చక్కదిద్దాల్సిందే
వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి హరీశ్రావు.. పిట్లం, మద్నూర్, బిచ్కుందలో పలు అభివృద్ధి పనులతోపాటు డోంగ్లీ మండలాన్ని ప్రారంభించేందుకు శనివారం వస్తున్నారు.
మొక్కుబడిగా సర్కారు వైద్యసేవలు
నేడు మంత్రి హరీశ్రావు పర్యటన
ఈనాడు డిజిటల్, కామారెడ్డి
వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి హరీశ్రావు.. పిట్లం, మద్నూర్, బిచ్కుందలో పలు అభివృద్ధి పనులతోపాటు డోంగ్లీ మండలాన్ని ప్రారంభించేందుకు శనివారం వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ నెలకొన్న సమస్యల పరిష్కారంపై దృష్టి సారించి రోగుల కన్నీరు తుడిస్తే పేదలకు ప్రయోజనం దక్కనుంది.
దృష్టి పెట్టాల్సిందే..
పేద, మధ్యతరగతి ప్రజల అత్యవసర వైద్యానికి ప్రభుత్వ ఆసుపత్రులే దిక్కు. సరిహద్దు మండలమైన మద్నూర్ సామాజిక ఆరోగ్య ఆసుపత్రిలో ఎనిమిది మంది వైద్యులకు గాను ముగ్గురే ఉన్నారు. బిచ్కుందలో రూ.3 కోట్లతో 30 పడకల ఆసుపత్రిని ప్రారంభించారు. రెండేళ్లు కావొస్తున్నా ఇప్పటికీ పూర్తిస్థాయిలో వైద్యులను నియమించకపోవడంతో దవాఖానాలోని రూ.కోట్ల విలువైన పరికరాలు వృథాగా ఉంటున్నాయి.
అంతా ఫోనోలోనే..
నియోజకవర్గంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రదర్శించే వైద్యుల జాబితాలో ఉన్నవారు ఫోన్ చేస్తే తప్ప రారని స్థానికులు పేర్కొంటున్నారు. కొన్ని సందర్భాల్లో ఫోన్లోనే వివరాలు కనుక్కొని చికిత్స సూచిస్తారు.
ఈసారైనా పూర్తి చేయాలే..
పిట్లం ఆసుపత్రి ఇరుకుగా ఉండటంతో రోగులకు సేవలందని పరిస్థితి. కొత్త భవనం నిర్మాణానికి 2009లో శంకుస్థాపన చేసినప్పటికీ నిధులు మంజూరు కాక పనులు చేపట్టలేదు. తాజాగా మంత్రి హరీశ్రావు శంకుస్థాపన చేస్తున్నారు. ఈసారైనా నిర్మాణం పూర్తి చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
మద్నూర్లో పడకల దుస్థితి
ఏర్పాట్ల పరిశీలన..
ఏఎంసీ సముదాయాల వద్ద నాయకులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే హన్మంత్షిండే
పిట్లం: మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 30 పడకల ఆసుపత్రి భవన నిర్మాణానికి భూమిపూజ, పిట్లం ఏఎంసీ నూతన దుకాణ సముదాయం ప్రారంభోత్సవానికి శనివారం మంత్రి హరీశ్రావు పిట్లం రానున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ప్రభుత్వ ఆసుపత్రి, ఏఎంసీ దుకాణ సముదాయాల వద్ద ఏర్పాట్లను ఎమ్మెల్యే హన్మంత్ షిండే పరిశీలించారు. వెంట జడ్పీటీసీ సభ్యుడు శ్రీనివాస్రెడ్డి, వైస్ ఎంపీపీ లక్ష్మారెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ సాయిరెడ్డి, వైద్యులు శివకుమార్, రోహిత్కుమార్, నాయకులు విజయ్, వెంకట్రామ్రెడ్డి తదితరులున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్
[ 27-04-2024]
మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు. నారాయణఖేడ్ నియోజకవర్గ అభివృద్ధికి భరోసా కల్పించారు. -
పల్లె పిలుస్తోంది.. పదండి..
[ 27-04-2024]
పిల్లలూ.. మీరు పట్టణాల్లో ఉంటున్నా.. మీ మూలాలు పల్లెలకు చెంది ఉంటాయి. అక్కడి ప్రత్యేకతలేంటో మీకు తెలుసా మరీ.. పట్టణాలకు చెందిన వారే కాదు.. -
పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్లు 17,04,867 మంది
[ 27-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ ఓటర్ల తుది జాబితాను అధికారులు శుక్రవారం విడుదల చేశారు. -
బాజిరెడ్డికి 1.. అర్వింద్కు 2.. జీవన్రెడ్డికి 3...
[ 27-04-2024]
నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో త్రిముఖ పోరు నెలకొంది. భాజపా, కాంగ్రెస్, భారాస అభ్యర్థులు నామినేషన్ ప్రక్రియ ప్రారంభానికి ముందు నుంచే ప్రచారం ముమ్మరం చేశారు. -
మద్యం మత్తు.. ప్రాణాలు తీస్తోంది
[ 27-04-2024]
గతేడాది అక్టోబరు 28న ధర్మారం(బీ)లో పెట్రోల్ బంక్ వద్ద డిచ్పల్లి వైపు వస్తున్న నిజామాబాద్కు చెందిన యువతీ యువకులను కారు ఢీ కొంది. -
పది మంది నామినేషన్ల తిరస్కరణ
[ 27-04-2024]
నిజామాబాద్ లోక్సభ స్థానానికి దాఖలైన నామినేషన్లను కలెక్టరేట్లో శుక్రవారం సాధారణ ఎన్నికల పరిశీలకురాలు ఎలిస్వజ్ సమక్షంలో పరిశీలించారు. -
సార్వత్రిక పరీక్షలు.. అయినవాళ్లకే విధులు
[ 27-04-2024]
ఓపెన్ స్కూల్ సొసైటీకి సంబంధించిన పది, ఇంటర్ పరీక్షలు గురువారం ప్రారôభమయ్యాయి. ఏటా వేసవిలో నిర్వహించే ఈ పరీక్షలకు ఇన్విజిలేటర్ల నియామకంలో పైరవీలకే పెద్దపీట వేస్తున్నట్లు ఉపాధ్యాయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. -
చేరికలపై హస్తం పార్టీ దృష్టి
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక లోకసభ స్థానాల్లో విజయం సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక కసరత్తు చేస్తోంది. -
జిల్లాలో పెరిగిన ఓటర్లు
[ 27-04-2024]
జిల్లా ఓటర్ల సంఖ్య పెరిగింది. జహీరాబాద్ లోక్సభ పరిధిలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల్లో మొత్తంగా 4,127 మంది ఓటర్లు పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. -
అనారోగ్యాన్ని జయించి... ఇంటర్లో ప్రతిభ చూపి
[ 27-04-2024]
అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురికి రెండేళ్ల కిందట వరుసగా రెండు శస్త్రచికిత్సలు చేసినా ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ఆ కుటుంబం తల్లిడిల్లిపోయింది. -
ఎండలతో ఆలస్యంగా సమావేశాలు
[ 27-04-2024]
ప్రస్తుతం బయటకు వెళ్లాలంటే ఎండ తక్కువ ఉన్నప్పుడే చూసుకుని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. -
ఎన్నికల క్షేత్రంలో మాజీ పాలనాధికారులు
[ 27-04-2024]
నిజామాబాద్ జిల్లా కలెక్టర్లుగా ఇది వరకు పనిచేసి పదవీ విరమణ పొందిన అధికారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. -
2 నదులు 2 లోక్సభ నియోజకవర్గాలు
[ 27-04-2024]
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రధాన నదులు రెండు. అవి గోదావరి, మంజీర. అలాగే ఉమ్మడి జిల్లా రెండు లోక్సభ నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉంది. -
గీత దాటితే.. జైలుకే
[ 27-04-2024]
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నియమావళిని ఎన్నికల సంఘం కఠినంగా అమలు చేయనుంది. -
అతివేగంతోనే ప్రమాదం
[ 27-04-2024]
కమ్మర్పల్లి నుంచి బడాపహాడ్కు గురువారం రాత్రి సుమారు 36 మంది భక్తులతో వెళ్తున్న డీసీఎం వాహనం బోల్తాపడి ఇద్దరు మృతిచెందగా.. పలువురు గాయపడిన సంగతి తెలిసిందే. -
భర్త గొంతు నులిమి చంపిన భార్య
[ 27-04-2024]
కుమార్తెను మానసికంగా వేధిస్తున్న భర్తను భార్య గొంతు నులిమి చంపిన ఘటన కులాస్పూర్లో గురువారం రాత్రి చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?