logo

ఓటుహక్కుపై అవగాహన పెరిగేలా ప్రచారం

లోక్‌సభ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతూ చిట్యాల సమీపంలోని గాంధీగుడి ఆధ్వర్యంలో నల్గొండలో ప్రచారం నిర్వహించారు.

Published : 07 May 2024 07:00 IST

ఈనాడు, నల్గొండ: లోక్‌సభ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతూ చిట్యాల సమీపంలోని గాంధీగుడి ఆధ్వర్యంలో నల్గొండలో ప్రచారం నిర్వహించారు. ఓటు హక్కు గురించి కొటేషన్లతో ఆటోకు కట్టుకొని ప్రచారం నిర్వహిస్తున్నారు. నోటుకు ఓటు - అభివృద్ధికి చేటు..,  కుల మతాలకు అతీతంగా ప్రగతి కోసం ఓటేద్దాం.., మేధావులు మౌనంగా ఉంటే మూర్ఖులు రాజ్యమేలుతారు... అనే సూక్తులతో నిర్వహిస్తున్న ప్రచారం ప్రజలను ఆకట్టుకుంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని