విజయ ప్రతిజ్ఞ
ఎందరో విద్యావంతులను లక్ష్యం వైపు నడిపిస్తున్నారు.. మరెందరో నిరుపేద విద్యార్థులను విజయ తీరాలకు చేర్చుతున్నారు..
పేదరికం నుంచి కలల కొలువుకు
గ్రూప్స్ శిక్షకురాలిగా ఎందరికో తోడ్పాటు
న్యూస్టుడే, భిక్కనూరు: ఎందరో విద్యావంతులను లక్ష్యం వైపు నడిపిస్తున్నారు.. మరెందరో నిరుపేద విద్యార్థులను విజయ తీరాలకు చేర్చుతున్నారు.. ఇంకెందరో కలలను సాకారం చేస్తున్నారు... ఆమే తెవివి దక్షిణ ప్రాంగణం జియోఇన్ఫర్మేటిక్స్ విభాగం సహాయ ఆచార్యురాలు డా.తాటికొండ ప్రతిజ్ఞ. ఇటీవల పీహెచ్డీ గైడ్గా అర్హత సాధించడంతో పాటు ప్రతిష్ఠాత్మకమైన మైనర్ రీసెర్చ్ ప్రాజెక్టును ప్రారంభించారు. ప్రస్తుతం కాంపిటీటివ్ సెల్ కోఆర్డినేటర్గా గ్రూప్స్కు సిద్ధమవుతున్న వారికి శిక్షణ అందిస్తున్నారు. కటిక పేదరికం నుంచి ఈ స్థాయికి ఎదిగిన తీరు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.
చిన్నప్పుడే అమ్మకు సాయంగా..: మాది నిర్మల్ జిల్లా భైంసా. నాన్న ప్రకాశ్.. కిరాణ దుకాణంలో పని చేసేవారు. ఆయన సంపాదనతో కుటుంబ పోషణ ఇబ్బందిగా మారడంతో అమ్మ విజయమాల ఇంట్లోనే పిండి వంటలు తయారు చేసి విక్రయించేవారు. అందుకే చిన్ననాటి నుంచే కష్టం, డబ్బు విలువ తెలుసుకోగలిగాను. ఎంత పేదరికం ఉన్నా చదువు ఆపకూడదని ‘ప్రతిజ్ఞ’ చేసుకున్నా. స్థానికంగా ఉన్న శిశుమందిర్లో పదో తరగతి పూర్తి చేశాను. అక్కడే ప్రభుత్వం జూనియర్ కళాశాలలో ఇంటర్ చదివాను. డిగ్రీకి నిజామాబాద్కు వచ్చా. ఖర్చులకు ఇంట్లో నుంచి డబ్బులు పంపే స్తోమత లేకపోవడంతో ట్యూషన్లు చెప్పా. ఆంగ్ల భాష నేర్చుకోవడానికి వార్తా పత్రికలు చదవాలనుకున్నా.. రోజూ కొనడానికి డబ్బులు లేకపోవడంతో దొరికిన పత్రికనే పదేపదే చదివేదాన్ని.
శాస్త్రీయ సంగీతం: చిన్నప్పటి నుంచే చదువుతో పాటు సంగీతం అంటే అమితమైన మక్కువ ఉండేది. ఉదయం నాలుగు గంటలకే లేచి హిందుస్థానీ సంగీతం నేర్చుకున్నా. గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ‘ఈటీవీ’లో ప్రసారమైన ‘పాడాలని ఉంది’లో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తాు. గాతారహే మేరా దిల్్ వంటి కార్యక్రమాల్లోనూ పాలుపంచుకున్నా.
బోధన.. శిక్షణ.. పరిశోధన: 2013లో సహాయ ఆచార్యురాలిగా దక్షిణ ప్రాంగణంలోని జియో ఇన్ఫర్మేటిక్స్ విభాగంలో చేరినప్పటి నుంచి బోధన, పోటీ పరీక్షార్థులకు శిక్షణ కొనసాగిస్తున్నా. ఇటీవల పరిశోధన కూడా ప్రారంభించాను. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ పథకం వల్ల ప్రజలకు సామాజికంగా, ఆర్థికంగా చేకూరిన లబ్ధి అనే అంశంపై పరిశోధన చేస్తున్నా. విద్యార్థుల శిక్షణార్థం ఏర్పాటు చేసిన కాంపిటీటివ్ సెల్ విభాగానికి సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నా. ఇప్పటి వరకు అనేక మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం ఎంతో సంతృప్తినిస్తోంది
ఉస్మానియా భవిష్యత్తును మార్చింది
పీజీ ప్రవేశ పరీక్ష రాసి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జాగ్రఫీ సీటు సాధించడం జీవితాన్నే మార్చేసింది. అక్కడి వాతావరణం, అధ్యాపకుల బోధనతో యూనివర్సిటీ టాపర్గా నిలిచా. ఓ వైపు పీజీ చదువుతూనే సివిల్స్, గ్రూప్స్ పరీక్షలకు సిద్ధమయ్యా. ఖర్చులకు ట్యూషన్లు కొనసాగించా. పీజీ రెండో సంవత్సరంలోనే నెట్ అర్హత సాధించా. రెండు నెలలపాటు ఓ యజ్ఞంలా చదివి గ్రూప్-2 పరీక్ష రాయడంతో సీనియర్ అకౌంటెంట్ ఉద్యోగం వరించింది.
పుస్తకాల రచన..
ప్రతిమా పబ్లికేషన్స్ ద్వారా గ్రూప్-2కు సన్నద్ధమయ్యే వారికి సులభంగా అర్థమయ్యేలా వాడుక భాషలో ఇండియన్ ఎకానమీ పుస్తకం రాశాను. అనేక మంది విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతోంది. మార్కెట్లో అత్యధికంగా అమ్ముడైంది. తెలుగు అకాడమీ ద్వారా విడుదల చేసిన సుమారు 12 జాగ్రఫీ పుస్తకాల రచనల్లోనూ భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్
[ 27-04-2024]
మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు. నారాయణఖేడ్ నియోజకవర్గ అభివృద్ధికి భరోసా కల్పించారు. -
పల్లె పిలుస్తోంది.. పదండి..
[ 27-04-2024]
పిల్లలూ.. మీరు పట్టణాల్లో ఉంటున్నా.. మీ మూలాలు పల్లెలకు చెంది ఉంటాయి. అక్కడి ప్రత్యేకతలేంటో మీకు తెలుసా మరీ.. పట్టణాలకు చెందిన వారే కాదు.. -
పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్లు 17,04,867 మంది
[ 27-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ ఓటర్ల తుది జాబితాను అధికారులు శుక్రవారం విడుదల చేశారు. -
బాజిరెడ్డికి 1.. అర్వింద్కు 2.. జీవన్రెడ్డికి 3...
[ 27-04-2024]
నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో త్రిముఖ పోరు నెలకొంది. భాజపా, కాంగ్రెస్, భారాస అభ్యర్థులు నామినేషన్ ప్రక్రియ ప్రారంభానికి ముందు నుంచే ప్రచారం ముమ్మరం చేశారు. -
మద్యం మత్తు.. ప్రాణాలు తీస్తోంది
[ 27-04-2024]
గతేడాది అక్టోబరు 28న ధర్మారం(బీ)లో పెట్రోల్ బంక్ వద్ద డిచ్పల్లి వైపు వస్తున్న నిజామాబాద్కు చెందిన యువతీ యువకులను కారు ఢీ కొంది. -
పది మంది నామినేషన్ల తిరస్కరణ
[ 27-04-2024]
నిజామాబాద్ లోక్సభ స్థానానికి దాఖలైన నామినేషన్లను కలెక్టరేట్లో శుక్రవారం సాధారణ ఎన్నికల పరిశీలకురాలు ఎలిస్వజ్ సమక్షంలో పరిశీలించారు. -
సార్వత్రిక పరీక్షలు.. అయినవాళ్లకే విధులు
[ 27-04-2024]
ఓపెన్ స్కూల్ సొసైటీకి సంబంధించిన పది, ఇంటర్ పరీక్షలు గురువారం ప్రారôభమయ్యాయి. ఏటా వేసవిలో నిర్వహించే ఈ పరీక్షలకు ఇన్విజిలేటర్ల నియామకంలో పైరవీలకే పెద్దపీట వేస్తున్నట్లు ఉపాధ్యాయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. -
చేరికలపై హస్తం పార్టీ దృష్టి
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక లోకసభ స్థానాల్లో విజయం సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక కసరత్తు చేస్తోంది. -
జిల్లాలో పెరిగిన ఓటర్లు
[ 27-04-2024]
జిల్లా ఓటర్ల సంఖ్య పెరిగింది. జహీరాబాద్ లోక్సభ పరిధిలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల్లో మొత్తంగా 4,127 మంది ఓటర్లు పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. -
అనారోగ్యాన్ని జయించి... ఇంటర్లో ప్రతిభ చూపి
[ 27-04-2024]
అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురికి రెండేళ్ల కిందట వరుసగా రెండు శస్త్రచికిత్సలు చేసినా ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ఆ కుటుంబం తల్లిడిల్లిపోయింది. -
ఎండలతో ఆలస్యంగా సమావేశాలు
[ 27-04-2024]
ప్రస్తుతం బయటకు వెళ్లాలంటే ఎండ తక్కువ ఉన్నప్పుడే చూసుకుని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. -
ఎన్నికల క్షేత్రంలో మాజీ పాలనాధికారులు
[ 27-04-2024]
నిజామాబాద్ జిల్లా కలెక్టర్లుగా ఇది వరకు పనిచేసి పదవీ విరమణ పొందిన అధికారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. -
2 నదులు 2 లోక్సభ నియోజకవర్గాలు
[ 27-04-2024]
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రధాన నదులు రెండు. అవి గోదావరి, మంజీర. అలాగే ఉమ్మడి జిల్లా రెండు లోక్సభ నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉంది. -
గీత దాటితే.. జైలుకే
[ 27-04-2024]
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నియమావళిని ఎన్నికల సంఘం కఠినంగా అమలు చేయనుంది. -
అతివేగంతోనే ప్రమాదం
[ 27-04-2024]
కమ్మర్పల్లి నుంచి బడాపహాడ్కు గురువారం రాత్రి సుమారు 36 మంది భక్తులతో వెళ్తున్న డీసీఎం వాహనం బోల్తాపడి ఇద్దరు మృతిచెందగా.. పలువురు గాయపడిన సంగతి తెలిసిందే. -
భర్త గొంతు నులిమి చంపిన భార్య
[ 27-04-2024]
కుమార్తెను మానసికంగా వేధిస్తున్న భర్తను భార్య గొంతు నులిమి చంపిన ఘటన కులాస్పూర్లో గురువారం రాత్రి చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?