రాష్ట్రంలో చివరి స్థానం
కామారెడ్డి జిల్లాలో ఇంటర్ ఫలితాలు నిరాశపరిచాయి. తొలిసారిగా రాష్ట్రస్థాయిలో జిల్లా అట్టడుగు స్థాయికి పడిపోయింది. 35వ స్థానంలో నిలిచింది.
నిరాశాజనకంగా ఇంటర్ ఫలితాలు
ప్రథమంలో 34.81, ద్వితీయంలో 44.29 శాతం ఉత్తీర్ణత
ఈనాడు, కామారెడ్డి, కామారెడ్డి విద్యావిభాగం, న్యూస్టుడే: కామారెడ్డి జిల్లాలో ఇంటర్ ఫలితాలు నిరాశపరిచాయి. తొలిసారిగా రాష్ట్రస్థాయిలో జిల్లా అట్టడుగు స్థాయికి పడిపోయింది. 35వ స్థానంలో నిలిచింది. ప్రథమ సంవత్సరంలో 34.81 శాతం, ద్వితీయ సంవత్సరంలో 44.29 శాతం ఉత్తీర్ణత నమోదైంది. గతంలో కొవిడ్ కారణంగా 70 శాతం ప్రణాళికతో పరీక్షలు జరిగాయి. గతేడాది నుంచి వందశాతం పాఠ్యప్రణాళికతో పరీక్షలు నిర్వహిస్తున్నారు. పూర్తిస్థాయిలో ప్రత్యక్ష తరగతులు నిర్వహించడంతో ఉత్తీర్ణత శాతం కొంత మెరుగైంది. ఐదేళ్లలో 50 నుంచి 68 శాతం నమోదు కాగా ఈ ఏడాది ఫలితాలు ఊహించని విధంగా కంగుతినిపించాయి.
అమ్మాయిలదే పైచేయి
ఫలితాల్లో అమ్మాయిలే పైచేయి సాధించారు. మొదటి సంవత్సరంలో విద్యార్థినులు 44.18 శాతం ఉత్తీర్ణత సాధించారు. అబ్బాయిలు 38.73 శాతం ఉత్తీర్ణులయ్యారు. అబ్బాయిల కన్నా అమ్మాయిలు 5.45 శాతం అధికంగా ఫలితాలు నమోదు చేశారు. రెండో సంవత్సరంలో అమ్మాయిల ఉత్తీర్ణత శాతం 53.9 శాతం కాగా అబ్బాయిలు 34.21 శాతం ఉత్తీర్ణత శాతం సాధించారు.
వృత్తివిద్యా కోర్సుల్లో..
వృత్తివిద్యా కోర్సు(వొకేషనల్) ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో జిల్లా 28వ స్థానంలో నిలిచింది. 86 విద్యార్థులకు గాను 29 మంది (33.72 శాతం) ఉత్తీర్ణులయ్యారు. మొదటి సంవత్సరంలో 26వ స్థానంలో నిలవగా 46.67 శాతం ఉత్తీర్ణత నమోదైంది. మొత్తం విద్యార్థులు 1502 మందికిగాను 701 మంది ఉత్తీర్ణులయ్యారు.
పర్యవేక్షణ లోపమే కారణం
కొవిడ్ తర్వాత 2021-22 విద్యాసంవత్సరంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో జిల్లాలో ఉత్తీర్ణత 59 శాతం, 2022-23లో 67 శాతం నమోదు కాగా.. ఈ ఏడాది మాత్రం 44.29 శాతానికే పరిమితమైంది. ముఖ్యంగా ప్రభుత్వ కళాశాలల్లో ప్రత్యేక తరగతుల నిర్వహణపై యంత్రాంగం పర్యవేక్షణ కొరవడింది. మండలాల్లోని జూనియర్ కళాశాలల్లో ఫలితాలు రాబట్టేందుకు అధికారుల కసరత్తు అంతంతమాత్రంగానే చేశారనే ఆరోపణలున్నాయి. రాష్ట్రస్థాయిలో చిట్టచివరి స్థానంలో కామారెడ్డి జిల్లా నిలవడం ఫలితాలను పరిశీలిస్తే అర్థమవుతుంది. కాగా జిల్లాలో ఆయా చోట్ల మాస్ కాపీయింగ్కు పాల్పడిన చోట్ల పర్యవేక్షకులు కఠినంగా వ్యవహరించారు. సదాశివనగర్ మండలంలో నలుగురు అధ్యాపకులు సస్పెన్షన్కు గురయ్యారు. దీంతో అన్ని కేంద్రాల్లో పరీక్షలను పకడ్బందీగా నిర్వహించారు. దీంతో విద్యార్థులు కొంత మేర భయంభయంగా పరీక్షలు రాయడం.. ఆ ప్రభావం ఫలితాలపై పడింది.
అనుత్తీర్ణులు నిరాశ చెందొద్దు
షేక్ సలాం, ఇంటర్ నోడల్ జిల్లా అధికారి
ఇంటర్ ఫలితాల్లో అనుత్తీర్ణులైన వారు నిరాశచెందొద్దు. ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడొద్దు. త్వరలో నిర్వహించే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాసి మెరుగైన ఫలితాలు సాధించాలి. గతంలో కన్నా ఈ సారి ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు తగ్గాయి. రాష్ట్రస్థాయిలో కామారెడ్డి జిల్లా ఆఖరు స్థానంలో నిలవడం బాధాకరం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హనుమాన్ చాలీసా పారాయణ్ వార్షికోత్సవ సమ్మేళనం
[ 04-05-2024]
హిందూ వాహిని ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా పారాయణ్ వార్షికోత్సవ సమ్మేళనం కామారెడ్డిలోని ధర్మశాలలో శనివారం నిర్వహించారు. -
భారీ మెజారిటీతో గెలిపించాలి
[ 04-05-2024]
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా పల్లె పొగడ తాండ, బొల్లారం గ్రామాలలో కాంగ్రెస్ నాయకులు ప్రచారం నిర్వహించారు. -
గుండెపోటుతో ఉపాధి హామీ కూలీ మృతి
[ 04-05-2024]
ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న ఓ కూలీ గుండెపోటుతో మృతి చెందారు. ఈ ఘటన మండలంలోని జప్తి జాన్కంపల్లి గ్రామంలో జరిగింది. -
నీటి సరఫరాకు అంతరాయం తలెత్తొద్దు
[ 04-05-2024]
వేసవి నేపథ్యంలో ప్రజలకు తాగునీటి సరఫరాలో అంతరాయం తలెత్తకుండా చూడాలని గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి, జిల్లా ప్రత్యేకాధికారి శరత్ తెలిపారు. -
ప్రాంగణాలు.. బేజారు..!
[ 04-05-2024]
మహాలక్ష్మి పథకం నేపథ్యంలో ప్రాంగణాల్లో రద్దీ పెరిగింది. ప్రయాణికుల క్షేమమే ధ్యేయంగా భావించే ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణాల్లో మాత్రం మౌలిక వసతుల కల్పనలో విఫలమవుతోంది. -
మాతృభాషలో తడబాటు
[ 04-05-2024]
తన తల్లిదండ్రులు, ఇరుగుపొరుగు వారి నుంచి ఏ భాష వింటూ, ఇబ్బంది లేకుండా తన్మయత్వంతో నేర్చుకుంటున్నారో అందులోనే మందగమనం మొదలైంది. -
వజ్రాయుధాన్ని వదులుకోవద్దు!
[ 04-05-2024]
ఓటు రాజ్యాంగం కల్పించిన హక్కు. ప్రజాస్వామ్య పరిరక్షణకు వజ్రాయుధం. ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలంటూ ఎన్నికల అధికారులు ఎన్నో చైతన్య కార్యక్రమాలు చేపడుతున్నారు. -
ఇంటి నుంచే ఓటు ప్రారంభం
[ 04-05-2024]
అర్బన్ నియోజకవర్గంలో ఇంటి నుంచే ఓటు వేసేందుకు దరఖాస్తు చేసుకున్న వారి కోసం ఓటు వేసే ప్రక్రియను శుక్రవారం ప్రారంభించారు. -
కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యం
[ 04-05-2024]
కాంగ్రెస్తోనే అభివృద్ధి జరుగుతుందని ఆ పార్టీ నిజామాబాద్ లోక్సభ అభ్యర్థి జీవన్రెడ్డి పేర్కొన్నారు. -
‘చక్కెర పరిశ్రమపై హస్తం పార్టీ డ్రామా’
[ 04-05-2024]
చక్కెర పరిశ్రమపై రైతులను మభ్యపెట్టేందుకు కాంగ్రెస్ డ్రామా అడుతోందని ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు -
స్వతంత్రులు నామమాత్రమేనా..?
[ 04-05-2024]
అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో అనేక మంది స్వతంత్రులుగా పోటీచేస్తున్నా కనీస ప్రభావం చూపలేకపోతున్నారు. -
ఓటింగ్ శాతంపెంపునకు ప్రాధాన్యం
[ 04-05-2024]
జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికలకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా యంత్రాంగం ముందుకు సాగుతోంది. -
‘భాజపాతోనే అభివృద్ధి సాధ్యం’
[ 04-05-2024]
ప్రధాని మోదీ చేసిన అభివృద్ధిని చూసి ఓటెయ్యాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. -
‘పదేళ్లలో చేసిందేమీ లేదు’
[ 04-05-2024]
పదేళ్లలో ఎంపీ బీబీపాటిల్ బాన్సువాడ నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి ఏమీలేదని జహీరాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కార్ అన్నారు. -
నిర్భయంగా ఓటేయాలి
[ 04-05-2024]
నిర్భయంగా ఓటేయాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీకళాశాల ఆవరణలోని సెల్ఫీపాయింట్ వద్ద శుక్రవారం స్వీయ చిత్రం దిగారు. -
ఎవరికెంత మెజార్టీ అంటే..!
[ 04-05-2024]
నిజామాబాద్ లోక్సభ స్థానానికి ఇప్పటివరకు 17 ఎన్నికలు జరిగాయి. -
ఇష్టారీతిన ఇసుక తవ్వకాలు
[ 04-05-2024]
కాస్బాగ్ తండా వెనుక ప్రాంతంలో ఉన్న పోతుల మోరి వాగు చెక్డ్యామ్ వద్ద ఇష్టారీతిన ఇసుక తవ్వకాలు చేసి వ్యాపారులు రూ.లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు. -
‘భాజపాను గద్దెదించాలి’
[ 04-05-2024]
ప్రజా సంక్షేమం, సమాజాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తున్న భాజపాను గద్దెదించాలని జాగో తెలంగాణ కన్వీనర్ ఆకునూరి మురళి పేర్కొన్నారు. -
‘గల్ఫ్ కార్మికుల ప్రశ్నలకు అర్వింద్ సమాధానాలు ఇవ్వాలి’
[ 04-05-2024]
గల్ఫ్ కార్మికుల ఓట్లు అడిగేముందు నిజామాబాద్ ఎంపీ అర్వింద్.. వారి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని టీపీసీసీ ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ మంద భీమ్రెడ్డి డిమాండ్ చేశారు. -
పురపాలికలకు ముందస్తు ఆదాయం
[ 04-05-2024]
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పురపాలికలకు ‘ముందస్తు’ ఆదాయం వచ్చింది. -
ఓట్లతోనే జాతీయ, ప్రాంతీయ పార్టీల గుర్తింపు
[ 04-05-2024]
జాతీయ, ప్రాంతీయ పార్టీలు అని తరచూ వింటూ ఉంటాం. జాతీయ పార్టీలు దిల్లీ కేంద్రంగా, ప్రాంతీయ పార్టీలు ఆయా రాష్ట్రాల రాజధానుల కేంద్రంగా పనిచేస్తాయి. -
ఎన్నికల సహాయకేంద్రంలో సీసీ వీరంగం..!
[ 04-05-2024]
కలెక్టరేట్ కార్యాలయంలో ఓ ఉన్నతాధికారి వద్ద సీసీగా పనిచేస్తున్న వ్యక్తి గురువారం రాత్రి కలెక్టరేట్లో వీరంగం సృష్టించినట్లు తెలిసింది.
తాజా వార్తలు (Latest News)
-
రఫాపై దండయాత్ర జరిగితే..రక్తపాతమే: WHO ఆందోళన
-
ముంబయి ఘోర ప్రదర్శన.. అత్యంత కన్ఫ్యూజ్డ్ టీమ్ ఇదేనేమో : గ్రేమ్ స్మిత్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఎయిరిండియా కొత్త బ్యాగేజీ రూల్స్.. ఫ్రీ బ్యాగేజీ పరిమితి తగ్గింపు
-
‘డైరెక్టర్స్ డే’ ఈవెంట్ తేదీ మార్పు.. కొత్త డేట్ ఎప్పుడంటే!
-
‘భారత్ తలుపులు తెరిచే ఉన్నాయి’.. బైడెన్ వ్యాఖ్యలపై జైశంకర్ కౌంటర్!