ఉద్యోగుల ఓట్లకు వైకాపా బేరసారాలు
ఉద్యోగులు, ఉపాధ్యాయుల పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు అధికార వైకాపా బేరసారాలు సాగిస్తోంది. తమ విధానాలపై గుర్రుగా ఉన్న ఆయా వర్గాలను ప్రసన్నం చేసుకునేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తోంది.
నెల్లూరు(కలెక్టరేట్), న్యూస్టుడే: ఉద్యోగులు, ఉపాధ్యాయుల పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు అధికార వైకాపా బేరసారాలు సాగిస్తోంది. తమ విధానాలపై గుర్రుగా ఉన్న ఆయా వర్గాలను ప్రసన్నం చేసుకునేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తోంది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 19,834 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉండగా- వాటి వినియోగంలో గందరగోళానికి గురవుతున్నారు. ఎక్కువ సంఖ్యలో ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు. చాలా మందికి బ్యాలెట్ విడుదల కాలేదు. ఈ క్రమంలో మొత్తం 19,834 ఓట్లకు.. ఆది, సోమవారాల్లో 14,541 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఇతర జిల్లాల ఓటర్లు 2,548 ఉండగా- 1,374 మంది ఓటు వేశారు. సోమవారం కావలి జడ్పీ హైస్కూల్లో ఓటింగ్ ప్రక్రియ గంట ఆలస్యంగా ప్రారంభమవగా- ఉద్యోగులు అవస్థలు పడ్డారు. ఈ కేంద్రం వద్దనే.. కొందరు నాయకులు డబ్బు పంపిణీ చేయడం చర్చనీయాంశమైంది. వెంకటాచలం క్యూబా ఇంజినీరింగ్ కళాశాల వద్ద తెదేపా ఏజెంట్ను పోలీసులు బయటకు పంపడం స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది.
అధికార పార్టీ ఆపసోపాలు
కందుకూరు, నెల్లూరు గ్రామీణం, ఆత్మకూరు, సర్వేపల్లి, కావలి నియోజకవర్గాల్లో ఒక్కో పోస్టల్ బ్యాలెట్కు అధికార పార్టీ నాయకులు రూ.అయిదు వేలు ఇవ్వడంతో పాటు.. ఓటు వేసేందుకు కార్లు కూడా సమకూర్చినట్లు సమాచారం. ఆ క్రమంలో కొందరు ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆ మొత్తాలను తిరస్కరించినట్లు తెలిసింది. పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకుంటున్న వారిలో ఎక్కువ శాతం మంది ఉపాధ్యాయులు ఉండటం.. సీపీఎస్ ఆందోళన నేపథ్యంలో వారిపై వైకాపా ప్రభుత్వం ఉక్కుపాదం మోపడం తదితరాలతో తమకు అనుకూలంగా ఉండరనే నెపంతో గందరగోళానికి, ఇబ్బందులకు గురి చేస్తున్నారనే ఆరోపిస్తున్నారు. అధికార పార్టీకే ఓటు వేసినట్లు చరవాణిలో ఫొటోలు తీసి తమకు పంపాలని కొన్ని సంఘాల నాయకులు ఉద్యోగులను కోరారన్న సమాచారం వివాదాస్పదమవుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జిల్లా వ్యాప్తంగా కార్డన్ సెర్చ్
[ 19-05-2024]
నెల్లూరు ఎస్పీ ఆరీఫ్ హఫీస్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ఠాణాల పరిధిలో పోలీసులు కార్డన్ సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. -
పేకమేడలా.. జగనన్న ఇళ్లు.. చేతితో లాగితే ఊడుతున్న శ్లాబ్!
[ 19-05-2024]
వెంకటాచలం మండలం కంటేపల్లికి చెందిన అద్దూరు కామాక్షికి ప్రభుత్వం జగనన్న కాలనీలో ఇంటి స్థలంతో పాటు పక్కా ఇళ్లు మంజూరు చేసింది. -
రోడ్లు అధ్వానం.. పట్టించుకోని ప్రభుత్వం
[ 19-05-2024]
కందుకూరు నియోజకవర్గంలో రహదారులు అధ్వానంగా మారాయి. ఏళ్ల తరబడి ప్రభుత్వం పట్టించుకున్న పాపానపోలేదు. -
బోర్లు.. బాగు చేస్తే దాహం తీరు
[ 19-05-2024]
ఎండలు ముదిరాయి. రక్షిత పథకాలు పనిచేయడం లేదు. తాగునీటికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఈసమయంలో ఉపయోగపడే చేతి పంపులు అలంకారప్రాయంగా మారాయి -
అతి తక్కువ వడ్డీకే రిటెయిల్ రుణాలు
[ 19-05-2024]
తక్కువ వడ్డీకే రిటెయిల్ రుణాలు ఇవ్వనున్నట్లు యూనియన్ బ్యాంక్ రీజనల్ హెడ్ రాజశేఖర్ పేర్కొన్నారు. -
తాళం వేసిన ఇళ్లే లక్ష్యం.. రాత్రులు దొంగతనం
[ 19-05-2024]
రాత్రుల్లో తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను పోలీసులు అరెస్టు చేశారు. -
జాతీయ రహదారిపై ప్రమాదం
[ 19-05-2024]
జాతీయ రహదారిపై వెళుతూ ఆగిన లారీని కారు ఢీకొనడంతో నలుగురికి తీవ్ర గాయాలైన ఘటన నార్తురాజుపాళెం సమీపంలో జాతీయ రహదారిపై జరిగింది. -
హతవిధీ..పట్టించుకునేవారేరీ!
[ 19-05-2024]
నెల్లూరు నగరంలోని ప్రసిద్ధ బారా షహీద్ దర్గా పాలకులు, అధికారుల నిర్లక్ష్యానికి గురవుతోంది. -
22న జిల్లాకు గవర్నర్ రాక
[ 19-05-2024]
రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఈ నెల 22వ తేదీ నెల్లూరుకు రానున్నట్లు కలెక్టర్ హరినారాయణన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. -
మెట్ట రైలుపై చిన్న చూపు
[ 19-05-2024]
మెట్ట ప్రాంత వాసుల దశాబ్దాల కల.. నడికుడి- శ్రీకాళహస్తి రైల్వే లైన్.. అయిదేళ్ల వైకాపా పాలనలో ఈ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేయడంతో.. పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయి -
స్ట్రాంగ్ రూమ్కు పోస్టల్ బ్యాలెట్లు
[ 19-05-2024]
నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి పోస్టులో వచ్చిన పోస్టల్ బ్యాలెట్లను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములో ఉంచి సీల్ వేశారు. -
నేటి నుంచి పెంచలకోన బ్రహ్మోత్సవాలు
[ 19-05-2024]
బ్రహ్మోత్సవాలకు పెంచలకోన క్షేత్రం ముస్తాబైంది. నేటి నుంచి ప్రారంభమయ్యే ఉత్సవాలు 25వ తేదీ వరకు జరగనుండగా- ఆదివారం స్వామి అత్తారిల్లుగా చెప్పుకొనే గోనుపల్లి ఆలయం నుంచి ఉత్సవ మూర్తులను పెంచలకోన క్షేత్రానికి చేర్చనున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
15 శాతం స్థానికేతర కోటా యథాతథం
-
ట్రంప్నకు జాతీయ రైఫిల్ అసోసియేషన్ మద్దతు..!
-
బుక్ చేస్తే 24 గంటల్లో నీటి ట్యాంకర్
-
ఇంటి దొంగల గుండెల్లో రైళ్లు.. పల్నాట రంగంలోకి దిగిన ప్రత్యేక దర్యాప్తు బృందం
-
గతేడాది ‘ఫైనల్’ ఓవర్ పునరావృతం అవుతుందనుకున్నా: రుతురాజ్ గైక్వాడ్
-
భయపెడుతున్న ఏపీ రెవెన్యూ, ద్రవ్యలోటు