అంకాపూర్ రుచి.. అమెరికా చేరి
చుట్టూ పచ్చని పంటచేలు.. నగరాన్ని తలపించేలా అందమైన భవనాలతో కొలువుదీరిన అంకాపూర్ వ్యవసాయంలో ఎంత పేరు తెచ్చుకుందో అదే స్థాయిలో నాటుకోడి కూరను వండటంలో పేరుగాంచింది. ఇతర చోట్ల ఎక్కడ తిన్నా ఈ రుచి రాదు.
రోజుకు 600 పార్శిళ్లు.. రూ. 4 లక్షల వ్యాపారం
న్యూస్టుడే, ఆర్మూర్ గ్రామీణం
చుట్టూ పచ్చని పంటచేలు.. నగరాన్ని తలపించేలా అందమైన భవనాలతో కొలువుదీరిన అంకాపూర్ వ్యవసాయంలో ఎంత పేరు తెచ్చుకుందో అదే స్థాయిలో నాటుకోడి కూరను వండటంలో పేరుగాంచింది. ఇతర చోట్ల ఎక్కడ తిన్నా ఈ రుచి రాదు.
దాదాపు 40 ఏళ్ల కిందట గ్రామంలో మొదట తాళ్లపల్లి రామాగౌడ్ అనే వ్యక్తి ఈ నాటుకోడి కూర వండటం ప్రారంభించారు. ఈయన చేసే చికెన్ కారంగా, ఘాటుగా అద్భుతమైన రుచి ఉండటంతో.. స్థానికంగా అందరి నోళ్లలో పడి మెల్లమెల్లగా జిల్లా కేంద్రంతో పాటు చుట్టుపక్కల జిల్లాలకు పాకింది. ఇది తినేందుకే ఆదివారాలు ఇక్కడికి వచ్చే వారున్నారు. రోజురోజుకు డిమాండ్ పెరుగుతుండటంతో కుటుంబమంతా ఆర్డర్ మీద కావాల్సిన వాళ్లకు పంపించే వ్యాపారం కొనసాగించారు. క్రమంగా ఊర్లో ఇతరులూ ఆర్డర్ మెస్లు ప్రారంభించారు. మొదట్లో చుట్టుపక్కల గ్రామాల వారికి సరఫరా చేయగా ప్రస్తుతం గల్ఫ్దేశాలు, అమెరికాకు సైతం పార్శిళ్లు వెళ్తున్నాయి.
ప్రస్తుతం గ్రామంలో సుమారు 20 మంది ఈ ప్రత్యేక వంటకం నేర్చుకొని వ్యాపారం చేస్తున్నారు. వ్యవసాయరంగంలో ఈ గ్రామానికి జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు రావడంతో ఇక్కడికి రైతులు, సందర్శకులు నిత్యం వందల మంది వచ్చిపోతుంటారు. పాతికేళ్లుగా దేశ విదేశాల అతిథులు ఇక్కడికి వచ్చి రైతులు చేస్తున్న వినూత్న వ్యవసాయంపై అధ్యయనం చేసి స్థానిక రుచులను ఆస్వాదించి వెళ్తున్నారు. అలా అంకాపూర్ ‘దేశీ చికెన్’గా ఇక్కడి వంటకం ప్రత్యేకంగా పేరు సంపాదించుకుంది. కుటుంబంలో సుమారు నలుగురు ఉంటే అందరూ ఇదే వృత్తిలో ఉపాధి పొందుతున్నారు. ప్రస్తుతం గ్రామంలో 20 ఆర్డర్ మెస్లు వెలిశాయి. ఒక్కొక్క హోటల్లో సుమారు 30 కిలోల నాటుకోడి కూరను వండి ఆర్డర్ ద్వారా అందిస్తున్నారు. రూ.600 నుంచి రూ. 650కి ఒక్కో నాటుకోడి, నలుగురికి సరిపడా భోజనం (అన్నం) అందిస్తారు. గ్రామంలో నిత్యం రూ.4 లక్షల వరకు వ్యాపారం జరుగుతోంది. సాధారణ రోజుల్లో 2400 మంది, ఆదివారాలు 3500 మంది వరకు తింటారు.
ప్రత్యేకంగా మసాలాలు
నాటుకోడి కూర వండేందుకు మసాలాలు ప్రత్యేకంగా ఎప్పుటికప్పుడు తయారు చేసుకుంటారు. ధనియాలు, లవంగాలు, యాలకులు, కొబ్బరి పొడి, అల్లం, ఎల్లిగడ్డ, ఉల్లి, కొత్తిమీర, పుదీనా వంటకానికి ముందే దంచి పెట్టుకుంటారు. వంటలో వాడేందుకు నాణ్యమైన నూనె ఉపయోగిస్తారు.
ఎల్లలు దాటుతున్న రుచి
అంకాపూర్ దేశీ చికెన్ రుచి తెలిసిన వారు ఈ మార్గంలో ప్రయాణిస్తే తినకుండా వెళ్లరు. చుట్టుపక్కల ఎక్కడ సమావేశాలు, విందులు ఉన్నా ఈ ఊరు నాటుకోడి కూర విధిగా ఉండాల్సిందే. ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం అంకాపూర్ పర్యటనకు వచ్చినప్పుడు రుచి ఆస్వాదించారు. నిజామాబాద్, ఆదిలాబాద్, జగిత్యాల, నిర్మల్, కరీంనగర్, హైదరాబాద్తో పాటు గల్ఫ్ దేశాలు, అమెరికాకు తీసుకెళ్తున్నారు.
రోజుకు 30 కిలోలు వండుతాం
- భూమేశ్, అంకాపూర్
ఇదే వృత్తిగా ఎంచుకొని కుటుంబంలో అందరం కలిసి పని చేస్తాం. చుట్టుపక్కల గ్రామాలు తిరిగి సహజ సిద్ధంగా పెరిగే దేశీ కోళ్లను కొనుగోలు చేస్తాం. కూరలో ఉపయోగించే కారం, మసాలాలు స్వయంగా తయారు చేసుకుంటాం. దీంతో వంటకానికి మంచి రుచి వస్తుంది. రోజుకు 30 కిలోల నాటుకోడి కూరను ఆర్డర్ ద్వారా అందిస్తా. రుచి, నాణ్యతగా పాటించడంతో డిమాండ్ ఉంటోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్
[ 27-04-2024]
మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు. నారాయణఖేడ్ నియోజకవర్గ అభివృద్ధికి భరోసా కల్పించారు. -
పల్లె పిలుస్తోంది.. పదండి..
[ 27-04-2024]
పిల్లలూ.. మీరు పట్టణాల్లో ఉంటున్నా.. మీ మూలాలు పల్లెలకు చెంది ఉంటాయి. అక్కడి ప్రత్యేకతలేంటో మీకు తెలుసా మరీ.. పట్టణాలకు చెందిన వారే కాదు.. -
పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్లు 17,04,867 మంది
[ 27-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ ఓటర్ల తుది జాబితాను అధికారులు శుక్రవారం విడుదల చేశారు. -
బాజిరెడ్డికి 1.. అర్వింద్కు 2.. జీవన్రెడ్డికి 3...
[ 27-04-2024]
నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో త్రిముఖ పోరు నెలకొంది. భాజపా, కాంగ్రెస్, భారాస అభ్యర్థులు నామినేషన్ ప్రక్రియ ప్రారంభానికి ముందు నుంచే ప్రచారం ముమ్మరం చేశారు. -
మద్యం మత్తు.. ప్రాణాలు తీస్తోంది
[ 27-04-2024]
గతేడాది అక్టోబరు 28న ధర్మారం(బీ)లో పెట్రోల్ బంక్ వద్ద డిచ్పల్లి వైపు వస్తున్న నిజామాబాద్కు చెందిన యువతీ యువకులను కారు ఢీ కొంది. -
పది మంది నామినేషన్ల తిరస్కరణ
[ 27-04-2024]
నిజామాబాద్ లోక్సభ స్థానానికి దాఖలైన నామినేషన్లను కలెక్టరేట్లో శుక్రవారం సాధారణ ఎన్నికల పరిశీలకురాలు ఎలిస్వజ్ సమక్షంలో పరిశీలించారు. -
సార్వత్రిక పరీక్షలు.. అయినవాళ్లకే విధులు
[ 27-04-2024]
ఓపెన్ స్కూల్ సొసైటీకి సంబంధించిన పది, ఇంటర్ పరీక్షలు గురువారం ప్రారôభమయ్యాయి. ఏటా వేసవిలో నిర్వహించే ఈ పరీక్షలకు ఇన్విజిలేటర్ల నియామకంలో పైరవీలకే పెద్దపీట వేస్తున్నట్లు ఉపాధ్యాయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. -
చేరికలపై హస్తం పార్టీ దృష్టి
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక లోకసభ స్థానాల్లో విజయం సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక కసరత్తు చేస్తోంది. -
జిల్లాలో పెరిగిన ఓటర్లు
[ 27-04-2024]
జిల్లా ఓటర్ల సంఖ్య పెరిగింది. జహీరాబాద్ లోక్సభ పరిధిలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల్లో మొత్తంగా 4,127 మంది ఓటర్లు పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. -
అనారోగ్యాన్ని జయించి... ఇంటర్లో ప్రతిభ చూపి
[ 27-04-2024]
అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురికి రెండేళ్ల కిందట వరుసగా రెండు శస్త్రచికిత్సలు చేసినా ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ఆ కుటుంబం తల్లిడిల్లిపోయింది. -
ఎండలతో ఆలస్యంగా సమావేశాలు
[ 27-04-2024]
ప్రస్తుతం బయటకు వెళ్లాలంటే ఎండ తక్కువ ఉన్నప్పుడే చూసుకుని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. -
ఎన్నికల క్షేత్రంలో మాజీ పాలనాధికారులు
[ 27-04-2024]
నిజామాబాద్ జిల్లా కలెక్టర్లుగా ఇది వరకు పనిచేసి పదవీ విరమణ పొందిన అధికారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. -
2 నదులు 2 లోక్సభ నియోజకవర్గాలు
[ 27-04-2024]
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రధాన నదులు రెండు. అవి గోదావరి, మంజీర. అలాగే ఉమ్మడి జిల్లా రెండు లోక్సభ నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉంది. -
గీత దాటితే.. జైలుకే
[ 27-04-2024]
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నియమావళిని ఎన్నికల సంఘం కఠినంగా అమలు చేయనుంది. -
అతివేగంతోనే ప్రమాదం
[ 27-04-2024]
కమ్మర్పల్లి నుంచి బడాపహాడ్కు గురువారం రాత్రి సుమారు 36 మంది భక్తులతో వెళ్తున్న డీసీఎం వాహనం బోల్తాపడి ఇద్దరు మృతిచెందగా.. పలువురు గాయపడిన సంగతి తెలిసిందే. -
భర్త గొంతు నులిమి చంపిన భార్య
[ 27-04-2024]
కుమార్తెను మానసికంగా వేధిస్తున్న భర్తను భార్య గొంతు నులిమి చంపిన ఘటన కులాస్పూర్లో గురువారం రాత్రి చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?