మంచి పేరున.. ముంచిన జగన్
తెదేపా ప్రభుత్వ హయాంలో అంగన్వాడీ కార్యకర్తలకు నెలకు రూ. 10,500, ఆయాలు, మినీ కేంద్రాల కార్యకర్తలకు రూ. 7,500 చెల్లించారు.
పథకాల లబ్ధి అందని వైనం
అంగన్వాడీ సిబ్బంది ఆవేదన
వంటావార్పుతో అంగన్వాడీల నిరసన (పాతచిత్రం)
తెదేపా ప్రభుత్వ హయాంలో అంగన్వాడీ కార్యకర్తలకు నెలకు రూ. 10,500, ఆయాలు, మినీ కేంద్రాల కార్యకర్తలకు రూ. 7,500 చెల్లించారు. 2019 ఎన్నికల సమయంలో తెలంగాణలో కంటే రూ. వెయ్యి అదనంగా ఇస్తానని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన తరువాత తొలి ఏడాదిలో మాత్రమే రూ. వెయ్యి పెంచి చేతులు దులుపుకొన్నారు. ప్రస్తుతం తెలంగాణలో రూ. 13,500 ఇస్తున్నారు.
‘మీ అన్నొస్తాడు... మీకు మంచే చేస్తాడు’ అంటూ అంగన్వాడీ కార్యకర్తలకు సీఎం జగన్ గతంలో భరోసా ఇచ్చారు. ఆపై వారిని నిండా ముంచారు. జీతభత్యాలు మెరుగ్గా ఉన్నాయంటూ అప్పటి వరకు ఉన్న సంక్షేమ పథకాల వర్తింపును నిలిపేశారు. ఎన్నికలకు ముందు మంచి చేస్తానని చెప్పి... ఏరు దాటాక ముంచేశారంటూ అంగన్వాడీ సిబ్బంది ఆగ్రహం చెందుతున్నారు.
దుత్తలూరు, న్యూస్టుడే: జిల్లాలో 12 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 2,934 అంగన్వాడీ, 229 మినీ కేంద్రాలు ఉన్నాయి. 2,673 మంది కార్యకర్తలతోపాటు 2,665 మంది సహాయకులు (ఆయాలు) పనిచేస్తున్నారు. మినీ కేంద్రాల్లో 226 మంది విధులు నిర్వహిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం కంటే రూ. వెయ్యి అదనంగా వేతనం పెంచటమే కాదు... సమస్యలన్నీ పరిష్కరిస్తామంటూ 2019 ఎన్నికలకు ముందు అంగన్వాడీ సిబ్బందికి జగన్ హామీ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక ఒక్క సమస్య పరిష్కరించలేదు. రకరకాల యాప్లు, సర్వేల పేరుతో అదనపు పనిభారం మోపారు. నాలుగున్నరేళ్లు ఓపికగా ఎదురుచూసినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో విధిలేక సమ్మె బాట పట్టారు. అయినా ప్రభుత్వం ఎస్మా, ఉద్యోగాల తొలగింపు తదితర అస్త్రాలతో బెదిరించి విధుల్లో చేరేలా చేసిందే తప్ప చిరుద్యోగులైన వారి సమస్య ఒక్కటైనా తీర్చుదామన్నా ప్రయత్నం చేయలేదు.
- గత అయిదేళ్లలో టీఏ, డీఏలు, కూరగాయలు, నిత్యావసర సరకులకు సకాలంలో ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదు. గ్యాస్, నిత్యావసర వస్తువులకు సంబంధించి అంగన్వాడీలు సొంత డబ్బులే చెల్లించే పరిస్థితి నెలకొంది. ఎప్పటి నుంచో డిమాండు చేస్తున్న వేతన పెంపు, గ్రాట్యుటీ, మినీ కేంద్రాల సిబ్బందిని ప్రధాన కార్యకర్తలుగా గుర్తింపు, ఆయాలకు అంగన్వాడీలుగా పదోన్నతి, ఉద్యోగ విరమణ వయసు పెంపు, కేంద్రాల అద్దె బకాయిలు సకాలంలో చెల్లింపులు... ఇలా ఏ ఒక్కటీ కూడా పరిష్కారానికి నోచుకోలేదని వారు వాపోతున్నారు. తెదేపా హయాంలో అన్నీ పథకాలు వర్తిస్తుండగా జగన్ పాలనలో అంగన్వాడీలను అమ్మఒడి, విద్యా, వసతి దీవెనలు, ఒంటరి, వితంతు, దివ్యాంగులకు సామాజిక పింఛన్లు తదితర పథకాలకు అనర్హులను చేసింది.
- పదకొండు డిమాండ్లతో అంగన్వాడీ సిబ్బంది గత ఏడాది డిసెంబరు 12 నుంచి జనవరి 22 వరకు అంగన్వాడీలు నిరవధిక సమ్మె చేస్తే ప్రభుత్వ చర్చల్లో భాగంగా సమ్మె కాలానికి వేతనం ఇస్తామని హామీ ఇచ్చింది.
పనికి తగ్గ వేతనం లేదు
ఓ అంగన్వాడీ కార్యకర్త
ప్రభుత్వం పనిభారం మోపుతుందే తప్ప దానికి తగ్గట్లుగా వేతనం ఇవ్వటంలేదు. ఎన్నికలకు ముందు అధికారంలోకి వస్తే సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఒక్క సమస్య పరిష్కరించిన దాఖలాల్లేవు. దీనికితోడు కార్యకర్తలు, ఆయాలకు నెలనెలా సక్రమంగా జీతాలు అందకపోతుండటంతో కుటుంబ పోషణ భారంగా మారుతోంది. నిత్యావసర సరకుల బిల్లులు సకాలంలో మంజూరు చేయకపోవడంతో అప్పులు చేసి చిన్నారులకు వడ్డించాల్సి వస్తోంది. తెలంగాణలో ఇచ్చే గౌరవ వేతనాన్ని ఇక్కడ కూడా అమలు చేయాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పేకమేడలా.. జగనన్న ఇళ్లు.. చేతితో లాగితే ఊడుతున్న శ్లాబ్!
[ 19-05-2024]
వెంకటాచలం మండలం కంటేపల్లికి చెందిన అద్దూరు కామాక్షికి ప్రభుత్వం జగనన్న కాలనీలో ఇంటి స్థలంతో పాటు పక్కా ఇళ్లు మంజూరు చేసింది. -
రోడ్లు అధ్వానం.. పట్టించుకోని ప్రభుత్వం
[ 19-05-2024]
కందుకూరు నియోజకవర్గంలో రహదారులు అధ్వానంగా మారాయి. ఏళ్ల తరబడి ప్రభుత్వం పట్టించుకున్న పాపానపోలేదు. -
బోర్లు.. బాగు చేస్తే దాహం తీరు
[ 19-05-2024]
ఎండలు ముదిరాయి. రక్షిత పథకాలు పనిచేయడం లేదు. తాగునీటికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఈసమయంలో ఉపయోగపడే చేతి పంపులు అలంకారప్రాయంగా మారాయి -
అతి తక్కువ వడ్డీకే రిటెయిల్ రుణాలు
[ 19-05-2024]
తక్కువ వడ్డీకే రిటెయిల్ రుణాలు ఇవ్వనున్నట్లు యూనియన్ బ్యాంక్ రీజనల్ హెడ్ రాజశేఖర్ పేర్కొన్నారు. -
తాళం వేసిన ఇళ్లే లక్ష్యం.. రాత్రులు దొంగతనం
[ 19-05-2024]
రాత్రుల్లో తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను పోలీసులు అరెస్టు చేశారు. -
జాతీయ రహదారిపై ప్రమాదం
[ 19-05-2024]
జాతీయ రహదారిపై వెళుతూ ఆగిన లారీని కారు ఢీకొనడంతో నలుగురికి తీవ్ర గాయాలైన ఘటన నార్తురాజుపాళెం సమీపంలో జాతీయ రహదారిపై జరిగింది. -
హతవిధీ..పట్టించుకునేవారేరీ!
[ 19-05-2024]
నెల్లూరు నగరంలోని ప్రసిద్ధ బారా షహీద్ దర్గా పాలకులు, అధికారుల నిర్లక్ష్యానికి గురవుతోంది. -
22న జిల్లాకు గవర్నర్ రాక
[ 19-05-2024]
రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఈ నెల 22వ తేదీ నెల్లూరుకు రానున్నట్లు కలెక్టర్ హరినారాయణన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. -
మెట్ట రైలుపై చిన్న చూపు
[ 19-05-2024]
మెట్ట ప్రాంత వాసుల దశాబ్దాల కల.. నడికుడి- శ్రీకాళహస్తి రైల్వే లైన్.. అయిదేళ్ల వైకాపా పాలనలో ఈ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేయడంతో.. పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయి -
స్ట్రాంగ్ రూమ్కు పోస్టల్ బ్యాలెట్లు
[ 19-05-2024]
నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి పోస్టులో వచ్చిన పోస్టల్ బ్యాలెట్లను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములో ఉంచి సీల్ వేశారు. -
నేటి నుంచి పెంచలకోన బ్రహ్మోత్సవాలు
[ 19-05-2024]
బ్రహ్మోత్సవాలకు పెంచలకోన క్షేత్రం ముస్తాబైంది. నేటి నుంచి ప్రారంభమయ్యే ఉత్సవాలు 25వ తేదీ వరకు జరగనుండగా- ఆదివారం స్వామి అత్తారిల్లుగా చెప్పుకొనే గోనుపల్లి ఆలయం నుంచి ఉత్సవ మూర్తులను పెంచలకోన క్షేత్రానికి చేర్చనున్నారు.