logo

పింక్‌ మోడల్‌ పోలింగ్‌ కేంద్రం ప్రారంభం

పట్టణంలోని ఎన్జీవో కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన పింక్‌ మోడల్‌ పోలింగ్‌ కేంద్రాన్ని ఆదివారం జనరల్‌ పరిశీలకులు రామ్‌కుమార్‌గౌతమ్‌, సబ్‌కలెక్టర్‌ జి.విద్యాధరి ప్రారంభించారు.

Published : 06 May 2024 05:50 IST

మోడల్‌ పోలింగ్‌ కేంద్రాన్ని పరిశీలిస్తున్న అధికారులు రామ్‌కుమార్‌గౌతమ్‌, విద్యాధరి

కందుకూరు పట్టణం, న్యూస్‌టుడే: పట్టణంలోని ఎన్జీవో కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన పింక్‌ మోడల్‌ పోలింగ్‌ కేంద్రాన్ని ఆదివారం జనరల్‌ పరిశీలకులు రామ్‌కుమార్‌గౌతమ్‌, సబ్‌కలెక్టర్‌ జి.విద్యాధరి ప్రారంభించారు. వారు మాట్లాడుతూ పోలింగ్‌ కేంద్రం 144ను పింక్‌ మోడల్‌ కేంద్రంగా మార్చినట్లు తెలిపారు. ప్రధానంగా ఓటు హక్కు వినియోగంలో మహిళల్ని చైతన్యం చేసేందుకు పింక్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ నెల 13న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటును వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఏవో రవికుమార్‌, ఏఎస్‌వో కృష్ణవేణి, మున్సిపల్‌కమిషనర్‌ కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని