logo

తెదేపాతోనే మాదిగల అభ్యున్నతి

మాదిగల అభ్యున్నతి తెదేపాతోనే సాధ్యమని ఆ పార్టీ నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం నగరంలోని మహేశ్వరి, పరమేశ్వరి కల్యాణ మండపంలో సీమాంధ్ర ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో మాదిగల ఆత్మీయ సమ్మేళనం జరిగింది.

Updated : 05 May 2024 05:16 IST

మాట్లాడుతున్న తెదేపా ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి

నెల్లూరు(విద్య), న్యూస్‌టుడే : మాదిగల అభ్యున్నతి తెదేపాతోనే సాధ్యమని ఆ పార్టీ నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం నగరంలోని మహేశ్వరి, పరమేశ్వరి కల్యాణ మండపంలో సీమాంధ్ర ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో మాదిగల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఆయన మాట్లాడుతూ గతంలో తెదేపా ప్రభుత్వం మాదిగల అభ్యున్నతికి నెడ్‌క్యాప్‌ ద్వారా పరిశ్రమలు ఏర్పాటు చేసి వారి కులవృత్తికి ఆదాయ వనరులు చూపించి ఆదుకుందని తెలిపారు. పథకాల్ని వైకాపా ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. మళ్లీ తెదేపా ప్రభుత్వం రానుందని పరిశ్రమలు తెరిపించి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించనుందని హామీ ఇచ్చారు. రానున్న రోజుల్లో మాదిగలు ఆర్థికంగా బల పడేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించనున్నట్లు పేర్కొన్నారు. నెల్లూరు గ్రామీణ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ మాదిగల అభ్యున్నతికి ఎంతో కృషిచేశానని.. మరింతగా తోడ్పాటునిస్తానని తెలిపారు. కార్యక్రమంలో సీమాంధ్ర ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకులు పందింటి సుబ్బయ్య, కాకి శ్రీనివాసులు, మాతంగి కృష్ణ, ప్రసాద్‌రావు, భాజపా  నాయకుడు బర్రె శ్రీనివాసులు, పలిగిరి చిన్నయ్య, సాల్మన్‌, పలువురు ఎమ్మార్పీఎస్‌, మాదిగ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు