మరమ్మతుల మాటేమిటి?
వర్షాకాలం త్వరలో ఆరంభం కానుంది. ఆలోపు లోతట్టు ప్రాంతాలు, వరదనీటి కాల్వల మరమ్మతులు చేపట్టాల్సిన యంత్రాంగం నిర్లక్ష్యం వహిస్తోంది. అప్పటి జనాభా అవసరాలకు అనుగుణంగా జిల్లా కేంద్రంలో వరద కాల్వలను నిర్మించారు.
కాల్వలు ధ్వంసం.. వరదొస్తే నష్టం
ఏటా సమస్య పునరావృతం
న్యూస్టుడే, కామారెడ్డి పట్టణం
‘జిల్లా కేంద్రంలోని వాసవీనగర్లో వరద కాల్వ కూలిపోయింది. గతేడాది కురిసిన వర్షాలకు వరద ఉద్ధృతంగా ప్రవహించింది. దీంతో స్థానికంగా వాన నీరు ఉప్పొంగింది. అయినా ఇప్పటివరకు ఎలాంటి మరమ్మతులు చేపట్టలేదు.’
వర్షాకాలం త్వరలో ఆరంభం కానుంది. ఆలోపు లోతట్టు ప్రాంతాలు, వరదనీటి కాల్వల మరమ్మతులు చేపట్టాల్సిన యంత్రాంగం నిర్లక్ష్యం వహిస్తోంది. అప్పటి జనాభా అవసరాలకు అనుగుణంగా జిల్లా కేంద్రంలో వరద కాల్వలను నిర్మించారు. ఈ కాల్వల పనులు ప్రజారోగ్యశాఖ పర్యవేక్షించింది. ఆ తర్వాత పురపాలికకు అప్పగించారు. పట్టణంలో తాజా పరిస్థితిపై ఇప్పటివరకు యంత్రాంగం ఎలాంటి చర్యలు చేపట్టలేదు.
పరిస్థితి ఇదీ..
జిల్లా కేంద్రంలో లోతు తక్కువ తీసి వరద నీటి కాల్వలు ఏర్పాటు చేయడంతో వాన నీటితో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. నిబంధనల మేరకు 3-4 మీటర్ల లోతు పూడిక తీసి నిర్మాణాలు చేపట్టాలి. అందుకు భిన్నంగా 2 మీటర్ల లోతు తీసి సీసీతో దిమ్మెలు నిర్మించారు. వరద ఉద్ధృతికి ఆయా ప్రాంతాల్లో నిర్మాణాలు ధ్వంసమయ్యాయి. నాలుగైదేళ్లకు ఓసారి మరమ్మతులు చేపట్టాల్సి ఉన్నా చర్యలు కరవయ్యాయి.
‘కామారెడ్డి ఉపాధ్యాయకాలనీలో వరద నీటి కాల్వ ధ్వంసమైంది. ఈ కాలనీ నుంచి గాంధీనగర్ మీదుగా వాసవీనగర్, సిరిసిల్లరోడ్డు ప్రాంతాల నుంచి సమీప నాలాలోకి వరద వెళ్తుంది. రెండేళ్ల క్రితం మరమ్మతులు చేపట్టారు. గతేడాది కురిసిన వర్షానికి కాల్వ కొట్టుకుపోయింది.’
ఎక్కడెక్కడంటే..
జిల్లా కేంద్రంలోని కొత్త పట్టణంలో అశోక్నగర్, స్నేహపురికాలనీ, రుక్మిణికుంట, పంచముఖి హనుమాన్కాలనీ, బతుకమ్మకుంట, ఉపాధ్యాయకాలనీ, గాంధీనగర్, వాసవీనగర్ మీదుగా సిరిసిల్లరోడ్డులోని నాలాకు వరద వెళ్తుంది. మరో మార్గంలో జన్మభూమి రోడ్డు, చెరువు ప్రాంతం మీదుగా వరద హౌసింగ్బోర్డు కాలనీలోని నాలాలో కలుస్తుంది. పట్టణంలో 11 కి.మీ మేర 16.85 కోట్లతో చేపట్టిన కాల్వలు అక్కడక్కడ ధ్వంసమై ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
ఇప్పుడు దృష్టిపెడితేనే..
పురపాలక యంత్రాంగం వరద కాల్వలపై ప్రత్యేక దృష్టి పెట్టి ఈ పక్షం రోజుల్లో మరమ్మతు పనులు చేపట్టాలి. వార్డుల్లో ఇంజినీరింగ్ విభాగ అధికారులు సర్వే చేపట్టాలి. ప్రత్యేక నిధుల కోసం సర్కారుకు నివేదించాలని పురవాసులు కోరుతున్నారు. కాగా వానాకాలంలో తలెత్తే ఇబ్బందులపై అప్రమత్తంగా ఉంటామని పురపాలక కమిషనర్ సుజాత ‘న్యూస్టుడే’తో పేర్కొన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో సర్వే చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాన్నకు వందనం
[ 16-06-2024]
: నాన్న.. త్యాగాలకు నిలువెత్తు రూపం. కష్టాల కడలిలో ఒడ్డుకు చేర్చే నావికుడు. భవితకు మార్గం చూపే మార్గదర్శకుడు. -
గిరిజన జీవితాలే.. నా పుస్తకాలు
[ 16-06-2024]
గిరిజన జీవితాలను, విభిన్న మనస్తత్వాలను సుఖదుఃఖాలను లోతుగా పరిశీలించారు. తను చూసిన బతుకునీ, తన వాళ్ల వెతల్నీ, కథల్నీ కవిత్వంలో చెప్పాలనుకున్నాడు. -
అటవీ అధికారులకు రక్షణ కల్పించాలి
[ 16-06-2024]
అడవుల సంరక్షణ, భూములు అన్యాక్రాంతం కాకుండా విధులు నిర్వహిస్తున్న తమకు ప్రభుత్వం రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఫారెస్టు రేంజ్ అధికారుల సంఘం(బాసర సర్కిల్) ఉపాధ్యక్షుడు రవిమోహన్ భట్, జూనియర్ అటవీ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు సుధాకర్ పేర్కొన్నారు. -
విక్రయించిన ప్రతి బస్తాకూ లెక్క
[ 16-06-2024]
విత్తనాలు, ఎరువుల విక్రయాల్లో నిబంధనలు పాటించాలని, విక్రయించిన ప్రతి బస్తాకు లెక్కలుండాలని అదనపు కలెక్టర్ కిరణ్ ఆదేశించారు. -
ఎమ్మెల్యే సార్లూ.. మీరంతా కదలండీ
[ 16-06-2024]
జిల్లాలో ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు డిమాండ్ ఏళ్లుగా ఉంది. ఎన్నికల సందర్భాల్లో అన్ని పార్టీలు హామీలిస్తున్నాయి. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం
[ 16-06-2024]
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందిన సంఘటన మండల పరిధిలోని బేగంపూర్ చౌరస్తా వద్ద 161వ జాతీయ రహదారిపై శనివారం చోటు చేసుకుంది. -
ఇస్కాన్ కేంద్రానికి ప్రచార వాహనం అందజేత
[ 16-06-2024]
ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు చేపడుతున్న ఇస్కాన్ కంఠేశ్వర్ కేంద్రానికి మహేశ్వరి సేవా సమాజ్ సభ్యులు శనివారం ఉచితంగా ధర్మ ప్రచార వాహనం అందించారు. -
రైతులు ఓటీఎస్ను సద్వినియోగం చేసుకోవాలి
[ 16-06-2024]
సహకార బ్యాంకులో దీర్ఘకాలిక రుణాలు తీసుకున్న రైతులు ఓటీఎస్(వన్ టైం సెటిల్మెంట్)ను సద్వినియోగం చేసుకోవాలని ఉమ్మడి జిల్లాల సహకార బ్యాంకు మేనేజర్ సూర్య ప్రకాష్ పేర్కొన్నారు. -
అప్పు తీసుకొని.. అంతమొందించాడు
[ 16-06-2024]
ఇటీవల హత్యకు గురైన ఉప్పరి సాయవ్వ (70) హత్యకేసును పోలీసులు ఛేదించారు. ఈ మేరకు శనివారం బాన్సువాడ సీఐ మున్నూరు కృష్ణ పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
సంక్షేమ శాఖల్లో 581 పోస్టులు.. పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది
-
విచారణ పూర్తికాకముందే తీర్పు ఎలా ఇస్తారు?: జగదీశ్ రెడ్డి
-
‘నీట్’ వివాదం.. సుప్రీం ‘కమిటీ’తో దర్యాప్తు జరిపించాలి: సిబల్
-
రుషికొండపై రహస్యంగా విలాస భవనాలు కట్టారు: గంటా
-
జూన్ 30లోగా గనులను వేలం వేయాలి.. తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం సూచన
-
ఆ విషయంలో నన్నెవరూ అధిగమించలేరు: కుమార్తెపై రామ్ చరణ్ ప్రేమ