నిగ్గుతేలిన అక్రమాలు
పెరంకొండ అక్రమాల లెక్క తేలింది. ముంపు పరిహారం పేరిట రూ. కోట్లు కాజేసిన వారి చిట్టా బయటకు వచ్చింది. ప్రభుత్వ సొమ్ము అప్పనంగా కాజేసిన వారితో పాటు.. అందుకు సహకరించిన అధికారుల పాత్ర విచారణలో నిగ్గు తేలింది.
పెరంకొండలో రూ.29.70 కోట్లు స్వాహా చేసినట్లు నిర్ధారణ
కలెక్టర్కు చేరిన తుది నివేదిక
పెరంకొండ గ్రామం
ఈనాడు డిజిటల్, నెల్లూరు ;-పెరంకొండ అక్రమాల లెక్క తేలింది. ముంపు పరిహారం పేరిట రూ. కోట్లు కాజేసిన వారి చిట్టా బయటకు వచ్చింది. ప్రభుత్వ సొమ్ము అప్పనంగా కాజేసిన వారితో పాటు.. అందుకు సహకరించిన అధికారుల పాత్ర విచారణలో నిగ్గు తేలింది. దీనిపై సమగ్ర నివేదికను సిద్ధం చేసిన జేసీ కూర్మనాథ్.. కలెక్టర్కు అందించినట్లు సమాచారం. రూ. 29.70 కోట్ల ప్రభుత్వ సొమ్ము స్వాహా చేసిన వారిపై చర్యలకు మార్గం సుగమమైంది.
అసలేం జరిగిందంటే?
సుమారు 30 ఏళ్ల కిందట కండలేరు జలాశయం నిర్మాణ సమయంలో ప్రభుత్వం 24 గ్రామాలకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీతో పాటు.. నిర్మాణాలకు పరిహారం చెల్లించింది. దాంతో ఆ గ్రామాలు.. అక్కడి మరో ప్రాంతానికి వెళ్లాయి. పెరంకొండ గ్రామం ముంపునకు గురవుతోందని మళ్లీ ప్రతిపాదనలు పెట్టడంతో.. మూడేళ్ల కిందట రూ. 60 కోట్ల పరిహారం చెల్లించారు. ఇందులో అవకతవకలు జరిగాయని.. అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులు అందాయి. స్పందనలో కొందరు అర్జీలు ఇచ్చారు. పెరంకొండ ముంపు గ్రామం కాకపోయినా.. పరిహారం తీసుకున్నారని ఉన్నతాధికారులకు వివరించారు.
జేసీ కూర్మనాథ్ పర్యవేక్షణలో..
దాంతో జేసీ కూర్మనాథ్ ప్రత్యేక దృష్టిపెట్టారు. ఫిర్యాదు ఆధారంగా రికార్డులు పరిశీలించారు. ఆర్అండ్బీ, సర్వే, రెవెన్యూ అధికారుల బృందాన్ని నియమించారు. రెండున్నర నెలలు విచారణ జరిపి.. సమగ్ర వివరాలు సేకరించారు. పాత భవనాలు, పూరిపాకలకు డబ్బు చెల్లించడంతో పాటు.. ఖాళీ స్థలాల్లో ఇళ్లు ఉన్నట్లు, అప్పటికప్పుడు వేసిన రేకుల షెడ్లకు రూ. లక్షలు ఇచ్చినట్లు తేల్చారు. క్షేత్రస్థాయిలోని పరిస్థితులను బట్టి మొత్తం రూ. 26 కోట్లు చెల్లించాల్సి ఉండగా.. సుమారు రూ. 56 కోట్లు ఇచ్చినట్లు అధికారులు నిర్ధారించారు. అంటే.. రూ. 29.70 కోట్లు అక్రమార్కుల జేబుల్లోకి వెళ్లాయి.
11 మంది అధికారుల పాత్ర
ప్రభుత్వ సొమ్ము కాజేసేందుకు కొందరు ప్రైవేటు వ్యక్తులు ప్రణాళిక రచిస్తే.. అందుకు 11 మంది అధికారులు సహకరించినట్లు తేల్చారు. వారిలో తెలుగుగంగ ప్రాజెక్టు భూసేకరణ విభాగం, ఇంజినీరింగ్ విభాగంలో పనిచేసే నలుగురు అధికారులు ఉండగా- ఒకరు ఉద్యోగ విరమణ చేశారు. మిగిలిన ముగ్గురిలో.. ఇద్దరు ప్రస్తుతం వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నత పదవుల్లో ఉన్నట్లు తెలిసింది. మరో నలుగురు తహసీల్దార్లు, రెవెన్యూ అధికారుల పాత్ర ఉన్నట్లు తెలిసింది. ఈ కుంభకోణంలో భాగస్వాములైన అధికారులు.. ప్రస్తుతం జిల్లాలోని వివిధ మండలాల్లో పని చేస్తున్నారు. వీరంతా పథకం ప్రకారం.. ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ సొమ్మును పక్కదారి పట్టించినట్లు గుర్తించారు. క్రిమినల్ కేసులు పెట్టే అవకాశం ఉండటంతో సదరు అధికారులు వణికిపోతున్నారు. కొందరు తమను కాపాడండి అంటూ ప్రజాప్రతినిధులను ప్రసన్నం చేసుకుంటున్నారు.
*దీనిపై జేసీ కూర్మనాథ్ వివరణ కోరగా.. విచారణ పూర్తయిందన్నారు. తుది నివేదికను కలెక్టర్కు అందజేస్తామని, అనంతరం తప్పు చేసిన వారిపై తగు చర్యలు తీసుకుంటామన్నారు.
ఈ సారైనా చర్యలు తీసుకునేనా?
జిల్లాలో పనిచేస్తున్న కొందరు అధికారులు తప్పు చేయడం.. ఆ తర్వాత ప్రజాప్రతినిధులను పట్టుకుని మళ్లీ పోస్టింగ్లు తెచ్చుకోవడం పరిపాటిగా మారింది. చౌటపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయరు పరిధిలో అటవీ భూములకు ప్రైవేటు వ్యక్తుల పేర్లపై రికార్డులు సృష్టించి.. రూ. 1.43 కోట్లు పరిహారం పొందారు. దానిపై ఆర్డీవో విచారణ జరిపి.. నిజమని తేల్చడంతో పాటు క్రిమినల్ కేసు పెట్టాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది జరిగి నాలుగు నెలలు గడిచినా ఇప్పటికీ చర్యలు తీసుకోలేదు. సస్పెండ్ అయిన తహసీల్దారుల్లో ఒకరు అదే స్థానంలో పోస్టింగ్ తెచ్చుకున్నారు. వీరికి జిల్లాలోని ఓ ప్రజాప్రతినిధి అండదండలు ఉన్నట్లు సమాచారం. దాంతో మిగిలిన వారిపైనా విచారణ సాగుతూనే ఉంది. అక్రమం జరిగిందని, ఉన్నతాధికారులు తేల్చిన విషయాల్లో చర్యలు తీసుకోవడంలో ఉదాసీనతపై ప్రజలు పెదవి విరుస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటే.. భవిష్యత్తులో ఈ తరహా అక్రమాలు పునరావృతం కావని అధికార వర్గాల్లో చర్చ నడుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొండయ్య.. లెక్కే వేరు
[ 26-04-2024]
ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసేవారిలో ఎక్కువ మంది రాజకీయ, ఆర్థిక, సామాజిక బలాలున్న వారే ఉంటున్నారు. కొందరు పార్టీల తరఫున ఇంకొందరు ప్రధాన పార్టీల అభ్యర్థులకు అనుకూలంగా వ్యవహరించటానికి స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేయటం సాధారణం. -
రేపు జిల్లాలో చంద్రబాబు పర్యటన
[ 26-04-2024]
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 27వ తేదీ జిల్లాలో పర్యటించనున్నారు. ఆ రోజు ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాళెంలలో నిర్వహించే ప్రజాగళం సభల్లో పాల్గొంటారు. -
యాడుంది శిక్షణ.. అయిదేళ్లూ వంచన
[ 26-04-2024]
అక్కాచెల్లెమ్మలను ఆర్థికంగా ప్రోత్సహించి, అన్ని విధాలా అండగా ఉంటానన్న సీఎం జగన్ మాటలు.. ప్రకటనలకే పరిమితమయ్యాయి. సంక్షేమ పథకాలు అటుంచి.. వారికి నైపుణ్య శిక్షణ ఇచ్చి.. నిలదొక్కుకునేలా చూడటంలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. -
సోమశిలలో అడుగంటిన జలం
[ 26-04-2024]
జిల్లా వరదాయిని సోమశిల జలాశయంలో నీటి నిల్వలు రోజు రోజుకూ అడుగంటుతున్నాయి. భవిష్యత్తు అవసరాలు దృష్టిలో పెట్టుకోకుండా అధికారులు తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు.. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో ప్రధాన ఘట్టమైన నామినేషన్ల పర్వం గురువారంతో ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు 230 మంది 283 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. -
దోచుకున్నది.. వైకాపా ఘనులే!
[ 26-04-2024]
మొదట్లో గ్రావెల్, మట్టి కొల్లగొడుతూ విపక్ష నేతలపై నెట్టేందుకు యత్నించిన అధికార పార్టీ నాయకులు.. క్వార్ట్జ్ వ్యవహారంలోనూ అదే పద్ధతిని అవలంబించారు. తొలుత వాటాలు తేలక వారిలో వారే తిట్టుకున్న జిల్లా నాయకులు.. పార్టీ అధిష్ఠానం జోక్యంతో హద్దులు నిర్ణయించుకుని దోపిడీకి తెగబడ్డారు. -
లక్ష్యంపై గురి.. ర్యాంకుల సిరి
[ 26-04-2024]
కసితో చదివారు.. కుటుంబ నేపథ్యం ఏదైనా కలల సాధనకు తపించారు. లక్ష్యాన్ని సాధించి తల్లిదండ్రుల మోములో ఆనందం నింపారు. జాతీయ స్థాయిలో జేఈఈ మెయిన్స్ రెండో విడత ఫలితాలు గురువారం విడుదల చేశారు. -
చెన్నకేశవుడి వైభవం
[ 26-04-2024]
స్థానిక యర్రబల్లిపాలెం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలలో ముఖ్యమైన రథోత్సవం గురువారం కనులపండువగా సాగింది.. -
వేణుగోపాలుడి రథోత్సవం
[ 26-04-2024]
శ్రీ వేణుగోపాలస్వామి దేవస్థానంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం స్వామివారికి రథోత్సవం జరిగింది. -
మద్యం డంపుల సూత్రధారి కాకాణే : సోమిరెడ్డి
[ 26-04-2024]
సర్వేపల్లి నియోజకవర్గంలో లభ్యమవుతున్న మద్యం డంపుల్లో పాత్రదారులు వైకాపా నాయకులైతే.. సూత్రధారి మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డేనని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఆరోపించారు. -
కోట్ల వ్యయం.. నిరుపయోగం
[ 26-04-2024]
ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంలో అప్పటి ఆర్థికమంత్రి ఆనం రామనారాయణరెడ్డి వైద్య విద్యార్థుల విద్యాభ్యాసంలో భాగంగా గ్రామీణ ప్రాంతంలో శిక్షణ పొందేందుకు ఏర్పాటు చేసిన శిక్షణ కేంద్రం నిరుపయోగంగా మారింది. -
జగన్మాయ.. వైద్యం అందదయా!
[ 26-04-2024]
ఆసుపత్రులను అన్ని సౌకర్యాలతో తీర్చిదిద్ది పేదలకు మెరుగైన వైద్యం అందిస్తామన్న ముఖ్యమంత్రి జగన్ మాటలు ఆచరణలో కనిపించడం లేదు. అత్యవసర సమయాల్లో వైద్యానికి వెళితే చేయి చూసే నాథుడు ఉండడం లేదు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం