మాట తప్పితే రాజీనామా చేస్తావా..!
ప్రియమైన లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న అభ్యర్థికి సమస్కారం. ప్రజలకు సేవ చేయాలన్న లక్ష్యం.. నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలన్న తలంపు.
ప్రియమైన లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న అభ్యర్థికి సమస్కారం. ప్రజలకు సేవ చేయాలన్న లక్ష్యం.. నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలన్న తలంపు.. గ్రామాలు, పట్టణాల్లో మౌలిక వసతులు కల్పించాలన్న పట్టుదల.. నిరంతరం ప్రజల మధ్యన ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకోవాలన్న ఆలోచన.. ఇంకా.. ఎన్నో ఆలోచనలు, ఆశయాలతో పోటీ చేస్తున్నావు. నీ ఆస్తులు ప్రకటిస్తున్నావు.. అప్పులూ చెబుతున్నావు, కేసులూ వివరిస్తున్నావు.. ఎన్నికల సంఘం అడిగిన అన్నింటికీ తూ..చా.. తప్పక కట్టుబడి ఉంటానని హామీ పత్రం సమర్పిస్తున్నావు. ఇదంతా బాగానే ఉంది..
ప్రచారం పేరుతో.. సభలు, సమావేశాలు, రోడ్షోలు.. వీటిని అట్టహాసంగా నిర్వహించేందుకు డప్పులు, కళాకారులు, మందీమార్బలం, హంగు, ఆర్భాటం, వాటి కోసం లెక్కకు మించి ఖర్చు చేస్తున్నావ్.. పార్టీ టికెట్ కోసం మీ అధిష్ఠాన పెద్దల్ని ప్రసన్నం చేసుకోవడం మొదలు.. ‘కాసు’క్కూర్చున్న అసంతృప్తి నాయకుల్ని, ఎగస్పార్టీలోని నాయకుల్ని, చోటా, మోటా ప్రజాప్రతినిధుల్ని దారిలోకి తెచ్చుకున్నావ్. ఇక.. ప్రచారంలో పెద్ద నేతల్ని తీసుకువచ్చి కొత్త, కొత్త పథకాలు ప్రకటింపజేస్తున్నావ్. ఊరూరు, వాడవాడ తిరుగుతూ లెక్కకు మించిన, స్థోమతకు అందని హామీలిస్తున్నావ్, కుల సంఘాల్ని కూడగొడుతున్నావ్. మతాలను ఉపయోగించుకుంటున్నావ్. ఇతర పార్టీల కన్నా ఎక్కువ డబ్బులిచ్చి, మద్యమిచ్చి, కానుకలిచ్చి, ఏదడిగితే.. అదిచ్చి ఓటర్లను కొంటున్నవ్. దూరాన ఉన్న ఓటర్లకు ఖర్చులిచ్చి, వాహనాలు పెట్టి రప్పిస్తున్నావ్. ఓట్ల కోసం పడరాని పాట్లు పడుతున్నావ్. చేయరాని పనులు చేస్తున్నావ్.
ఇక గెలిచాక..
విజయోత్సవాల తరువాత కనిపించకుండా పోతున్నావ్. చోటా, మోటా నాయకులు కనిపించరు నీకు. ఓటర్లు అసలే కనిపించరు. ఊర్ల్లకు రావు. మా బాధలు పట్టించుకోవు. మౌలిక వసతుల మాట మరిచిపోతావ్. హామీలూ గుర్తుండవ్. ప్రాంతాలనూ పట్టించుకోవు. పథకాలు ప్రకటనలకే పరిమితమవుతాయి. నీ పైరవీలు, నీ కాంట్రాక్టులు, నీ పనులు, నీ మేలు, నీ ఆదాయమే నువ్ చూసుకుంటావ్.
ఇలా కాదు..
ఎన్నికల ప్రచారంలో కరపత్రాలు కాదు పంచాల్సింది. హామీలు అమలు చేయకపోతే.. మౌలిక సదుపాయాలు కల్పించకపోతే.. పథకాలు పక్కగా అమలు చేయకపోతే.. ప్రజలకు అందుబాటులో ఉండి వారి కష్టసుఖాల్లో తోడుండకపోతే.. నా పదవికి రాజీనామా చేస్తా. లేకపోతే ఓటింగ్ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ (రీకాల్) చేసి, పదవీచ్యూతుడ్ని చేయండని బాండ్ పేపర్లు రాసి ఓటర్లకు పంచు. నీకే ఓట్లేసి గెలిపిస్తాం..నీ అభిమాన ఓటరు
- న్యూస్టుడే, మోత్కూరు
సిరా గుర్తు వేసే వేలు లేకపోతే..?
పోలింగ్ రోజు ఓటరు ఓటేసినట్లు తెలిసేందుకు, అదే ఓటరు మళ్లీ ఓటు వేయకుండా ఉండేందుకు సిబ్బంది ఓటరు ఎడమ చేతి చూపుడు వేలికి సిరా గుర్తు పూస్తారు. ఈ సంగతి అందరికీ తెలిసిందే. కానీ.. ఓటరుకు ఎడమ చేతికి చూపుడు వేలు లేకపోతే ఏ వేలికి సిరా గుర్తు వేయాలో కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది. మధ్య వేలికి, అదీ లేకపోతే బొటన వేలికి, అసలు ఎడమ చేయే లేకపోతే కుడి చేతి చూపుడు వేలికి, అది లేకపోతే మధ్య వేలికి, ఆ తర్వాత ఉంగరం వేలికి సిరా గుర్తు వేస్తారు. ఒకవేళ ఓటరుకు రెండు చేతులూ లేకపోతే కాలి వేళ్లకు సిరా గుర్తు పూస్తారు.
- న్యూస్టుడే, నల్గొండ కలెక్టరేట్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పట్టభద్రులారా ఆలోచించి ఓటు వేయండి: కేటీఆర్
[ 19-05-2024]
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి రాకేశ్రెడ్డి విజయం కోసం కృషి చేయాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కోరారు. -
పెట్రోల్ బంక్లో లారీలో మంటలు
[ 19-05-2024]
భువనగిరిలోని ఓ పెట్రోల్ బంక్లో లారీలో మంటలు చెలరేగాయి. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం.. -
యాదాద్రి క్షేత్రానికి పోటెత్తిన భక్తులు.. ఉచిత దర్శనానికి 3 గంటల సమయం
[ 19-05-2024]
ఆదివారం సెలవు రోజు కావడంతో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. -
ప్రాదేశిక సమరంపై స్పష్టత కరవు
[ 19-05-2024]
జిల్లా, మండల పరిషత్తుల ప్రాదేశిక నియోజకవర్గాల ఎన్నికలు గడువులోపు అయ్యే అవకాశం కనిపించడం లేదు. ఫలితంగా గ్రామ పంచాయతీలకు నియమించిన మాదిరిగానే జిల్లా, మండల పరిషత్తులకు ప్రత్యేకపాలన అధికారులను నియమించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. -
పీడీఎస్ బియ్యం వ్యవహారంలో తొమ్మిది మందిపై కేసు నమోదు
[ 19-05-2024]
పెద్దవూర సమీపంలో పీడీఎస్ బియ్యం దందా వ్యవహారంలో తొమ్మిది మందిపై కేసు నమోదు చేసినట్లు పెద్దవూర ఎస్ఐ వీరబాబు తెలిపారు. వీరిలో నలుగురిని అరెస్టు చేసినట్లు, మిగతా వారు పరారీలో ఉన్నారని శనివారం రాత్రి పత్రికా ప్రకటనలో పోలీసులు వెల్లడించారు. -
ఆరు నెలల్లో సూపర్స్పెషాలిటీ వైద్యసేవలు
[ 19-05-2024]
జిల్లా కేంద్రంలోని జనరల్ ఆసుపత్రి స్థాయి మరింత పెరగనుంది. ఎస్సెల్బీసీ ప్రాంతంలో రూ.120 కోట్లతో 37 ఎకరాల్లో నిర్మిస్తున్న వైద్యకళాశాల పనులు సెప్టెంబరు లోపు పూర్తవుతాయని టీఎస్ఎంఐడీసీ అధికారులు చెబుతున్నారు. -
బడి.. పూర్వపు ఒరవడి!
[ 19-05-2024]
సీఎం ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లాలోని పలు గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలు తిరిగి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 203 చోట్ల పాఠశాలలు ప్రారంభించాలని నిర్ణయించగా.. అత్యధికంగా నల్గొండ జిల్లాలో 24, భువనగిరి, సూర్యాపేట జిల్లాలో పలు గ్రామాల్లో పాఠశాలలు ప్రారంభించనున్నారు. -
వనమాల.. బ్యాడ్మింటన్లో భళా!
[ 19-05-2024]
మిర్యాలగూడ పట్టణానికి చెందిన వనమాల శ్రీకాంత్- భవానీల కుమారుడు శశాంక్ చిన్నతనం నుంచి బ్యాడ్మింటన్లో అద్భుత ప్రతిభ కనబరచడంతో శిక్షకుడు మారబోయిన రామకృష్ణ సూచన మేరకు హైదరాబాద్లో ప్రతిష్ఠాత్మక గోపిచంద్ అకాడమీలో చేర్పించారు. -
‘అద్విత’ంగా ప్రతిభ చూపి..!
[ 19-05-2024]
మిర్యాలగూడ పట్టణానికి చెందిన బిక్కుమళ్ల అద్విత్ కృష్ణ ఈఏపీసెట్ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో 275 ర్యాంకు సాధించాడు. పట్టణంలోని కేఎల్ఎన్ జూనియర్ కళాశాల కరస్పాండెంట్ బిక్కుమళ్ల కిరణ్కుమార్, శైలజ దంపతుల కుమారుడు అద్విత్ కృష్ణ స్థానికంగా కళాశాలలో ఇంటర్ బైపీసీ 958 మార్కులతో పూర్తిచేశాడు. -
ఈతకు వెళ్లిన బాలుడి గల్లంతు
[ 19-05-2024]
నీటి ప్రమాదాలు జరిగినప్పుడు మరణించొద్దనే ఆలోచనతో తండ్రి తన పిల్లలకు మూడు రోజులుగా ఈత నేర్పిస్తున్నాడు. ఈత వచ్చిందనే సంతోషంలో తండ్రికి తెలియకుండా మళ్లీ బావిలోకి దూకిన బాలుడు గల్లంతైన ఘటన శనివారం సాయంత్రం తిరుమలగిరిలో జరిగింది. -
పంచనారసింహులకు భక్తుల మొక్కు పూజలు
[ 19-05-2024]
పంచనారసింహులు కొలువై ఉన్న యాదాద్రి పుణ్యక్షేత్రంలో శనివారం భక్త జనుల ఆరాధనలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. సుప్రభాతం నిర్వహించిన పూజారులను బిందెతీర్థంతో చేపట్టిన కైంకర్యాలు ఆలయ విశిష్టతకు అనుగుణంగా కొనసాగాయి. -
కొత్తగా 24 ప్రాథమిక పాఠశాలలు
[ 19-05-2024]
ప్రభుత్వ పాఠశాలలు లేని గ్రామపంచాయతీల్లో నూతనంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం కార్యరూపం దాల్చనుంది. జిల్లా వ్యాప్తంగా 421 గ్రామపంచాయతీలు ఉండగా 24 గ్రామపంచాయతీల పరిధిలో ప్రభుత్వ పాఠశాలలు లేనట్లు అధికారులు ప్రభుత్వానికి నివేదించారు.
తాజా వార్తలు (Latest News)
-
పట్టభద్రులారా ఆలోచించి ఓటు వేయండి: కేటీఆర్
-
ఎంపీగా గెలిస్తే.. బాలీవుడ్ను వీడుతారా? కంగనా ఏం చెప్పారంటే..
-
పంచన్ లామా ఎక్కడ: చైనాను మరోసారి అడిగిన అమెరికా
-
తిరుపతి జిల్లాలో పలుచోట్ల ‘సిట్’ విచారణ.. పలు విషయాలపై ఆరా!
-
అప్పుడు.. ఒక్కసారి కూడా స్కోరు బోర్డు చూడలేదు: యశ్ దయాళ్
-
సీసీ ఫుటేజీని, సాక్ష్యాలను బిభవ్ ధ్వంసం చేసుండొచ్చు: దిల్లీ పోలీసులు