సమీక్షిస్తూ.. సౌకర్యాలు ఆరా తీస్తూ..!
ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా గరిష్ఠంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో.. లోక్సభ ఎన్నికల్లో నల్గొండ, భువనగిరి స్థానాల్లో పోలింగ్ శాతాన్ని గణనీయంగా పెంచడానికి నల్గొండ, భువనగిరి అధికార యంత్రాంగాలు తీవ్ర కసరత్తు చేస్తున్నాయి.
లోకసభ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేలా యంత్రాంగం చర్యలు
ఈనాడు, నల్గొండ
ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా గరిష్ఠంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో.. లోక్సభ ఎన్నికల్లో నల్గొండ, భువనగిరి స్థానాల్లో పోలింగ్ శాతాన్ని గణనీయంగా పెంచడానికి నల్గొండ, భువనగిరి అధికార యంత్రాంగాలు తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 80 శాతానికి పైగా పోలింగ్ శాతం నమోదైనా 2019 లోక్సభ ఎన్నికల్లో మాత్రం చాలా చోట్ల 70 శాతమే నమోదు అయింది. ప్రస్తుతం ఇలాంటివి జరగకుండా అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే అన్ని సెగ్మెంట్లలో 80 శాతానికి పైగా పోలింగ్ నమోదు కావడానికి చర్యలు తీసుకుంటున్నారు. గత కొన్నాళ్లుగా రాష్ట్రంలోనే అత్యధికంగా నల్గొండ జిల్లాలో సగటున 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 వరకు ఎవరూ బయటకు రావడం లేదు. ఈ ప్రభావం రానున్న ఎన్నికల్లో ఉండకుండా ప్రతి పోలింగ్ కేంద్రంలో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. వీటిని నల్గొండ, భువనగిరి ఆర్వోలు దాసరి హరిచందన, హనుమంతు కే.జెండగేలు నిత్యం పర్యవేక్షిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన సాధారణ పరిశీలకులు సైతం పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లపై క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఒకవైపు ఓటు చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తూనే యంత్రాంగం తరఫున ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపైనా పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. 2019 ఎన్నికల్లో నల్గొండ లోకసభలో 74.07 శాతం పోలింగ్ నమోదు కాగా..భువనగిరిలో 74.39 శాతం పోలింగ్ శాతం నమోదయింది. ఈ దఫా దీనిని కనీసం 7 నుంచి 9 శాతం వరకు పెంచేలా అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు.
కేంద్రాల వారీగా పరిశీలన..
తొలుత ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకే ఉన్న పోలింగ్ సమయాన్ని రాజకీయ పార్టీల వినతితో కేంద్ర ఎన్నికల సంఘం సాయంత్రం 6 వరకు పొడిగించింది. దీంతో ఈ దఫా గత ఎన్నికలతో పోలిస్తే పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ ఉండటం లేదని అధికారులు భావిస్తున్నారు. ఉదాహరణకు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో దేవరకొండలో 86.25 శాతం పోలింగ్ నమోదు కాగా.. 2019 లోక్సభ ఎన్నికల్లో మాత్రం అది 68.77 శాతానికే పరిమితమైంది. ఇలాంటివి పునరావృతం కాకుండా ఇప్పటి నుంచే అధికారులు చర్యలు చేపట్టారు. మరోవైపు రెండు లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాల వారీగా సౌకర్యాలపై ఆర్వోలు ఆరా తీసి స్వయంగా పరిశీలన చేస్తున్నారు. నల్గొండలో 2060 పోలింగ్ కేంద్రాలుండగా..భువనగిరిలో 2141 ఉన్నాయి. వీటిలో సుమారు 15 శాతానికి పైగా మారుమూల ప్రాంతాల్లో ఉండటంతో అందులో ఎండ వేడిమిని నియంత్రించే విధంగా సౌకర్యాలు లేవని గుర్తించారు. దీంతో ప్రతి కేంద్రంలో ప్రత్యేక వైద్య శిబిరాలతో పాటూ మెడికల్ కిట్లు, ఎండ తీవ్రత నుంచి ఉపశమన కలిగించే విధంగా షామియానాలు, మంచినీళ్లు అందుబాటులో ఉంచాలని ఇప్పటికే ఆదేశించారు. వృద్ధులు, వికలాంగుల కోసం ప్రత్యేకంగా వాలంటీర్లను ఏర్పాటు చేశారు. ఎక్కువగా గ్రౌండ్ ఫ్లోర్లలో ఉన్న గదుల్లోనే పోలింగ్ కేంద్రాలు ఉండేలా చర్యలు తీసుకుంటున్న అధికారులు.. ఒక వేళ మొదటి అంతస్తులో ఉంటే ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నారు. పోలింగ్ సిబ్బందికి గది లోపల ఫ్యాన్లు, కూలర్లను సైతం ఏర్పాటు చేయాలని ఇప్పటికే ఆర్వో ఆదేశించడంతో క్షేత్రస్థాయి సిబ్బంది ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి కేంద్రం పరిస్థితిని స్వయంగా పరిశీలించి తనకు రిపోర్టు ఇవ్వాలని నల్గొండ ఆర్వో దాసరి హరిచందన ఆదేశించడంతో క్షేత్రస్థాయిలోని అధికారులు, సిబ్బంది సౌకర్యాలపై ఆరా తీసి ఇంకా ఏం సౌకర్యాలు కావాలో ఉన్నతాధికారులకు నివేదిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాదేశిక సమరంపై స్పష్టత కరవు
[ 19-05-2024]
జిల్లా, మండల పరిషత్తుల ప్రాదేశిక నియోజకవర్గాల ఎన్నికలు గడువులోపు అయ్యే అవకాశం కనిపించడం లేదు. ఫలితంగా గ్రామ పంచాయతీలకు నియమించిన మాదిరిగానే జిల్లా, మండల పరిషత్తులకు ప్రత్యేకపాలన అధికారులను నియమించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. -
పీడీఎస్ బియ్యం వ్యవహారంలో తొమ్మిది మందిపై కేసు నమోదు
[ 19-05-2024]
పెద్దవూర సమీపంలో పీడీఎస్ బియ్యం దందా వ్యవహారంలో తొమ్మిది మందిపై కేసు నమోదు చేసినట్లు పెద్దవూర ఎస్ఐ వీరబాబు తెలిపారు. వీరిలో నలుగురిని అరెస్టు చేసినట్లు, మిగతా వారు పరారీలో ఉన్నారని శనివారం రాత్రి పత్రికా ప్రకటనలో పోలీసులు వెల్లడించారు. -
ఆరు నెలల్లో సూపర్స్పెషాలిటీ వైద్యసేవలు
[ 19-05-2024]
జిల్లా కేంద్రంలోని జనరల్ ఆసుపత్రి స్థాయి మరింత పెరగనుంది. ఎస్సెల్బీసీ ప్రాంతంలో రూ.120 కోట్లతో 37 ఎకరాల్లో నిర్మిస్తున్న వైద్యకళాశాల పనులు సెప్టెంబరు లోపు పూర్తవుతాయని టీఎస్ఎంఐడీసీ అధికారులు చెబుతున్నారు. -
బడి.. పూర్వపు ఒరవడి!
[ 19-05-2024]
సీఎం ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లాలోని పలు గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలు తిరిగి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 203 చోట్ల పాఠశాలలు ప్రారంభించాలని నిర్ణయించగా.. అత్యధికంగా నల్గొండ జిల్లాలో 24, భువనగిరి, సూర్యాపేట జిల్లాలో పలు గ్రామాల్లో పాఠశాలలు ప్రారంభించనున్నారు. -
వనమాల.. బ్యాడ్మింటన్లో భళా!
[ 19-05-2024]
మిర్యాలగూడ పట్టణానికి చెందిన వనమాల శ్రీకాంత్- భవానీల కుమారుడు శశాంక్ చిన్నతనం నుంచి బ్యాడ్మింటన్లో అద్భుత ప్రతిభ కనబరచడంతో శిక్షకుడు మారబోయిన రామకృష్ణ సూచన మేరకు హైదరాబాద్లో ప్రతిష్ఠాత్మక గోపిచంద్ అకాడమీలో చేర్పించారు. -
‘అద్విత’ంగా ప్రతిభ చూపి..!
[ 19-05-2024]
మిర్యాలగూడ పట్టణానికి చెందిన బిక్కుమళ్ల అద్విత్ కృష్ణ ఈఏపీసెట్ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో 275 ర్యాంకు సాధించాడు. పట్టణంలోని కేఎల్ఎన్ జూనియర్ కళాశాల కరస్పాండెంట్ బిక్కుమళ్ల కిరణ్కుమార్, శైలజ దంపతుల కుమారుడు అద్విత్ కృష్ణ స్థానికంగా కళాశాలలో ఇంటర్ బైపీసీ 958 మార్కులతో పూర్తిచేశాడు. -
ఈతకు వెళ్లిన బాలుడి గల్లంతు
[ 19-05-2024]
నీటి ప్రమాదాలు జరిగినప్పుడు మరణించొద్దనే ఆలోచనతో తండ్రి తన పిల్లలకు మూడు రోజులుగా ఈత నేర్పిస్తున్నాడు. ఈత వచ్చిందనే సంతోషంలో తండ్రికి తెలియకుండా మళ్లీ బావిలోకి దూకిన బాలుడు గల్లంతైన ఘటన శనివారం సాయంత్రం తిరుమలగిరిలో జరిగింది. -
పంచనారసింహులకు భక్తుల మొక్కు పూజలు
[ 19-05-2024]
పంచనారసింహులు కొలువై ఉన్న యాదాద్రి పుణ్యక్షేత్రంలో శనివారం భక్త జనుల ఆరాధనలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. సుప్రభాతం నిర్వహించిన పూజారులను బిందెతీర్థంతో చేపట్టిన కైంకర్యాలు ఆలయ విశిష్టతకు అనుగుణంగా కొనసాగాయి. -
కొత్తగా 24 ప్రాథమిక పాఠశాలలు
[ 19-05-2024]
ప్రభుత్వ పాఠశాలలు లేని గ్రామపంచాయతీల్లో నూతనంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం కార్యరూపం దాల్చనుంది. జిల్లా వ్యాప్తంగా 421 గ్రామపంచాయతీలు ఉండగా 24 గ్రామపంచాయతీల పరిధిలో ప్రభుత్వ పాఠశాలలు లేనట్లు అధికారులు ప్రభుత్వానికి నివేదించారు.
తాజా వార్తలు (Latest News)
-
యాదాద్రి క్షేత్రానికి పోటెత్తిన భక్తులు.. ఉచిత దర్శనానికి 3 గంటల సమయం
-
మలుపు తిప్పిన రనౌట్.. డుప్లీ సూపర్ క్యాచ్.. యశ్ లాస్ట్ ఓవర్ వీడియోలు వైరల్!
-
నరసరావుపేటలో ‘సిట్’ దర్యాప్తు.. హింసాత్మక ఘటనలపై ఆరా
-
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో మంటలు.. బెంగళూరులో ఎమర్జెన్సీ ల్యాండింగ్
-
15 శాతం స్థానికేతర కోటా యథాతథం
-
ట్రంప్నకు జాతీయ రైఫిల్ అసోసియేషన్ మద్దతు..!