంటే ఉదయం 9 గంటల వరకు ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గాలు, మండలాల వారీగా కార్యకర్తలతో పార్టీ అంతర్గత సర్వేలు, వివిధ మార్గాల ద్వారా సేకరించిన సమాచారంపై సమీక్షలు చేస్తూ ఎక్కడ బలహీనంగా ఉన్నామో అక్కడ ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. ఇతర పార్టీల్లో కీలకంగా ఉన్న ప్రజాప్రతినిధులు, మాజీలకు ఫోన్లు చేస్తూ తమకు మద్దతివ్వాలని కోరుతున్నారు. ప్రధాన పార్టీల అధిష్ఠానాలు సైతం ఉమ్మడి జిల్లాలోని నల్గొండ, భువనగిరి స్థానాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలియజేస్తూ లోపాలను అధిగమించేందుకు పరిష్కార మార్గాలు సూచిస్తున్నాయి.
ముఖ్య నాయకులతో గెలుపు వ్యూహాలు
రెండు స్థానాల్లో అధికార కాంగ్రెస్ ఒక వైపు మండలాల వారీగా విస్తృతస్థాయి సమావేశాలను నిర్వహిస్తూ మండల కేంద్రాల్లో రాత్రి రోడ్షోలు, కార్నర్ సమావేశాలను నిర్వహిస్తోంది. నల్గొండలో మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి భువనగిరి స్థానాల్లో పార్టీ అభ్యర్థులు కుందూరు రఘువీర్రెడ్డి, చామల కిరణ్కుమార్రెడ్డికి తోడుగా ప్రచారం చేస్తున్నారు. లోక్సభ పరిధి పెద్దది కావడం, అన్ని గ్రామాలకు వెళ్లలేని పరిస్థితి ఉండటంతో ఆయా ప్రాంతాల్లోని ముఖ్య నాయకులతో గెలుపు వ్యూహాలపై చర్చించి వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేలకే ఎక్కడికక్కడ సమన్వయ బాధ్యతలు అప్పగించారు. రెండింటిలోనూ ఏడు సెగ్మెంట్లకు గానూ ఆరుగురు ఎమ్మెల్యేల చొప్పన కాంగ్రెస్ వారే ఉండటంతో ఇది అధికార పార్టీకి అదనపు బలం కానుంది.
ఈ ఎన్నికల్లో రెండింటిలో కనీసం ఒకదాంట్లోనైనా గెలుపు తీరాలను చేరాలని భాజపా సర్వశక్తులు ఒడ్డుతోంది. రేపు (సోమవారం) భువనగిరి, నల్గొండలో జరిగే పార్టీ అభ్యర్థుల ప్రచారానికి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా రానున్నారు. నియోజకవర్గ కేంద్రాల్లో ఇప్పటికే పలు సమావేశాలు నిర్వహించిన నాయకులు, పోలింగ్ నాటికి మండలాల్లో కనీసం ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి వాటిలో అభ్యర్థులు పాల్గొనేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇద్దరు అభ్యర్థులు గతంలో భారాస నుంచి ప్రజాప్రతినిధులుగా గెలుపొందడంతో ఆ పార్టీ కీలక నాయకులు, కార్యకర్తలకు తమకు మద్దతునివ్వాలని కోరుతున్నట్లు తెలిసింది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో నైరాశ్యంలో ఉన్న భారాస ఇటీవల ఉమ్మడి జిల్లాలో నిర్వహించిన కేసీఆర్ బస్సుయాత్రతో కొంత జోష్ వచ్చింది. నల్గొండ, భువనగిరి రెండు స్థానాల్లోని అభ్యర్థులు కంచర్ల కృష్ణారెడ్డి, క్యామ మల్లేశ్ క్షేత్రస్థాయిలో కొన్ని ప్రాంతాల్లోనే ఇప్పటి వరకు ప్రచారం చేయడంతో మిగిలిన ప్రాంతాల్లోని నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా విస్తృతస్థాయి సమావేశాలు ఏర్పాటు చేసినా..క్షేత్రస్థాయిలో ముఖ్య నాయకులు మాజీ ఎమ్మెల్యేల వద్ద అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. దీంతో పరిస్థితిని చక్కదిద్దాలని పార్టీ అధిష్ఠానం మాజీ మంత్రి జగదీశ్రెడ్డిని ఆదేశించడంతో ఆయన శనివారం ఇద్దరు అభ్యర్థులతో పార్టీ ప్రచారం, ఇతర అంశాలపై చర్చలు జరిపినట్లు తెలిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కార్పొరేట్ వాకిటకు..సర్కారు సౌరభం
[ 18-05-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రభుత్వం కార్పొరేట్ విద్యకు సహకారం అందిస్తోంది. -
పరిశ్రమలు 900.. అధికారులు ఐదుగురు
[ 18-05-2024]
రసాయన, ఇతర పరిశ్రమల నుంచి వచ్చే ప్రమాదకర వ్యర్థాలను జాగ్రత్తగా నిర్వీర్యం చేయాలి. ఎక్కడ పడితే అక్కడ పారబోస్తే భూగర్భ జలాలు కలుషితం కావడంతో పాటు ప్రజలు వ్యాధుల బారిన పడే ప్రమాదం పొంచి ఉంది. -
ప్రముఖుల పల్లెల్లో..ప్రజాస్వామ్యం మురిసె
[ 18-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్లో ప్రముఖుల పల్లెల్లో ఓటు చైతన్యం వెల్లివిరిసింది. ఈ గ్రామాలకు చెందిన నేతలు ఎంపీలుగా, ఎమ్మెల్సీలుగా, ఎమ్మెల్యేలుగా సేవలు అందించడంతో పాటు ఇతర ముఖ్యులు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేవిధంగా పల్లెవాసులు వారిని ప్రోత్సహించారు. -
చలో.. నెల్లిబండ గట్టు జాతర
[ 18-05-2024]
వందల ఏళ్ల చరిత్ర.. రెండేళ్లకోసారి జాతర.. వేలాది మంది భక్తుల రాక.. ఉమ్మడి జిల్లాలో దురాజ్పల్లి పెద్దగట్టు తర్వాతి స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకున్న చిన్నగట్టు జాతరకు నెల్లిబండ ముస్తాబైంది. -
పట్టభద్రులకు పోల్ చిట్టీలు
[ 18-05-2024]
వరంగల్- ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు అధికారులు సన్నద్ధమయ్యారు. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో ప్రధాన పార్టీల తరఫున బరిలో ఉన్న అభ్యర్థులు ప్రచారంలో నిమగ్నమయ్యారు. -
పెరిగిన పోలింగ్.. ఎవరికి లాభించేనో?
[ 18-05-2024]
లోక్సభ ఎన్నికల క్రతువు ఇటీవలే ముగిసింది. అందరి దృష్టి భువనగిరి లోక్సభ పైనే ఉంది. ఇక్కడ గతంలో కంటే పోలింగ్ శాతం పెరగడంతో ఇది ఎవరికి లాభిస్తుందనే విషయమై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. -
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు.. అందనున్న ప్రత్యేక సేవలు
[ 18-05-2024]
సాధారణ సేవలకు మాత్రమే పరిమితమైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పల్లెదవాఖానాల్లో అదనంగా ఏడు రకాల వైద్య సేవలను గ్రామీణ ప్రాంతాల వాసులకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. -
అమ్మ అంత్యక్రియలకు అడ్డంకిగా ఆస్తి
[ 18-05-2024]
అమ్మ అంత్యక్రియలకు ఆస్తి పంపకం అడ్డంకిగా మారిన ఉదంతమిది. కన్నతల్లి అంత్యక్రియలు తమ బాధ్యత అనే విషయాన్ని మరిచి ఆ కుటుంబ సభ్యులు రెండు రోజులుగా ఆస్తి పంపకం విషయమై గ్రామపెద్దలతో ఎడతెగని చర్చలు జరిపారు -
ఆ చేపల పులుసు..మనసులు గెలుచు
[ 18-05-2024]
-
ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం: బూర
[ 18-05-2024]
పార్లమెంట్ ఎన్నికల స్ఫూర్తితో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలు పనిచేయాలని భాజపా ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్, జిల్లా అధ్యక్షుడు పాశం భాస్కర్ కోరారు -
కలవరపెడుతున్న క్షయ
[ 18-05-2024]
క్షయ వ్యాధి కలవరపెడుతోంది. జిల్లాలో ప్రతి సంవత్సరం వ్యాధి బారినపడేవారు సంఖ్య పెరుగుతోంది. -
ఈసారైనా సీసీ లైనింగ్కు గ్రీన్సిగ్నల్ వచ్చేనా..?
[ 18-05-2024]
నల్గొండ జిల్లాలో 2.20 లక్షల ఎకరాలకు సాగు నీరందించే ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు(ఏఎంఆర్పీ) ప్రధాన కాల్వకు సిమెంటు కాంక్రీటు(సీసీ) లైనింగ్ చేసే పనులకు ఈ సారైనా ప్రభుత్వం పచ్చజెండా ఊపుతుందా..
తాజా వార్తలు (Latest News)
-
నోటు తీసుకున్నోళ్లు బటన్ నొక్కలేదే!
-
పెళ్లికి నిరాకరించిందని పగ.. కాళ్లు పట్టుకున్నా కనికరించని కక్ష
-
10 నిమిషాలకో బస్సు.. మెట్రోలేని మార్గాల్లో నడిపేందుకు యోచన
-
శస్త్రచికిత్సలో అపశ్రుతి.. యువతి చనిపోయినా చెప్పకుండా దాచిన వైద్యులు
-
బెంబేలెత్తిస్తున్న ‘ఎస్బీఐ’ సందేశం
-
తెలంగాణ ఈఏపీ సెట్ ఫలితాలు నేడే