బడి బాగుకు నడుంబిగింపు
బడుల దశ మార్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మన ఊరు- మన బడి కార్యక్రమం కింద రాష్ట్రవ్యాప్తంగా రూ.7289 కోట్లు కేటాయించింది. సర్కారు బడుల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడంతో పాటు ప్రైవేటు విద్యాసంస్థల్లో రుసుముల నియంత్రణకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. అధ్యయనం అనంతరం వారిచ్చే నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టనున్నారు. ఉమ్మడి జిల్లాలో అనేక పాఠశాలల్లో మౌలిక వసతులు లేక ఇబ్బందులెదురవుతున్నాయి. ప్రైవేటు విద్యాసంస్థల్లో...
ఫీ‘జులుం’కు ముకుతాడు
అంతా ఆంగ్లమయం
మంత్రివర్గ ఉపసంఘంపైనే ఆశలు
న్యూస్టుడే, నిజామాబాద్ విద్యావిభాగం
కామారెడ్డి జిల్లాకేంద్రంలోని తిలక్రోడ్డు ప్రభుత్వ పాఠశాలలో బల్లల దుస్థితి
బడుల దశ మార్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మన ఊరు- మన బడి కార్యక్రమం కింద రాష్ట్రవ్యాప్తంగా రూ.7289 కోట్లు కేటాయించింది. సర్కారు బడుల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడంతో పాటు ప్రైవేటు విద్యాసంస్థల్లో రుసుముల నియంత్రణకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. అధ్యయనం అనంతరం వారిచ్చే నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టనున్నారు. ఉమ్మడి జిల్లాలో అనేక పాఠశాలల్లో మౌలిక వసతులు లేక ఇబ్బందులెదురవుతున్నాయి. ప్రైవేటు విద్యాసంస్థల్లో విచ్చలవిడిగా íÆ‘ˆజులుం’ కొనసాగుతోంది. ఆంగ్ల మాధ్యమం కోసం వేలాది మంది విద్యార్థులు ప్రైవేటు విద్యాలయాలను ఆశ్రయిస్తున్నారు. తాజాగా సర్కారు తీసుకున్న నిర్ణయాలు కార్యరూపం దాల్చితే పేద, మధ్యతరగతి వర్గాలకు ఊరట కలుగుతోంది.
కామారెడ్డిలోని గోదాంరోడ్డులోని ఓ ప్రాథమిక బడిలో వంట గది లేక ఇబ్బందులు
కుంటు‘బడి’
ఉమ్మడి జిల్లాలో 2,245 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. కొవిడ్ కారణంగా రెండేళ్లుగా బోధన కుంటుబడింది. దీనికి తోడు వసతుల లేమి వేధిస్తోంది. అనేక తరగతి గదులు వినియోగంలో లేక శిథిల దశకు చేరాయి. మరమ్మతులు చేయకపోవడంతో ఎప్పుడే ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి. ప్రహరీలు, తాగునీటి వసతి లేకపోవడం, తలుపులు, కిటికీలు, బల్లలు విరిగిపోవడంతో చదువులెలా కొనసాగించాలో ప్రశ్నార్థకమైంది. ఏళ్లుగా విద్యాశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపుతున్నా నిధుల విడుదలలో నిర్లక్ష్యం ఆవరించింది. మధ్యాహ్న భోజన నిర్వహణ నామమాత్రంగా మారింది. మరుగుదొడ్లు, మూత్రశాలలు లేక సమస్య ఎదురవుతోంది. ఉమ్మడి జిల్లాలో 1,41,643 బల్లలు లేక పిల్లలు కింద కూర్చునే పాఠాలు వింటున్నారు. ఇటీవల పాఠశాలల్లో మౌలిక వసతులపై పంపిన నివేదిక ఆధారంగా నిధులు కేటాయిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంతో ఆశలు నెలకొన్నాయి.
చదువు‘కొనే’ పరిస్థితి లేకుండా..
ఉమ్మడి జిల్లాలో పేద, మధ్యతరగతి వర్గాలు ఒకరిని చూసి మరొకరు ప్రైవేటు విద్యాసంస్థల్లో పిల్లల్ని చేర్పిస్తున్నారు. అందులో ఎల్కేజీకి రూ.15 వేల- 20 వేలు, ఒకటో తరగతికి రూ.20 వేల- 28 వేలు వసూలు చేస్తున్నారు. స్థాయి లేేకున్నా పిల్లల భవిష్యత్తు కోసం అప్పులు చేసి మరీ చదివిస్తున్నారు. కార్పొరేట్ విద్యాసంస్థల్లో రుసుముల సంగతి చెప్పక్కర్లేదు. కొవిడ్ వేళ ఆర్థిక సమస్యలతో ప్రభుత్వ బడుల్లో చేరేందుకు మొగ్గు చూపారు. తాజాగా రుసుముల నియంత్రణపై సర్కారు తీసుకున్న నిర్ణయంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
గ్రామీణ విద్యార్థులకు ప్రోత్సాహం
ఉమ్మడి జిల్లాలో 562 బడుల్లో ఆంగ్ల మాధ్యమం అమలవుతోంది. నేటి పోటీ ప్రపంచంలో తెలుగు చదవలంటే తల్లిదండ్రులు విముఖత చూపుతున్నారు. ప్రస్తుతం ప్రాథమిక, ఉన్నత స్థాయిలో కొన్ని బడులకే ఆంగ్ల మాధ్యమం అనుమతించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ బడుల్లో ప్రవేశపెట్టాలని సర్కారు నిర్ణయం తీసుకుంది. గ్రామీణ విద్యార్థులను ప్రోత్సహించేలా చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుత నిర్ణయాలతో ప్రభుత్వ బడుల దశ- దిశ మారే అవకాశాలున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్
[ 27-04-2024]
మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు. నారాయణఖేడ్ నియోజకవర్గ అభివృద్ధికి భరోసా కల్పించారు. -
పల్లె పిలుస్తోంది.. పదండి..
[ 27-04-2024]
పిల్లలూ.. మీరు పట్టణాల్లో ఉంటున్నా.. మీ మూలాలు పల్లెలకు చెంది ఉంటాయి. అక్కడి ప్రత్యేకతలేంటో మీకు తెలుసా మరీ.. పట్టణాలకు చెందిన వారే కాదు.. -
పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్లు 17,04,867 మంది
[ 27-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ ఓటర్ల తుది జాబితాను అధికారులు శుక్రవారం విడుదల చేశారు. -
బాజిరెడ్డికి 1.. అర్వింద్కు 2.. జీవన్రెడ్డికి 3...
[ 27-04-2024]
నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో త్రిముఖ పోరు నెలకొంది. భాజపా, కాంగ్రెస్, భారాస అభ్యర్థులు నామినేషన్ ప్రక్రియ ప్రారంభానికి ముందు నుంచే ప్రచారం ముమ్మరం చేశారు. -
మద్యం మత్తు.. ప్రాణాలు తీస్తోంది
[ 27-04-2024]
గతేడాది అక్టోబరు 28న ధర్మారం(బీ)లో పెట్రోల్ బంక్ వద్ద డిచ్పల్లి వైపు వస్తున్న నిజామాబాద్కు చెందిన యువతీ యువకులను కారు ఢీ కొంది. -
పది మంది నామినేషన్ల తిరస్కరణ
[ 27-04-2024]
నిజామాబాద్ లోక్సభ స్థానానికి దాఖలైన నామినేషన్లను కలెక్టరేట్లో శుక్రవారం సాధారణ ఎన్నికల పరిశీలకురాలు ఎలిస్వజ్ సమక్షంలో పరిశీలించారు. -
సార్వత్రిక పరీక్షలు.. అయినవాళ్లకే విధులు
[ 27-04-2024]
ఓపెన్ స్కూల్ సొసైటీకి సంబంధించిన పది, ఇంటర్ పరీక్షలు గురువారం ప్రారôభమయ్యాయి. ఏటా వేసవిలో నిర్వహించే ఈ పరీక్షలకు ఇన్విజిలేటర్ల నియామకంలో పైరవీలకే పెద్దపీట వేస్తున్నట్లు ఉపాధ్యాయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. -
చేరికలపై హస్తం పార్టీ దృష్టి
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక లోకసభ స్థానాల్లో విజయం సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక కసరత్తు చేస్తోంది. -
జిల్లాలో పెరిగిన ఓటర్లు
[ 27-04-2024]
జిల్లా ఓటర్ల సంఖ్య పెరిగింది. జహీరాబాద్ లోక్సభ పరిధిలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల్లో మొత్తంగా 4,127 మంది ఓటర్లు పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. -
అనారోగ్యాన్ని జయించి... ఇంటర్లో ప్రతిభ చూపి
[ 27-04-2024]
అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురికి రెండేళ్ల కిందట వరుసగా రెండు శస్త్రచికిత్సలు చేసినా ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ఆ కుటుంబం తల్లిడిల్లిపోయింది. -
ఎండలతో ఆలస్యంగా సమావేశాలు
[ 27-04-2024]
ప్రస్తుతం బయటకు వెళ్లాలంటే ఎండ తక్కువ ఉన్నప్పుడే చూసుకుని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. -
ఎన్నికల క్షేత్రంలో మాజీ పాలనాధికారులు
[ 27-04-2024]
నిజామాబాద్ జిల్లా కలెక్టర్లుగా ఇది వరకు పనిచేసి పదవీ విరమణ పొందిన అధికారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. -
2 నదులు 2 లోక్సభ నియోజకవర్గాలు
[ 27-04-2024]
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రధాన నదులు రెండు. అవి గోదావరి, మంజీర. అలాగే ఉమ్మడి జిల్లా రెండు లోక్సభ నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉంది. -
గీత దాటితే.. జైలుకే
[ 27-04-2024]
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నియమావళిని ఎన్నికల సంఘం కఠినంగా అమలు చేయనుంది. -
అతివేగంతోనే ప్రమాదం
[ 27-04-2024]
కమ్మర్పల్లి నుంచి బడాపహాడ్కు గురువారం రాత్రి సుమారు 36 మంది భక్తులతో వెళ్తున్న డీసీఎం వాహనం బోల్తాపడి ఇద్దరు మృతిచెందగా.. పలువురు గాయపడిన సంగతి తెలిసిందే. -
భర్త గొంతు నులిమి చంపిన భార్య
[ 27-04-2024]
కుమార్తెను మానసికంగా వేధిస్తున్న భర్తను భార్య గొంతు నులిమి చంపిన ఘటన కులాస్పూర్లో గురువారం రాత్రి చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?