logo

హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి

భువనగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్స్ లో  పార్లమెంటు  కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి  మార్నింగ్ వాకర్స్‌ను కలిసి మాట్లాడారు.

Updated : 08 May 2024 10:41 IST

భువనగిరి: భువనగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్స్ లో  పార్లమెంటు  కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి  మార్నింగ్ వాకర్స్‌ను కలిసి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ పథకాలను ఓటర్లకు వివరించారు. ఈ నెల 13న జరిగే లోక్‌సభ  ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటు వేసి తనను  గెలిపించాలని కోరారు. టిఫిన్ సెంటర్స్,  టీ స్టాల్స్, చికెన్ సెంటర్స్,  కూరగాయల వ్యాపారులతోనూ మాట్లాడారు. ఆయన వెంట  మున్సిపల్ ఛైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు , నియోజకవర్గ కోఆర్డినేటర్ శిరీష్ రెడ్డి, టీపీసీసీ సభ్యుడు తంగెనపల్లి రవికుమార్, టీపీసీసీ జనరల్ సెక్రటరీ పోత్నక్ ప్రమోద్ కుమార్, కుంభం కీర్తి రెడ్డి, నియోజకవర్గ సేవాదళ్ నాయకులు, సీనియర్ నాయకులు  ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని